మెగా ఫ్యామిలీలో కొంత విరామం తర్వాత మళ్లీ ఓ శుభాకార్యం జరిగింది. నాగబాబు ముద్దుల కూతురు నిహారికకు.. గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ వెంకట చైతన్యతో గురువారం నిశ్చితార్థం జరిగింది.
కరోనా-లాక్ డౌన్ నేపథ్యంలో సాధ్యమైనంత సింపుల్గా ఈ వేడుకను జరిపించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మెగా ఫ్యామిలీ స్థాయికి తగ్గ గ్రాండియర్ కనిపించింది వేడుకలో. బయటి వాళ్లెవ్వరినీ పిలవకుండా పూర్తిగా ఇరు కుటుంబాల వాళ్లే ఈ వేడుకలో పాల్గొన్నారు.
మెగా ఫ్యామిలీ అంటే చిన్నది కాదు.. కాబట్టి వారి పరివారం గట్టిగానే కనిపించింది. నాగబాబు, చిరు దంపతులకు తోడు.. మెగా ఫ్యామిలీ తర్వాతి తరం వాళ్లంతా ఈ వేడుకలో కనిపించారు.
రామ్ చరణ్, అల్లు అర్జున్ తమ సతీమణులతో వేడుకలో పాల్గొన్నారు. సుశ్మిత, శ్రీజ కూడా తమ భర్తలతో వేడుకకు వచ్చారు. మిగతా సింగిల్ బ్యాచ్ అంతా కూడా వేడుకలో సందడి చేసింది. ఐతే అందరూ ఉన్నా మరోసారి ఒక వ్యక్తి లేని లోటు స్పష్టంగా కనిపించింది.
ఆ వ్యక్తి పనవ్ కళ్యాణ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బయటి వాళ్ల శుభాకార్యాలకు, వేరే వేడుకలకు హాజరయ్యే పవన్.. కుటుంబంలో జరిగే వేడుకలకు హాజరవడం అరుదు. ఇలా చాలా వేడుకలు, ఫ్యామిలీ గెట్ టు గెదర్లకు పవన్ దూరమయ్యాడు.
ఈ మధ్యే నితిన్ పెళ్లికి కూడా వెళ్లిన పవన్.. నిహారిక నిశ్చితార్థానికి రాకపోవడం ఆశ్చర్యం కలిగించింది. బహుశా పెళ్లికి వెళ్తే చాలని అనుకుని ఉంటాడేమో కానీ.. నిశ్చితార్థం తన అన్న కూతురిది కాబట్టి ఈ వేడుకలోనూ పవన్ ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on August 14, 2020 7:12 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…