ఛలోతో తనకు టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ దక్కేలా చేసిన దర్శకుడు వెంకీ కుడుముల అంటే రష్మిక మందన్నకు ప్రత్యేక అభిమానం, గౌరవం. వీళ్లిద్దరి రెండో కలయికలో వచ్చిన భీష్మ సైతం గ్రాండ్ సక్సెస్ కావడం సెంటిమెంట్ ని మరింత బలపరిచింది. అందుకే మూడోసారి కాంబో అనగానే ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. చిరంజీవితో సినిమా వచ్చినట్టే వచ్చి చేజారిన వెంకీ మళ్ళీ నితిన్ తోనే చేతులు కలిపాడు. మైత్రి లాంటి పెద్ద సంస్థ అండ దొరికింది. సంగీత దర్శకుడిగా జివి ప్రకాష్ కుమార్ ని తీసుకుని ఆ మేరకు ఒక వెరైటీ అనౌన్స్ మెంట్ వీడియో కూడా వదిలారు.
కానీ ఇప్పుడీ ప్రాజెక్టుని రష్మిక మందన్న వదులుకోవడానికి నిర్ణయించుకున్నట్టు ఫిలిం నగర్ టాక్. తన పర్సనల్ మేనేజర్ కిరణ్ తో వచ్చిన విభేదాల గురించి రకరకాల పుకార్లు వచ్చిన నేపథ్యంలో తనే స్వయంగా అలాంటిదేమీ లేదని, స్నేహపూర్వకంగానే వీడ్కోలు చెప్పానని క్లారిటీ ఇచ్చింది. అయితే వెంకీ కుడుముల మూవీలో మరో హీరోయిన్ ని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసే డ్రాప్ కావాలని డిసైడ్ చేసుకుని ఆమేరకు చెప్పేసిందని అంటున్నారు. అధికారికంగా ప్రకటన రాలేదు కానీ ఉత్తుత్తినే ఇలాంటి వార్తలు ప్రచారం కావు కాబట్టి నిజమే అయ్యుండొచ్చు .
పుష్ప తర్వాత రష్మిక కెరీర్ అమాంతం ఊపందుకుంటుందనుకుంటే వరసగా స్టార్ హీరోల సరసన ఛాన్సులు వస్తున్నాయి కానీ ఆ మేరకు బ్లాక్ బస్టర్లు పడటం లేదు. బాలీవుడ్ లోనూ చేదు అనుభవాలే మిగులుతున్నాయి. గుడ్ బై, మిషన్ మజ్ను దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. యానిమల్ బ్రేక్ ఇస్తుందనుకుంటే విడుదల డిసెంబర్ కు వాయిదా పడింది. పుష్ప 2 షూటింగ్ కి ఎక్కువ టైం పడుతోంది కాబట్టి రిలీజ్ గురించి ఇప్పుడప్పుడే తేలేదు. ఈ నేపథ్యంలో నితిన్ సినిమా నుంచి దిగిపోవడం రైటో రాంగో కానీ మొత్తానికి తెరవెనుక చాలా మలుపులే జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది.
This post was last modified on July 13, 2023 1:56 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…