ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం-ఇళయరాజాలది ఎవర్ గ్రీన్ కాంబినేషన్. వారి కలయికలో వేల పాటలు రూపొందాయి. అవి వివిధ భాషల సంగీత ప్రియులను ఎంతగా అలరించాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దక్షిణాదిన సినీ సంగీతం ఉన్నంత కాలం వారి పాటలు నిలిచి ఉంటాయి.
పాటల పరంగానే కాక వ్యక్తిగతంగానూ ఆప్తమిత్రులైన ఈ ఇద్దరి మధ్య ఆ మధ్య అనుకోకుండా విభేదాలు వచ్చాయి. బాలు నిర్వహించే సంగీత కచేరీల్లో తన పాటలు వాడుకుంటున్నందుకు రాయల్టీ చెల్లించాలంటూ ఇళయరాజా నోటీసులివ్వడం కలకలం రేపింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఇద్దరి మధ్య గొడవ సద్దుమణిగినట్లు వార్తలొచ్చాయి. ఆపై ఇద్దరి మధ్య బంధం ఎలా ఉందో తెలియదు.
ఐతే ఇటీవలే కరోనా బారిన పడిన బాలుకు.. శుక్రవారం ఆరోగ్యం కొంచెం విషమించి ఐసీయూలో చేరారని, వెంటిలేటర్ మీదికి వెళ్లారని వార్తలు రావడంతో అందరిలాగే ఇళయరాజా కూడా కలత చెందారు. తన మిత్రుడి కోసం ఆప్యాయంగా ఒక వీడియో సందేశం పంపారు.
“బాలూ.. త్వరగా లేచిరా. నీకోసం ఎదురు చూస్తున్నాం. మన జీవితాలు కేవలం సినిమాలతోనే ముగిసిపోయేవి కావు. సినిమాలతో మొదలైనవీ కావు. ఎక్కడో స్టేజ్ కచేరీల్లో మనమొక్కటిగా కలిసి ఆరంభించిన సంగీత ప్రయాణం మన జీవితంగానూ, మన జీవితాలకు ఆధారంగానూ మారింది. సంగీతం, స్వరాలు ఎలా ఒకదానినొకటి విడవకుండా ఉండటాయో.. ఆ స్టేజి కచేరీల్లో ఆరంభమైన మన స్నేహం కూడా ఏ కాలంలోనూ వీడిపోదు. మనం గొడవ పెట్టుకున్నా సరే.. ఆ గొడవ కూడా మన స్నేహమే. గొడవ పడకపోయినా స్నేహమే. అది నీకూ బాగా తెలుసు. నాకూ బాగా తెలుసు. అందుకే దేవుణ్ని ప్రార్థిస్తున్నాను. నువ్వు కచ్చితంగా తిరిగి వస్తావని నా అంతరాత్మ చెబుతోంది. అది నిజవ్వాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నాను. బాలూ.. త్వరగా రా” అని ఆ వీడియో ఉద్వేగంతో అన్నారు రాజా. తన మిత్రుడు కోరుకున్నట్లే బాలూ అనారోగ్యం నుంచి కోలుకుని త్వరగా ఆసుపత్రి నుంచి వచ్చేస్తారని ఆశిద్దాం.
This post was last modified on August 15, 2020 10:25 am
గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.…
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…