బిగ్ బాస్ సీజన్ మొదలవుతుందంటే టీవీ ప్రేక్షకులతో పాటు మీడియాకు కూడా భలే పండుగ. అసలే లాక్ డౌన్లో రాసుకోవడానికి వార్తలు లేక ఇక్కట్లు పడుతోన్న టైమ్లో బిగ్ బాస్ స్టార్ట్ అవుతూ వుండడంతో ఇక ఆ అప్డేట్స్తో బోలెడంత కాలక్షేపం దొరుకుతుందని మీడియా సంస్థలు ఎదురు చూస్తున్నాయి. షో మొదలయ్యే లోగా ఈ సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్ల వివరాలు లీక్ అవుతున్నాయి. నిజంగానే వాళ్లు షోలో వుంటారో, లేక ఊహాగానాలో వారిని నాగార్జున స్వయంగా ఇంట్రడ్యూస్ చేసే వరకు తెలీదు.
అయితే ఈ ఏడాది తక్కువ మంది కంటెస్టెంట్స్ వున్నా గట్టి వాళ్లను, బాగా ఎంటర్టైన్ చేసే వాళ్లను పెడుతున్నారని టాక్. ప్రతి సీజన్లానే ఈసారి కూడా డాన్స్ మాస్టర్తో పాటు ఒక సింగర్ కూడా హౌస్లోకి వెళుతున్నారు. ఆ డాన్స్ మాస్టర్ మరెవరో కాదు… జానీ అని చెబుతున్నారు. ప్రస్తుతం లీడింగ్ కొరియోగ్రాఫర్ అయిన జానీ మామూలుగా అయితే ఈ హౌస్లోకి వెళ్లేంత తీరిగ్గా వుండడు. కానీ ఇప్పుడు షూటింగ్స్ లేవు కనుక అతడు అభ్యంతరం చెప్పలేదని అంటున్నారు.
అలాగే యాక్టర్ కమ్ సింగర్ నోయెల్ కూడా ఈ సీజన్లో తన హుషారయిన పాటలతో హౌస్లో అలరిస్తాడట. లేడీ కంటెస్టెంట్స్ కూడా చాలా పాపులర్ ఫేసెస్ వుంటాయని అంటోన్న నేపథ్యంలో ఈ సీజన్పై ఉత్కంఠ మరింత పెరుగుతోంది.
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…