ఆస్కార్ వేదిక దాకా వెళ్లి సగర్వంగా టాలీవుడ్ జెండా ఎగరేసిన ఆర్ఆర్ఆర్ కు కొనసాగింపు ఉండదని ఫ్యాన్స్ అనుకుంటున్నారు కానీ రచయిత విజయేంద్ర ప్రసాద్ దానికి సంబంధించిన శుభవార్త చెప్పేశారు. ఒక న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ట్రిపులార్ సీక్వెల్ ని హాలీవుడ్ సంస్థకు అప్పజెప్పబోతున్నామని, వేలకోట్ల బడ్జెట్ తో ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అయితే దర్శకుడిగా రాజమౌళి ఉండరని, ప్రస్తుత కమిట్ మెంట్ల వల్ల అది సాధ్యపడదని తేల్చేశారు. మరి ఇంగ్లీష్ డైరెక్టర్ చేతిలో పెడతారా లేక ఇండియన్ చేతికిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంటుంది.
మహేష్ బాబు సినిమా తాలూకు స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్న జక్కన్న షూటింగ్ ఎప్పుడు మొదలుపెట్టేది ఇంకా నిర్ణయించుకోలేదు. గుంటూరు కారం పూర్తయ్యాక, మహేష్ కొంత విశ్రాంతి తీసుకున్నాక డేట్ డిసైడ్ అవుతుంది. అది కూడా ఫైనల్ వెర్షన్ రాజమౌళికి పూర్తిగా సంతృప్తినిచ్చాకే. మరి ఆర్ఆర్ఆర్ 2 బాధ్యతను వేరొకరికి ఇచ్చినప్పుడు ఫస్ట్ పార్ట్ లో పండిన ఎమోషన్, ఎలివేషన్ అంతే స్థాయిలో అతను పండించగలరా అనేది పెద్ద ప్రశ్న. ప్రస్తుతం ఇదంతా చర్చల దశలో ఉన్నట్టు కనిపిస్తోంది. విజయేంద్ర ప్రసాద్ స్టోరీ అయితే ఇచ్చేసినట్టు ఉన్నారు.
ఇకపై చేయబోయే సినిమాలు వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని తీయబోతున్న రాజమౌళి తన బ్రాండ్ ని మరింత విస్తరించే పనిలో ఉన్నారు. ప్రాజెక్ట్ కె ఎలాగూ ఇంటర్నేషనల్ మార్కెట్ ని టార్గెట్ చేసుకుని దానికి తగ్గ స్ట్రాటజీతో ముందుకెళ్తోంది. దాన్ని మించేలా ఎస్ఎస్ఎంబి 29ని రెడీ చేయాల్సి ఉంటుంది. ఇదంతా బాగానే ఉంది కానీ ఆర్ఆర్ఆర్ 2కి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మళ్ళీ అన్నేసి డేట్లు ఇవ్వడం పెద్ద సవాలే. ఒకవేళ ఇది కార్యరూపం దాల్చితే మళ్ళీ తమ హీరోల దర్శనం రెండు మూడేళ్లు దూరమవుతుందనే టెన్షన్ అభిమానులకు ఖచ్చితంగా ఉంటుంది
This post was last modified on July 10, 2023 3:06 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…