ఊహించని స్థాయిలో నిన్న బాక్సాఫీస్ వద్ద బేబీ వసూళ్ల హంగామా జరిగింది. మొదటి రోజు ఓ మోస్తరు థియేటర్లలో రిలీజైన ఈ ప్రేమకథ కేవలం మూడో రోజుకే దానికి మూడింతలు ఎక్కువ స్థాయిలో స్క్రీన్లు, షోలు పెంచుకోవడం చూసి ట్రేడ్ షాక్ అవుతోంది. ఫస్ట్ డే వచ్చిన డివైడ్ టాక్ కి భిన్నంగా టీనేజర్లు, యువత బేబీకి పొలోమని క్యూ కట్టేస్తున్నారు. అన్ని చోట్ల దాదాపు హౌస్ ఫుల్స్ పడ్డాయని రిపోర్ట్. ముఖ్యంగా ఈవెనింగ్ షోల అరాచకం ఓ స్థాయిలో ఉంది. ఇవాళ తెలంగాణ బోనాల సెలవు మరో సానూకూలాంశం కాబోతోంది. ఇంకో వారం పైగానే పెద్దగా డ్రాప్ ఉండకపోవచ్చు.
బయ్యర్ల నుంచి అందుతున్న సమాచారం మేరకు మూడు రోజులకు గాను బేబీ వసూలు చేసిన గ్రాస్ 21 కోట్ల పైమాటే ఉందట. షేర్ గా 11 కోట్ల 35 లక్షల దాకా వచ్చింది. అత్యధికంగా ఒక్క నైజం నుంచే 3 కోట్ల 90 లక్షల షేర్ వసూలు కావడం రికార్డు. సీడెడ్ కోటికి అమ్మగా డిస్ట్రిబ్యూటర్ ఆల్రెడీ పాతిక లక్షల లాభంతో సొమ్ములు లెక్కబెట్టుకుంటున్నాడు. ఉత్తరాంధ్రలో కోటిన్నరకు పైగానే వచ్చింది. వెస్ట్ వెస్ట్ కలిపి కోటి పదిహేను లక్షలు, గుంటూరు 52 లక్షలు, కృష్ణా 60 లక్షలు, నెల్లూరు 35 లక్షలతో స్ట్రాంగ్ గా దూసుకుపోతోంది. ఓవర్సీస్ లోనూ కోటిన్నర దాటడం విశేషం
సుమారు ఎనిమిది కోట్ల దాకా బ్రేక్ ఈవెన్ పెట్టుకుని థియేటర్ బిజినెస్ చేసిన బేబీ నాలుగో రోజు మొదటి ఆట పడే సమయానికే 3 కోట్ల 35 లక్షల లాభంతో రన్ కొనసాగిస్తోంది. ఇవాళ నుంచి డ్రాప్ మరీ ఎక్కువ స్థాయిలో ఉండకపోవక్కని అడ్వాన్స్ బుకింగ్స్ స్పష్టం చేస్తున్నాయి. బిసి కేంద్రాల్లో కౌంటర్ సేల్స్ తాకిడి ఎక్కువగా ఉంది. నిన్న చాలా సెంటర్స్ లో విపరీతమైన రద్దీ కనిపించింది. ఈ లెక్కన యాభై కోట్ల గ్రాస్ మంచి నీళ్ల ప్రాయంగా కనిపిస్తోంది. జాతిరత్నాలుని క్రాస్ చేయడం అసాధ్యంగా అనిపించడం లేదు. ఫైనల్ గా ఎలాంటి మేజిక్ ఫిగర్స్ నమోదవుతాయో చూడాలి.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…