టాలీవుడ్ స్టార్ హీరోల్లో చాలావరకు అందరూ ఒకసారి ఒక సినిమానే చేస్తుంటారు. ఒక ప్రాజెక్టు పూర్తయ్యాక ఇంకోదానికి వెళ్తారు. అక్కినేని నాగచైతన్య కూడా అందుకు మినహాయింపేమీ కాదు. ఇప్పటిదాకా అతను ఒకసారి ఒక సినిమాతోనే ట్రావెల్ చేస్తూ వచ్చాడు. ఐతే ఇప్పుడతను రూటు మారుస్తున్నట్లు సమాచారం. ఒకేసారి రెండు సినిమాల షూటింగ్లో సమాంతరంగా పాల్గొనబోతున్నాడట చైతూ. ఇప్పటికే కార్తికేయ-2 దర్శకుడు చందూ మొండేటితో గీతా ఆర్ట్స్ బేనర్లో ఒక సినిమా ఓకే చేశాడు చైతూ.
అది అతడి కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్లో తెరకెక్కబోతోంది. ఒక గుజరాతీ కథ ఆధారంగా ఆ సినిమా తెరకెక్కనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సినిమా నడుస్తుందని.. ఇందులో చైతూ జాలరి పాత్ర చేయబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ఐతే ఇంతలో చైతూ చేయబోయే మరో సినిమా గురించి అప్డేట్ బయటికి వచ్చింది. మజిలీ తర్వాత శివ నిర్వాణతో చైతూ ఇంకో సినిమా చేయబోతున్నాడంటున్నారు.
ప్రస్తుతం ఖుషిని రిలీజ్కు రెడీ చేస్తున్న శివ.. చైతూకు ఒక ప్రేమకథ చెప్పి ఒప్పించాడని.. ఈ ఏడాది చివర్లో ఆ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుందని అంటున్నారు. అలా అయితే చందూ మొండేటి సినిమా పరిస్థితి ఏంటి అనే సందేహాలు కలిగాయి. కానీ ఈ రెండు చిత్రాలను ఒకదాని తర్వాత ఒకటి మొదలుపెట్టి.. మార్చి మార్చి డేట్లు కేటాయిస్తూ సమాంతరంగా రెండు చిత్రాలను పూర్తి చేస్తాడట చైతూ. ఇదే నిజమైతే రెండు సినిమాలకు లుక్ పరంగా ఎలా వేరియేషన్ చూపిస్తాడన్నది ఆసక్తికరం. అలాగే ఈ రెండు పడవల ప్రయాణం ఎలా సాఫీగా సాగుతుందో కూడా చూడాలి.
This post was last modified on July 18, 2023 12:06 am
భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.…
నేచురల్ స్టార్ నాని కేవలం నటుడిగానే కాకుండా 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్పై నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన…
టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…