తమ సినిమా చుట్టూ వివాదం నెలకొంటే భయపడే వాళ్లు కొంతమందైతే.. అలాంటి వివాదం కోసమే చూసేవాళ్లు ఇంకొంతమంది. సినిమాకు పబ్లిసిటీ కీలకంగా మారిపోయిన ఈ రోజుల్లో రెండో కోవకు చెందిన వాళ్లు పెరుగుతున్నారు.
ఈ రోజుల్లో నిజ జీవిత కథలతో సినిమాలు పెద్ద ఎత్తున తెరకెక్కుతున్న నేపథ్యంలో వాస్తవాల్ని కొంచెం వక్రీకరించి, లేదా ఎగ్జాజరేట్ చేసి చూపించడం కామన్. దీని మీద వివాదాలు కూడా మామూలే.
నెట్ ఫ్లిక్స్ ద్వారా రిలీజైన బాలీవుడ్ కొత్త చిత్రం ‘గుంజన్ సక్సేనా’కు కూడా ఇలాంటి వివాదం తప్పలేదు. ఇందులో గుంజన్ సక్సేనా పాత్ర చుట్టూ కొంత డ్రామా నడిపారు. ఆమె అనేక అడ్డంకుల్ని, స్త్రీల పట్ల వివక్షను అధిగమించి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించినట్లు చూపించారు.
ఐతే గుంజన్ పాత్రను ఎలివేట్ చేసేందుకు ఇండియన్ ఎయిర్ఫోర్స్ను కించపరచడం ఎంత వరకు న్యాయం అంటున్నారు అధికారులు. గుంజన్ పైలట్గా మారి భారత వాయుసేనలో ఉద్యోగానికి వెళ్లినపుడు.. కార్గిల్ యుద్ధంలో సేవలందించేందుకు సిద్ధమైనపుడు ఆమె మహిళ అన్న కారణంతో సహోద్యోగులు, అధికారులు చిన్న చూపు చూసినట్లు, తక్కువగా మాట్లాడినట్లు సినిమాలో చూపించారు.
దీని పట్ల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమా విడుదలక ముందు ఈ కథను వాస్తవ రూపంలో చూపిస్తామని నిర్మాత కరణ్ జోహార్ హామీ ఇచ్చారని.. కానీ వాస్తవంగా అలా జరగలేదని.. ఈ విషయమై కరణ్ను సంప్రదించినా స్పందన లేదని.. సదరు సన్నివేశాల్ని తొలగించలేదని చెబుతూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది. దీనిపై కరణ్ జోహార్ను సోషల్ మీడియాలో విమర్శిస్తున్న వాళ్లూ లేకపోలేదు. మరి దీనిపై కరణ్ అండ్ కో ఎలా స్పందిస్తుందో చూడాలి.
This post was last modified on August 14, 2020 7:10 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…