ఏ సినిమాకాయినా బజ్ తీసుకొచ్చే ట్రైలర్ కట్ ముఖ్యం. ఒక్క ట్రైలర్ తో టికెట్లు అమ్ముడైన సినిమాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం బ్రో మేకర్స్ కూడా ట్రైలర్ పై కసరత్తు చేస్తూ సినిమాపై మంచి బజ్ తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. తాజాగా ట్రైలర్ కట్ రెడీ చేశారు. దాని మీద త్రివిక్రమ్ , దర్శకుడు సముద్రఖని బెటర్ మెంట్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే టీజర్ తో కొంత వరకూ హైప్ తీసుకొచ్చారు. కానీ తాజాగా రిలీజైన సాంగ్స్ ఫ్యాన్స్ ను సైతం నిరాశ పరిచాయి.
దీంతో ఇప్పుడు ట్రైలర్ తో ఇంపాక్ట్ క్రియేట్ చేసి పవన్ సినిమాకు కావలసినంత బజ్ తీసుకొచ్చే ప్లానింగ్ రెడీ చేస్తున్నారు. ట్రైలర్ తో సినిమా ఎలా ఉండబోతుందో ? ఎలాంటి ఎమోషన్ ఉండనుందో చెప్పబోతున్నారు. అలాగే తమన్ స్కోర్ కూడా థియేట్రికల్ ట్రైలర్ లో హైలైట్ అవ్వనుందని అంటున్నారు. పవన్ డైలాగ్స్ , సాయి తేజ కేరెక్టర్ , సాంగ్స్ తో ఫుల్ మీల్స్ ఉండేలా ట్రైలర్ రెడీ చేస్తున్నారు.
ఏదేమైనా బ్రో ట్రైలర్ క్లిక్ అయితే ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. మేకర్స్ కి ప్రమోషన్స్ కి చాలా తక్కువ టైమ్ ఉంది. ట్రైలర్ ఒక్కటే ప్రమోషన్స్ కి బ్రహ్మాస్త్రం లా కనిపిస్తుంది. మరి ఈ అస్త్రాన్ని మేకర్స్ ఎలా వాడుకుంటారో ? చూడాలి. తాజాగా సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ 21 న లేదా 22 న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. 25న శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేయనున్నారు. ఈవెంట్ కి పవన్ హాజరుకనున్నాడు.
This post was last modified on July 20, 2023 9:44 am
ఏప్రిల్ 30 'పెద్ది' తప్పుకున్నాక అందరి దృష్టి ఆ స్లాట్ మీద పడింది. ఇది ముందే ఊహించిన 'గాయపడ్డ సింహం'…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే చాలా బిల్లులు పెండింగులో ఉండగా..…
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…