‘మగధీర’, ‘ఈగ’; ‘బాహుబలి’ సినిమాలతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు సంపాదించిన దర్శకుడు రాజమౌళి. ముఖ్యంగా ‘బాహుబలి’ అనేక దేశాల్లో సంచలన వసూళ్లు సాధించి రాజమౌళికి అంతర్జాతీయ స్థాయిలో ఎనలేని గుర్తింపు తెచ్చింది. రాజమౌళిని ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఫాలో అవుతుంటారు కాబట్టి ఆయన ఏం మాట్లాడినా ఆచితూచే మాట్లాడాలి.
వేరే సినిమాల గురించి స్పందించేటపుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఐతే భాషా భేదం లేకుండా ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్ని ఆకట్టుకుని నాలుగు ఆస్కార్ అవార్డులు కూడా గెలిచిన ‘పారసైట్’ గురించి ఆయన ఈ మధ్య ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమా తనకు బోర్ కొట్టించిందని.. మధ్యలో నిద్ర పోయానని అన్నారు. తనకు ఆ సినిమా నచ్చలేదంటే సరిపోయేది.
కానీ మధ్యలో నిద్రపోయాను అనే కామెంట్ చేసేసరికి చాలామంది హర్టయ్యారు. ప్రపంచం మెచ్చి.. ఆస్కార్ జ్యూరీ కూడా అబ్బురపడ్డ సినిమాను ఇంత తేలిగ్గా తీసిపడేయడమేంటి అన్న ప్రశ్న ఉత్పన్నమైంది.
దీనిపై ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి వివరణ ఇచ్చాడు. ఆస్కార్ అవార్డు గెలిచిన సినిమా గురించి అలా ఎలా మాట్లాడారు అని జక్కన్నను అడిగితే..
‘‘పారసైట్ నచ్చకపోవడం అన్నది నా వ్యక్తిగత అభిరుచి. ఇక ఆస్కార్ జ్యూరీ ప్రమాణాలంటారా? అక్కడ కూడా లాబీయింగ్ చాలానే ఉంటుంది. మీ సినిమాను జ్యూరీ సభ్యులు చూడాలంటే చాలా తతంగమే ఉటుంది. అయినా సరే నిర్దేశించిన కొన్ని ప్రమాణాలు పాటిస్తుంటారని ప్రపంచం మొత్తం నమ్ముతుంటుంది. ఎంత లాబీయింగ్ ఉన్నప్పటికీ చెత్త సినిమాను తీసుకెళ్లి పాస్ చేయించి అవార్డు తీసుకునే పరిస్థితి ఉండదంటారు. అదెలా జరుగుతుందనే విషయంలో నాకు పరిజ్ఞానం లేదు. గతంలో ఆస్కార్ సినిమాలు కొన్ని నాకు నచ్చాయి. కొన్ని నచ్చలేదు’’ అని చెప్పాడు.
ఐతే ఆస్కార్ జ్యూరీ లాబీయింగ్ గురించి రాజమౌళి చెప్పిన మాటలు వింటే వారి విషయంలో ఆయనకు సదభిప్రాయం లేనట్లుంది. ‘బాహుబలి’ గురించి ఎంతో చెప్పుకున్నప్పటికీ.. అదెంతా ఆదరరణ పొందినప్పటికీ.. ఇండియా నుంచి కూడా ఆస్కార్ ఎంట్రీకి ఎంపిక కాని సంగతి తెలిసిందే.
This post was last modified on April 24, 2020 7:32 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…