ఇంకో రెండు వారాల్లోపే విడుదల కాబోతున్న బ్రో తాలూకు పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తున్నాయి. ఫైనల్ లెన్త్ ని 2 గంటల 15 నిమిషాలకు లాక్ చేయడం అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో కనీసం రెండున్నర గంటల స్క్రీన్ టైం ఆశిస్తే దానికి భిన్నంగా స్వీట్ అండ్ షార్ట్ వెర్షన్ కి వెళ్లిపోవడం ఆశ్చర్యం కలిగించింది. పవర్ స్టార్ ఎంట్రీ మొదటి ఇరవై నిమిషాల తర్వాత ఉంటుందని ఆల్రెడీ లీకైపోయింది. దానికి తోడు తన నిడివి తొంబై నిమిషాలనే వార్త కూడా ఈ మధ్యే బయటికి వచ్చింది.
ఈ నేపథ్యంలో బ్రోకు ఇంత క్రిస్పీ టైంకి సెట్ చేయడం ఒకరకంగా మంచి విషయమే. ఎందుకంటే తక్కువ లెన్త్ ఉండటం అదనంగా షోలు ప్లాన్ చేసుకోవటానికి, త్వరగా ప్రదర్శనలు పూర్తి చేసుకుని ఆడియన్స్ ఇంటికి వెళ్లిపోవడానికి అవకాశం ఉంటుంది. పైకి హడావిడి చేయకపోయినా బిజినెస్ మాత్రం అంతర్గతంగా హాట్ కేక్ లా జరుగుతోందని ఇన్ సైడ్ టాక్. నైజామ్ హక్కులను మైత్రికి ముప్పై రెండు కోట్లకు అమ్మారనే ట్రేడ్ గుప్పుమంటోంది. ఉస్తాద్ భగత్ సింగ్ కు వీళ్ళే ప్రొడ్యూసర్లన్న సంగతి తెలిసిందే. ఆంధ్ర రైట్స్ కూడా ఇంకో రెండు మూడు రోజుల్లో సెటిల్ చేస్తారు.
బాక్సాఫీస్ దగ్గర స్టార్ హీరో సినిమా వచ్చి గ్యాప్ వచ్చేసింది కనక బ్రోకు యావరేజ్ టాక్ వచ్చినా చాలు కలెక్షన్లు కుమ్మేస్తుంది. లేదూ సూపర్ హిట్ అనిపించుకుందా ఏకంగా రికార్డుల మీదే కన్నేయొచ్చు. పవన్ డబ్బింగ్ తాలూకు పని ఇంకా బ్యాలన్స్ ఉంది. దానికన్నా ముందే ఫైనల్ కాపీ రెడీ చేసి వీలైతే వచ్చే వారాంతంలోపు సెన్సార్ పూర్తి చేసేలా దర్శకుడు సముతిరఖని ట్రై చేస్తున్నాడు. పవన్ వారాహి యాత్రలో విపరీతమైన బిజీలో ఉండటంతో బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లానింగ్ పెద్ద టాస్క్ అవుతోంది. ఏదో ఒక డేట్ ఖాళీ చూసుకుని ఆ లాంఛనమేదో పూర్తి చేయమని నిర్మాతలు పవన్ ని రిక్వెస్ట్ చేశారట.
This post was last modified on July 15, 2023 8:01 pm
ఇంకొద్ది గంటల్లో తండేల్ ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమా…
విశ్వక్ సేన్ పూర్తి స్థాయి ఆడవేషం వేసిన లైలా ఫిబ్రవరి 14 విడుదల కాబోతోంది. ముందు వాయిదా అనే వార్తలు…
అమెరికా ఇటీవల భారత్కు చెందిన అక్రమ వలసదారులను ప్రత్యేక విమానంలో పంపిన నేపథ్యంలో, కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్…
ఇదిగో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటే..అదుగో ప్లాంట్ మూసేస్తున్నారు అంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఏకంగా…
వైసీపీ అధినేత జగన్ నివాసం కమ్ పార్టీ ప్రధాన కార్యాలయం ఉన్న గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ప్యాలస్కు గుర్తు తెలియని…
విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘లైగర్’ సినిమాపై విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. కానీ…