‘మగధీర’, ‘ఈగ’; ‘బాహుబలి’ సినిమాలతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు సంపాదించిన దర్శకుడు రాజమౌళి. ముఖ్యంగా ‘బాహుబలి’ అనేక దేశాల్లో సంచలన వసూళ్లు సాధించి రాజమౌళికి అంతర్జాతీయ స్థాయిలో ఎనలేని గుర్తింపు తెచ్చింది. రాజమౌళిని ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఫాలో అవుతుంటారు కాబట్టి ఆయన ఏం మాట్లాడినా ఆచితూచే మాట్లాడాలి.
వేరే సినిమాల గురించి స్పందించేటపుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఐతే భాషా భేదం లేకుండా ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్ని ఆకట్టుకుని నాలుగు ఆస్కార్ అవార్డులు కూడా గెలిచిన ‘పారసైట్’ గురించి ఆయన ఈ మధ్య ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమా తనకు బోర్ కొట్టించిందని.. మధ్యలో నిద్ర పోయానని అన్నారు. తనకు ఆ సినిమా నచ్చలేదంటే సరిపోయేది.
కానీ మధ్యలో నిద్రపోయాను అనే కామెంట్ చేసేసరికి చాలామంది హర్టయ్యారు. ప్రపంచం మెచ్చి.. ఆస్కార్ జ్యూరీ కూడా అబ్బురపడ్డ సినిమాను ఇంత తేలిగ్గా తీసిపడేయడమేంటి అన్న ప్రశ్న ఉత్పన్నమైంది.
దీనిపై ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి వివరణ ఇచ్చాడు. ఆస్కార్ అవార్డు గెలిచిన సినిమా గురించి అలా ఎలా మాట్లాడారు అని జక్కన్నను అడిగితే..
‘‘పారసైట్ నచ్చకపోవడం అన్నది నా వ్యక్తిగత అభిరుచి. ఇక ఆస్కార్ జ్యూరీ ప్రమాణాలంటారా? అక్కడ కూడా లాబీయింగ్ చాలానే ఉంటుంది. మీ సినిమాను జ్యూరీ సభ్యులు చూడాలంటే చాలా తతంగమే ఉటుంది. అయినా సరే నిర్దేశించిన కొన్ని ప్రమాణాలు పాటిస్తుంటారని ప్రపంచం మొత్తం నమ్ముతుంటుంది. ఎంత లాబీయింగ్ ఉన్నప్పటికీ చెత్త సినిమాను తీసుకెళ్లి పాస్ చేయించి అవార్డు తీసుకునే పరిస్థితి ఉండదంటారు. అదెలా జరుగుతుందనే విషయంలో నాకు పరిజ్ఞానం లేదు. గతంలో ఆస్కార్ సినిమాలు కొన్ని నాకు నచ్చాయి. కొన్ని నచ్చలేదు’’ అని చెప్పాడు.
ఐతే ఆస్కార్ జ్యూరీ లాబీయింగ్ గురించి రాజమౌళి చెప్పిన మాటలు వింటే వారి విషయంలో ఆయనకు సదభిప్రాయం లేనట్లుంది. ‘బాహుబలి’ గురించి ఎంతో చెప్పుకున్నప్పటికీ.. అదెంతా ఆదరరణ పొందినప్పటికీ.. ఇండియా నుంచి కూడా ఆస్కార్ ఎంట్రీకి ఎంపిక కాని సంగతి తెలిసిందే.
This post was last modified on April 24, 2020 7:32 pm
అత్యంత క్రేజ్ ఉన్న ప్యాన్ ఇండియా సినిమాల్లో ముందు వరసలో ఉన్న అల్లు అర్జున్ - అట్లీ కాంబో మీద…
స్టార్ లెగసి ఉన్న బ్యాక్ గ్రౌండ్ నుంచి హీరోలు రావడం కొత్త కాదు. అన్ని భాషల్లో జరిగేదే. కానీ లెజెండరీ…
ఇంకో 22 రోజులు ఉండగానే మే నెల బాక్సాఫీస్ క్యాలికులేషన్లు మొదలైపోయాయి. ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని తెలిశాక…
ఏపీ రాజధానిగా అమరావతిని కేంద్రం నోటిఫై చేసిన నేపథ్యంలో దీనికి చట్టబద్ధత కలిగింది. అయితే.. ఇక నుంచి అమరావతిని ప్రత్యేకంగా…
శత్రువులో సైతం మంచి లక్షణం ఉంటే మెచ్చుకునే సంస్కృతి భారత్ సొంతం. రామాయణ, భారత, భాగవతాలు కూడా ఇదే చెబుతున్నాయి.…
ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో పెద్ది విడుదల తేదీ గురించి ఎడతెగని చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఏప్రిల్ 30 రాదని కన్ఫర్మ్ అయ్యాక…