ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం-ఇళయరాజాలది ఎవర్ గ్రీన్ కాంబినేషన్. వారి కలయికలో వేల పాటలు రూపొందాయి. అవి వివిధ భాషల సంగీత ప్రియులను ఎంతగా అలరించాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దక్షిణాదిన సినీ సంగీతం ఉన్నంత కాలం వారి పాటలు నిలిచి ఉంటాయి.
పాటల పరంగానే కాక వ్యక్తిగతంగానూ ఆప్తమిత్రులైన ఈ ఇద్దరి మధ్య ఆ మధ్య అనుకోకుండా విభేదాలు వచ్చాయి. బాలు నిర్వహించే సంగీత కచేరీల్లో తన పాటలు వాడుకుంటున్నందుకు రాయల్టీ చెల్లించాలంటూ ఇళయరాజా నోటీసులివ్వడం కలకలం రేపింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఇద్దరి మధ్య గొడవ సద్దుమణిగినట్లు వార్తలొచ్చాయి. ఆపై ఇద్దరి మధ్య బంధం ఎలా ఉందో తెలియదు.
ఐతే ఇటీవలే కరోనా బారిన పడిన బాలుకు.. శుక్రవారం ఆరోగ్యం కొంచెం విషమించి ఐసీయూలో చేరారని, వెంటిలేటర్ మీదికి వెళ్లారని వార్తలు రావడంతో అందరిలాగే ఇళయరాజా కూడా కలత చెందారు. తన మిత్రుడి కోసం ఆప్యాయంగా ఒక వీడియో సందేశం పంపారు.
“బాలూ.. త్వరగా లేచిరా. నీకోసం ఎదురు చూస్తున్నాం. మన జీవితాలు కేవలం సినిమాలతోనే ముగిసిపోయేవి కావు. సినిమాలతో మొదలైనవీ కావు. ఎక్కడో స్టేజ్ కచేరీల్లో మనమొక్కటిగా కలిసి ఆరంభించిన సంగీత ప్రయాణం మన జీవితంగానూ, మన జీవితాలకు ఆధారంగానూ మారింది. సంగీతం, స్వరాలు ఎలా ఒకదానినొకటి విడవకుండా ఉండటాయో.. ఆ స్టేజి కచేరీల్లో ఆరంభమైన మన స్నేహం కూడా ఏ కాలంలోనూ వీడిపోదు. మనం గొడవ పెట్టుకున్నా సరే.. ఆ గొడవ కూడా మన స్నేహమే. గొడవ పడకపోయినా స్నేహమే. అది నీకూ బాగా తెలుసు. నాకూ బాగా తెలుసు. అందుకే దేవుణ్ని ప్రార్థిస్తున్నాను. నువ్వు కచ్చితంగా తిరిగి వస్తావని నా అంతరాత్మ చెబుతోంది. అది నిజవ్వాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నాను. బాలూ.. త్వరగా రా” అని ఆ వీడియో ఉద్వేగంతో అన్నారు రాజా. తన మిత్రుడు కోరుకున్నట్లే బాలూ అనారోగ్యం నుంచి కోలుకుని త్వరగా ఆసుపత్రి నుంచి వచ్చేస్తారని ఆశిద్దాం.
This post was last modified on August 15, 2020 10:25 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…