సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ ఏ రేంజ్ లో ఉంటాయో నిత్యం చూస్తుంటాం. ఒక్కోసారి ఇవి శృతిమించి రోడ్ల మీద గొడవలకు దారి తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా నిర్మాతో లేదా దర్శకుడో ఫలానా స్టార్ కి అభిమాని అయితే అతన్ని పర్సనల్ గా టార్గెట్ చేసిన ఉదంతాలు బోలెడు. అయితే ఇదంతా నాణేనికి ఒక వైపు. మంచి కన్నా చెడు వేగంగా ప్రచారమవుతుంది కాబట్టి ఇంకో కోణం గురించి తెలిసినవాళ్ళు తక్కువ. ఎల్లుండి విడుదల కాబోతున్న బేబీ నిర్మాత ఎస్కెఎన్ ఒక మంచి వివరణతో అసలు ఫ్యానిజం ఎలా ఉండాలో అనే దానికి ఉదాహరణ చెప్పారు.
మెగా ఫ్యామిలీ వీర ఫ్యాన్ గా ఎస్కెఎన్ గురించి తెలిసిందే. అలా అని ఇతర హీరోలను ఇష్టపడకపోవడమో లేదా ట్రోల్ చేయడమో లాంటి వ్యహహారాలు ఉండవు. ప్రభాస్, రవితేజ లాంటి వాళ్ళకు పిఆర్ గా చేసినప్పుడు ఆ ఇద్దరి ఫాలోయర్స్ తనను ఇష్టపడేవాళ్లు. నిర్మాతగా టాక్సి వాలా రిలీజ్ కు పైరసీకి గురైతే జంగారెడ్డిగూడెం నుంచి ఒక జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఫోన్ చేస్తే ఇక్కడ సీడీలు చేసి అమ్ముతున్నారని దగ్గరుండి మరీ పట్టించాడు. అదేంటయ్యా నేను మెగా ఫాన్ అని తెలిసినా హెల్ప్ చేశావని ఎస్కెఎన్ అడిగితే అదేంటన్న మనమందరం తెలుగు హీరోల అభిమానులమేనని హత్తుకునేలా చెప్పాడు
అయినా ఒక హీరోని ప్రేమిస్తే మరో హీరోని ద్వేషించాలని లేదు. ఆ మాటకొస్తే ట్విట్టర్ లో గొడవలు చేసేవాళ్లంతా ఫేక్ ఐడిలతో తమ అసలు ఐడెంటిటీ దాచుకుని రెచ్చగొట్టేవాళ్ళే. ఆ మాటలకు, చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ నుంచి విజయ్ దేవరకొండ దాకా ఎవరు ఎవరినైనా ఇష్టపడవచ్చు కానీ దానికి బదులుగా అవతలి వాళ్ళ మీద బురద జల్లడం కాదుగా. ఎస్కెఎన్ చెప్పిన మాటలు ఆలోచింపదగినవే. జీవితంలో చాలా విలువైన కాలాన్ని తమ హీరోల కోసం ఖర్చు పెట్టే యువత అది కేవలం ప్రేమకే పరిమితం చేయాలి తప్ప ఇంకెవరి మీదో ద్వేషం కోసం కాదు.
This post was last modified on July 12, 2023 11:52 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…