మెగా ఫ్యామిలీలో కొంత విరామం తర్వాత మళ్లీ ఓ శుభాకార్యం జరిగింది. నాగబాబు ముద్దుల కూతురు నిహారికకు.. గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ వెంకట చైతన్యతో గురువారం నిశ్చితార్థం జరిగింది.
కరోనా-లాక్ డౌన్ నేపథ్యంలో సాధ్యమైనంత సింపుల్గా ఈ వేడుకను జరిపించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మెగా ఫ్యామిలీ స్థాయికి తగ్గ గ్రాండియర్ కనిపించింది వేడుకలో. బయటి వాళ్లెవ్వరినీ పిలవకుండా పూర్తిగా ఇరు కుటుంబాల వాళ్లే ఈ వేడుకలో పాల్గొన్నారు.
మెగా ఫ్యామిలీ అంటే చిన్నది కాదు.. కాబట్టి వారి పరివారం గట్టిగానే కనిపించింది. నాగబాబు, చిరు దంపతులకు తోడు.. మెగా ఫ్యామిలీ తర్వాతి తరం వాళ్లంతా ఈ వేడుకలో కనిపించారు.
రామ్ చరణ్, అల్లు అర్జున్ తమ సతీమణులతో వేడుకలో పాల్గొన్నారు. సుశ్మిత, శ్రీజ కూడా తమ భర్తలతో వేడుకకు వచ్చారు. మిగతా సింగిల్ బ్యాచ్ అంతా కూడా వేడుకలో సందడి చేసింది. ఐతే అందరూ ఉన్నా మరోసారి ఒక వ్యక్తి లేని లోటు స్పష్టంగా కనిపించింది.
ఆ వ్యక్తి పనవ్ కళ్యాణ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బయటి వాళ్ల శుభాకార్యాలకు, వేరే వేడుకలకు హాజరయ్యే పవన్.. కుటుంబంలో జరిగే వేడుకలకు హాజరవడం అరుదు. ఇలా చాలా వేడుకలు, ఫ్యామిలీ గెట్ టు గెదర్లకు పవన్ దూరమయ్యాడు.
ఈ మధ్యే నితిన్ పెళ్లికి కూడా వెళ్లిన పవన్.. నిహారిక నిశ్చితార్థానికి రాకపోవడం ఆశ్చర్యం కలిగించింది. బహుశా పెళ్లికి వెళ్తే చాలని అనుకుని ఉంటాడేమో కానీ.. నిశ్చితార్థం తన అన్న కూతురిది కాబట్టి ఈ వేడుకలోనూ పవన్ ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on August 14, 2020 7:12 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…