రెండు వారాల కిందట ఓ మోస్తరు అంచనాలతో విడుదలైన ‘సామజవరగమన’ అనే చిన్న సినిమా. వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న శ్రీ విష్ణు ఇందులో హీరో. తెలుగు వాళ్లకు పెద్దగా పరిచయం లేని రెబా మోనికా అనే అమ్మాయి హీరోయిన్. ఈ చిత్ర దర్శకుడు రామ్ అబ్బరాజుది ఒక సినిమా అనుభవం. ఆ సినిమా (వివాహ భోజనంభు) కూడా నేరుగా ఓటీటీలో రిలీజైంది. ఇలాంటి కాంబినేషన్లో వచ్చిన సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మహా అయితే ఓ 20 కోట్ల గ్రాస్ కలెక్షన్ల రేంజికి వెళ్తుందని అనుకుంటాం.
కానీ ఈ చిత్రం ఏకంగా రూ.50 కోట్ల మైలురాయికి చేరువ కావడం అనూహ్యమైన విషయం. కొవిడ్ తర్వాత ప్రేక్షకులను చిన్న సినిమాల కోసం థియేటర్లకు రప్పించడం చాలా కష్టం అయిపోతుందని అందరూ అనుకుంటున్నారు కానీ.. వాళ్లు ఇంటిల్లిపాదీ చూసే సినిమా వస్తే మునుపటి కంటే బాగా థియేటర్లకు వస్తున్నారనడానికి ‘సామజవరగమన’ రుజువుగా నిలిచింది.
కేవలం ఒక వీకెండ్ వరకు ఊపు చూపించి తర్వాత డౌన్ అయిపోలేదు ‘సామజవరగమన’. వీక్ డేస్లోనూ సినిమా బలంగా నిలబడింది. రెండో వీకెండ్లో అయితే కొత్త సినిమాలాగా హౌస్ ఫుల్ వసూళ్లతో సాగింది. ‘బేబి’ వచ్చే వరకు ఈ సినిమా జోరు తగ్గలేదు. ‘బేబి’తో పాటు మరి కొన్ని చిత్రాలు రిలీజైనా.. ప్రేక్షకుల సెకండ్ ఛాయిస్ ‘సామజవరగమన’నే అయింది. ‘బేబి’ ఓవర్ ఫ్లోస్ ఈ సినిమాకు గత వీకెండ్లో కలిసొచ్చాయి. దీంతో సినిమా రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్ల మైలురాయి ముంగిట నిలిచింది.
అంటే షేర్ రూ.30 కోట్ల దాకా ఉండబోతోందన్నమాట. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యుఎస్లోనూ ‘సామజవరగమన’ అదరగొట్టింది. అక్కడ ఏకంగా మిలియన్ డాలర్ల మార్కు మీద కన్నేసింది. గత శనివారం వసూళ్ల తర్వాత ఈ మైలురాయిని అందుకోవడానికి 25 వేల డాలర్లే తక్కువ పడ్డాయి. ఆదివారం రన్ పూర్తయ్యేటప్పటికీ ఆ మైల్స్టోన్ పూర్తయి ఉండొచ్చు. లేదా నేడో రేపో పనైపోవచ్చు. ఇలాంటి చిన్న సినిమా.. ఇలాంటి మైలురాళ్లను అందుకోవడం అనూహ్యం.
This post was last modified on July 17, 2023 5:24 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…