న్యాచురల్ స్టార్ నాని మరోసారి ఫాదర్ సెంటిమెంట్ కే ఓటు వేశాడు. శౌర్యువ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎమోషనల్ డ్రామాకి హాయ్ నాన్న టైటిల్ ని కన్ఫర్మ్ చేస్తూ అధికారికంగా కొత్త పోస్టర్ తో పాటు టీజర్ విడుదల చేశారు. అయితే నాని ఇక్కడో ఓ చిన్న ట్విస్టు ఇచ్చారు. నాన్న అని పిలిచేది స్టిల్ లో ఉన్న చిట్టి తల్లి కాదని, పక్కనున్న అందమైన అమ్మాయని హింట్ ఇచ్చేశాడు. అంటే ఈ ముగ్గురి బాండింగ్ కు సంబంధించి కీలకమైన మలుపు చెప్పేశారు. పాప తల్లి వేరు, ఆమె దూరమయ్యాక వచ్చే యువతే మృణాల్ ఠాకూర్ అనే క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 21 హాయ్ నాన్న ప్యాన్ ఇండియా భాషల్లో విడుదల కానుంది.
దసరా ఊర మాస్ బ్లాక్ బస్టర్ తర్వాత నాని ఉద్దేశపూర్వకంగా కొత్త మేకోవర్ కోరుకున్నాడు. దానికి తగ్గట్టే నాన్నగా మారిపోయాడు. జెర్సీలో పదేళ్ల కుర్రాడికి తండ్రిగా నటించి ఎమోషన్ తో కన్నీళ్లు పెట్టించిన న్యాచురల్ స్టార్ ఈసారి వినోదానికి పెద్ద పీఠ వేయబోతున్నట్టు తెలిసింది. విజయ్ దేవరకొండతో ఖుషితో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న హేశం అబ్దుల్ వహాబ్ దీనికి సంగీతం సమకూరుస్తున్నాడు. మ్యూజిక్ విషయంలోనూ భారీ అంచనాలున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న నానికి ఇది ఖచ్చితంగా మరో పెద్ద బ్రేక్ అవుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కూల్ టైటిల్ తో మొత్తానికి కుటుంబ ప్రేక్షకులను మరోసారి టార్గెట్ చేసిన హాయ్ నాన్నకు డిసెంబర్ చివర్లో వెంకటేష్ తో గట్టి పోటీనే ఉంటుంది. హాయ్ డాడీ సంక్రాంతికి వాయిదా పడొచ్చనే నేపథ్యంలో టీమ్ మరోసారి స్పష్టంగా నిర్ణయంలో మార్పు లేదని తేల్చి చెప్పేసింది. టాలీవుడ్ హీరోలందరూ డాడీలుగా చాలా సినిమాలు చేసినా అందులో కొన్ని మాత్రమే ప్రత్యేకంగా నిలబడిపోయాయి. హాయ్ డాడీ కూడా వాటి సరసన నిలుస్తుందని నాని నమ్మకం. సీతారామం తర్వాత హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కు మరోసారి భావోద్వేగాలు నిండిన పాత్ర దక్కింది
This post was last modified on July 13, 2023 11:34 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…