ఏ సినిమాకాయినా బజ్ తీసుకొచ్చే ట్రైలర్ కట్ ముఖ్యం. ఒక్క ట్రైలర్ తో టికెట్లు అమ్ముడైన సినిమాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం బ్రో మేకర్స్ కూడా ట్రైలర్ పై కసరత్తు చేస్తూ సినిమాపై మంచి బజ్ తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. తాజాగా ట్రైలర్ కట్ రెడీ చేశారు. దాని మీద త్రివిక్రమ్ , దర్శకుడు సముద్రఖని బెటర్ మెంట్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే టీజర్ తో కొంత వరకూ హైప్ తీసుకొచ్చారు. కానీ తాజాగా రిలీజైన సాంగ్స్ ఫ్యాన్స్ ను సైతం నిరాశ పరిచాయి.
దీంతో ఇప్పుడు ట్రైలర్ తో ఇంపాక్ట్ క్రియేట్ చేసి పవన్ సినిమాకు కావలసినంత బజ్ తీసుకొచ్చే ప్లానింగ్ రెడీ చేస్తున్నారు. ట్రైలర్ తో సినిమా ఎలా ఉండబోతుందో ? ఎలాంటి ఎమోషన్ ఉండనుందో చెప్పబోతున్నారు. అలాగే తమన్ స్కోర్ కూడా థియేట్రికల్ ట్రైలర్ లో హైలైట్ అవ్వనుందని అంటున్నారు. పవన్ డైలాగ్స్ , సాయి తేజ కేరెక్టర్ , సాంగ్స్ తో ఫుల్ మీల్స్ ఉండేలా ట్రైలర్ రెడీ చేస్తున్నారు.
ఏదేమైనా బ్రో ట్రైలర్ క్లిక్ అయితే ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. మేకర్స్ కి ప్రమోషన్స్ కి చాలా తక్కువ టైమ్ ఉంది. ట్రైలర్ ఒక్కటే ప్రమోషన్స్ కి బ్రహ్మాస్త్రం లా కనిపిస్తుంది. మరి ఈ అస్త్రాన్ని మేకర్స్ ఎలా వాడుకుంటారో ? చూడాలి. తాజాగా సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ 21 న లేదా 22 న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. 25న శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేయనున్నారు. ఈవెంట్ కి పవన్ హాజరుకనున్నాడు.
This post was last modified on July 20, 2023 9:44 am
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…