ఆస్కార్ వేదిక దాకా వెళ్లి సగర్వంగా టాలీవుడ్ జెండా ఎగరేసిన ఆర్ఆర్ఆర్ కు కొనసాగింపు ఉండదని ఫ్యాన్స్ అనుకుంటున్నారు కానీ రచయిత విజయేంద్ర ప్రసాద్ దానికి సంబంధించిన శుభవార్త చెప్పేశారు. ఒక న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ట్రిపులార్ సీక్వెల్ ని హాలీవుడ్ సంస్థకు అప్పజెప్పబోతున్నామని, వేలకోట్ల బడ్జెట్ తో ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అయితే దర్శకుడిగా రాజమౌళి ఉండరని, ప్రస్తుత కమిట్ మెంట్ల వల్ల అది సాధ్యపడదని తేల్చేశారు. మరి ఇంగ్లీష్ డైరెక్టర్ చేతిలో పెడతారా లేక ఇండియన్ చేతికిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంటుంది.
మహేష్ బాబు సినిమా తాలూకు స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్న జక్కన్న షూటింగ్ ఎప్పుడు మొదలుపెట్టేది ఇంకా నిర్ణయించుకోలేదు. గుంటూరు కారం పూర్తయ్యాక, మహేష్ కొంత విశ్రాంతి తీసుకున్నాక డేట్ డిసైడ్ అవుతుంది. అది కూడా ఫైనల్ వెర్షన్ రాజమౌళికి పూర్తిగా సంతృప్తినిచ్చాకే. మరి ఆర్ఆర్ఆర్ 2 బాధ్యతను వేరొకరికి ఇచ్చినప్పుడు ఫస్ట్ పార్ట్ లో పండిన ఎమోషన్, ఎలివేషన్ అంతే స్థాయిలో అతను పండించగలరా అనేది పెద్ద ప్రశ్న. ప్రస్తుతం ఇదంతా చర్చల దశలో ఉన్నట్టు కనిపిస్తోంది. విజయేంద్ర ప్రసాద్ స్టోరీ అయితే ఇచ్చేసినట్టు ఉన్నారు.
ఇకపై చేయబోయే సినిమాలు వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని తీయబోతున్న రాజమౌళి తన బ్రాండ్ ని మరింత విస్తరించే పనిలో ఉన్నారు. ప్రాజెక్ట్ కె ఎలాగూ ఇంటర్నేషనల్ మార్కెట్ ని టార్గెట్ చేసుకుని దానికి తగ్గ స్ట్రాటజీతో ముందుకెళ్తోంది. దాన్ని మించేలా ఎస్ఎస్ఎంబి 29ని రెడీ చేయాల్సి ఉంటుంది. ఇదంతా బాగానే ఉంది కానీ ఆర్ఆర్ఆర్ 2కి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మళ్ళీ అన్నేసి డేట్లు ఇవ్వడం పెద్ద సవాలే. ఒకవేళ ఇది కార్యరూపం దాల్చితే మళ్ళీ తమ హీరోల దర్శనం రెండు మూడేళ్లు దూరమవుతుందనే టెన్షన్ అభిమానులకు ఖచ్చితంగా ఉంటుంది
This post was last modified on July 10, 2023 3:06 pm
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…
మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…
24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు…
ఇమేజ్, మార్కెట్ ఉన్న హీరో సినిమాలు రెండు కేవలం ఒకే రోజు గ్యాప్ తో విడుదల కావడం చాలా ఇబ్బందికరమైన…