‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతిరత్నాలు’ సినిమాలు చూసే వరకు నవీన్ పొలిశెట్టి టాలెంట్ ఏంటో జనాలకు అర్థం కాలేదు. అంతకుముందు 1 నేనొక్కడినే, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి సినిమాల్లో నటించినపుడు నవీన్ను జనం లైట్ తీసుకున్నారు. కానీ హిందీలో అతను చేసిన కొన్ని షార్ట్స్, అలాగే ‘చిచ్చోరే’ సినిమాలో తన నటన చూస్తే షాకవ్వక మానరు. కొంచెం లేటుగా అతడి ప్రతిభకు తగ్గ సినిమాలు తెలుగులో పడ్డాయి.
‘జాతిరత్నాలు’ బ్లాక్ బస్టర్ కావడంతో తొందరపడి వచ్చిన ప్రతి అవకాశం ఒప్పేసుకోకుండా.. ఆచితూచి అడుగులు వేశాడు నవీన్. లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టితో అతను చేసిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఆగస్టు 4న రిలీజ్ కానున్న నేపథ్యంలో తనదైన శైలిలో సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు నవీన్.
ఈ క్రమంలోనే అతను తాజాగా హైదరాబాద్లో మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీకి వెళ్లాడు. అక్కడ మల్లారెడ్డి ప్రస్తావన తెచ్చి.. ఆయన్ని ఇమిటేట్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘మీ పెద్దాయన మల్లారెడ్డి సార్ ఉంటారేమో అనుకుని వచ్చాను. ఆయన స్టైల్ గానీ, స్పీచ్ గానీ అంటే నాకు చాలా ఇష్టం’’ అని చెప్పిన నవీన్.. ఆయన స్టైల్లో తన సినీ ప్రయాణం గురించి చెప్పుకొచ్చాడు.
‘‘కష్టపడ్డా.. ఇన్ని హిట్లు ఏడికెళ్లి వచ్చినయ్. ఎట్లచ్చినయ్. నేనేమైనా మాయ జేసినానా.. మంత్రం జేసినానా.. కష్టపడ్డా.. స్కిట్లు రాసినా.. యూట్యూబ్లో వీడియో జేసినా.. అనుష్కతో హీరోగా జేసినా.. సక్సెస్ అయినా..’’ అంటూ నవీన్ మల్లారెడ్డి స్టైల్లో డైలాగులు చెబుతుంటే ఆడిటోరియం హోరెత్తిపోయింది. సోషల్ మీడియాలోనూ ఈ వీడియోకు మంచి స్పందన వస్తోంది.
This post was last modified on July 12, 2023 4:52 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…