ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం-ఇళయరాజాలది ఎవర్ గ్రీన్ కాంబినేషన్. వారి కలయికలో వేల పాటలు రూపొందాయి. అవి వివిధ భాషల సంగీత ప్రియులను ఎంతగా అలరించాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దక్షిణాదిన సినీ సంగీతం ఉన్నంత కాలం వారి పాటలు నిలిచి ఉంటాయి.
పాటల పరంగానే కాక వ్యక్తిగతంగానూ ఆప్తమిత్రులైన ఈ ఇద్దరి మధ్య ఆ మధ్య అనుకోకుండా విభేదాలు వచ్చాయి. బాలు నిర్వహించే సంగీత కచేరీల్లో తన పాటలు వాడుకుంటున్నందుకు రాయల్టీ చెల్లించాలంటూ ఇళయరాజా నోటీసులివ్వడం కలకలం రేపింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఇద్దరి మధ్య గొడవ సద్దుమణిగినట్లు వార్తలొచ్చాయి. ఆపై ఇద్దరి మధ్య బంధం ఎలా ఉందో తెలియదు.
ఐతే ఇటీవలే కరోనా బారిన పడిన బాలుకు.. శుక్రవారం ఆరోగ్యం కొంచెం విషమించి ఐసీయూలో చేరారని, వెంటిలేటర్ మీదికి వెళ్లారని వార్తలు రావడంతో అందరిలాగే ఇళయరాజా కూడా కలత చెందారు. తన మిత్రుడి కోసం ఆప్యాయంగా ఒక వీడియో సందేశం పంపారు.
“బాలూ.. త్వరగా లేచిరా. నీకోసం ఎదురు చూస్తున్నాం. మన జీవితాలు కేవలం సినిమాలతోనే ముగిసిపోయేవి కావు. సినిమాలతో మొదలైనవీ కావు. ఎక్కడో స్టేజ్ కచేరీల్లో మనమొక్కటిగా కలిసి ఆరంభించిన సంగీత ప్రయాణం మన జీవితంగానూ, మన జీవితాలకు ఆధారంగానూ మారింది. సంగీతం, స్వరాలు ఎలా ఒకదానినొకటి విడవకుండా ఉండటాయో.. ఆ స్టేజి కచేరీల్లో ఆరంభమైన మన స్నేహం కూడా ఏ కాలంలోనూ వీడిపోదు. మనం గొడవ పెట్టుకున్నా సరే.. ఆ గొడవ కూడా మన స్నేహమే. గొడవ పడకపోయినా స్నేహమే. అది నీకూ బాగా తెలుసు. నాకూ బాగా తెలుసు. అందుకే దేవుణ్ని ప్రార్థిస్తున్నాను. నువ్వు కచ్చితంగా తిరిగి వస్తావని నా అంతరాత్మ చెబుతోంది. అది నిజవ్వాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నాను. బాలూ.. త్వరగా రా” అని ఆ వీడియో ఉద్వేగంతో అన్నారు రాజా. తన మిత్రుడు కోరుకున్నట్లే బాలూ అనారోగ్యం నుంచి కోలుకుని త్వరగా ఆసుపత్రి నుంచి వచ్చేస్తారని ఆశిద్దాం.
This post was last modified on August 15, 2020 10:25 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…