‘వరుణ్ డాక్టర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు తమిళ యువ కథానాయకుడు శివ కార్తికేయన్. ఆ తర్వాత ‘ప్రిన్స్’ అనే తమిళ, తెలుగు ద్విభాషా చిత్రంతో మన ప్రేక్షకులను పలకరించిన అతను.. ఇప్పుడు ‘మహావీరుడు’ అవతారం ఎత్తాడు. శుక్రవారమే ఈ సినిమా రిలీజ్. తమిళంలో భారీ అంచనాలు, తెలుగులో ఓ మోస్తరు అంచనాలతో విడుదలకు సిద్ధమైన ఈ చిత్రానికి ఈ రోజు ఉదయం పెద్ద షాక్ తగిలింది.
అటు తమిళ నాట.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు చాలా చోట్ల మార్నింగ్ షోలు పడలేదు. కంటెంట్ సమయానికి డెలివరీ కాకపోవడంతో యుఎస్లో ‘మహావీరుడు’ తమిళ వెర్షన్కు ప్రిమియర్సే పడలేదు. తెలుగు వెర్షన్కు చాలా చోట్ల మార్నింగ్ షోలు క్యాన్సిల్ అయ్యాయి. హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్లో పడాల్సిన 9 గంటల షో ఆగిపోయింది. అనేక మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్లలోనూ ఉదయం షోల సమయానికి కంటెంట్ డెలివరీ కాక షోలు ఆగిపోయాయి. చాలామంది ఆడియన్స్ థియేటర్లకు వచ్చి వెనుదిరిగారు. లేదంటే వేరే సినిమాకు వెళ్లాల్సి వచ్చింది.
ఐతే ఉదయం 11 గంటల సమయానికి సమస్య తీరిపోవడంతో కొంచెం లేటుగా మార్నింగ్ షోలు షెడ్యూల్ అయిన థియేటర్లలో బొమ్మ పడింది. 11.30 ప్రాంతంలో షోలు మొదలయ్యాయి. మ్యాట్నీలకు ఎలాంటి ఇబ్బందీ లేకపోయింది. సినిమా సజావుగానే నడుస్తోంది. ఇంతకుముందు కమెడియన్ యోగిబాబును హీరోగా పెట్టి ‘మండేలా’ అనే వెరైటీ మూవీ తీసి మెప్పించిన మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రమిది. సినిమా మంచి ఎంటర్టైనర్ అంటూ మంచి టాకే వస్తోంది ‘మహావీరుడు’కి.
This post was last modified on July 14, 2023 4:01 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…