టాలీవుడ్ స్టార్ హీరోల్లో చాలావరకు అందరూ ఒకసారి ఒక సినిమానే చేస్తుంటారు. ఒక ప్రాజెక్టు పూర్తయ్యాక ఇంకోదానికి వెళ్తారు. అక్కినేని నాగచైతన్య కూడా అందుకు మినహాయింపేమీ కాదు. ఇప్పటిదాకా అతను ఒకసారి ఒక సినిమాతోనే ట్రావెల్ చేస్తూ వచ్చాడు. ఐతే ఇప్పుడతను రూటు మారుస్తున్నట్లు సమాచారం. ఒకేసారి రెండు సినిమాల షూటింగ్లో సమాంతరంగా పాల్గొనబోతున్నాడట చైతూ. ఇప్పటికే కార్తికేయ-2 దర్శకుడు చందూ మొండేటితో గీతా ఆర్ట్స్ బేనర్లో ఒక సినిమా ఓకే చేశాడు చైతూ.
అది అతడి కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్లో తెరకెక్కబోతోంది. ఒక గుజరాతీ కథ ఆధారంగా ఆ సినిమా తెరకెక్కనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సినిమా నడుస్తుందని.. ఇందులో చైతూ జాలరి పాత్ర చేయబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ఐతే ఇంతలో చైతూ చేయబోయే మరో సినిమా గురించి అప్డేట్ బయటికి వచ్చింది. మజిలీ తర్వాత శివ నిర్వాణతో చైతూ ఇంకో సినిమా చేయబోతున్నాడంటున్నారు.
ప్రస్తుతం ఖుషిని రిలీజ్కు రెడీ చేస్తున్న శివ.. చైతూకు ఒక ప్రేమకథ చెప్పి ఒప్పించాడని.. ఈ ఏడాది చివర్లో ఆ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుందని అంటున్నారు. అలా అయితే చందూ మొండేటి సినిమా పరిస్థితి ఏంటి అనే సందేహాలు కలిగాయి. కానీ ఈ రెండు చిత్రాలను ఒకదాని తర్వాత ఒకటి మొదలుపెట్టి.. మార్చి మార్చి డేట్లు కేటాయిస్తూ సమాంతరంగా రెండు చిత్రాలను పూర్తి చేస్తాడట చైతూ. ఇదే నిజమైతే రెండు సినిమాలకు లుక్ పరంగా ఎలా వేరియేషన్ చూపిస్తాడన్నది ఆసక్తికరం. అలాగే ఈ రెండు పడవల ప్రయాణం ఎలా సాఫీగా సాగుతుందో కూడా చూడాలి.
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…