శివ కార్తికేయన్ హీరోగా విడుదలైన మహావీరుడులో టైటిల్ రోల్ ఎవరిదంటే కథ ప్రకారం మాస్ మహారాజా రవితేజదే. అదేంటి అనుకోకండి. దీనికాయన వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాకపోతే నిర్మాతలు దాన్ని సరైన రీతిలో ప్రమోషన్ కి వాడుకోకపోవడంతో అభిమానులకు సైతం ఆలస్యంగా తెలిసొచ్చింది. మొదలైన గంట తర్వాత ఎంట్రీ ఇచ్చే ఆకాశవాణి రూపంలో చాలా సార్లు రవితేజ గొంతు రూపంలో వినిపిస్తూనే ఉంటాడు. పిరికివాడైన హీరోకి ధైర్యాన్ని నూరిపోస్తూ, విలన్ల మీదకే ఉసిగొలుపుతూ, సమయానికి తగిన సలహాలు ఇస్తూ ఒకరకంగా దేవుడి పాత్ర పోషించాడు.
చాలా డెప్త్ తో రవితేజ దీనికి డబ్బింగ్ చెప్పారు. అయితే దర్శకుడు అశ్విన్ సరైన రీతిలో సబ్జెక్టుని హ్యాండిల్ చేయలేకపోవడంతో ఫస్ట్ హాఫ్ కామెడీ ఓ మోస్తరుగా నెట్టుకొచ్చినా సెకండ్ హాఫ్ మాత్రం పూర్తిగా దెబ్బేసింది. దీంతో క్రమం తప్పకుండా వినిపించే రవితేజ స్వరం ఒకదశ దాటాక ఈ సాగతీత వల్ల ఎలివేషన్ మిస్ అయ్యింది. లేదంటే ఇంకో లెవెల్ లో ఉండేది. స్నేహం కొద్దీ మాస్ రాజా చేసిన ఈ సహాయం మహావీరుడికి ఎంత లేదన్నా ప్లస్ అవుతోంది కానీ కథా కథనాలు ఇంకా మెరుగ్గా ఉండి ఉంటే నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళేది. మంచి అవకాశాన్ని అశ్విన్ వృథా చేసినట్టే అయ్యింది.
ఇది పక్కనపెడితే మహావీరుడు ప్రమోషన్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం తప్ప ఇంకెలాంటి పబ్లిసిటీ చేయకపోవడంతో సాధారణ ప్రేక్షకులకు ఇదొచ్చిన సంగతే తెలియకుండా పోయింది. పైగా యూత్ ఎక్కువ అధిక శాతం బేబీ మీద ఆసక్తి చూపించడంతో ఓపెనింగ్స్ మీద కొంత దెబ్బ పడింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సాంకేతిక కారణాల వల్ల మహావీరుడు ఉదయం షోలు సమయానికి మొదలుకాకపోవడం, క్యాన్సిల్ చేయడం మూలిగే నక్క మీద తాటిపండు వేసినట్టు అయ్యింది. ఏదైనా రాబట్టుకుంటే ఈ వీకెండ్ నే టార్గెట్ చేసుకోవాల్సి ఉంటుంది.
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…
బాక్సాఫీస్ వద్ద లెనిన్ తప్ప జనాలకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఇతర కొత్త సినిమాలు విడుదలైనా వాటి గురించి…
తెలంగాణలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని, ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ.. ప్రధాన ప్రతిపక్షం…