ఆస్కార్ వేదిక దాకా వెళ్లి సగర్వంగా టాలీవుడ్ జెండా ఎగరేసిన ఆర్ఆర్ఆర్ కు కొనసాగింపు ఉండదని ఫ్యాన్స్ అనుకుంటున్నారు కానీ రచయిత విజయేంద్ర ప్రసాద్ దానికి సంబంధించిన శుభవార్త చెప్పేశారు. ఒక న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ట్రిపులార్ సీక్వెల్ ని హాలీవుడ్ సంస్థకు అప్పజెప్పబోతున్నామని, వేలకోట్ల బడ్జెట్ తో ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అయితే దర్శకుడిగా రాజమౌళి ఉండరని, ప్రస్తుత కమిట్ మెంట్ల వల్ల అది సాధ్యపడదని తేల్చేశారు. మరి ఇంగ్లీష్ డైరెక్టర్ చేతిలో పెడతారా లేక ఇండియన్ చేతికిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంటుంది.
మహేష్ బాబు సినిమా తాలూకు స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్న జక్కన్న షూటింగ్ ఎప్పుడు మొదలుపెట్టేది ఇంకా నిర్ణయించుకోలేదు. గుంటూరు కారం పూర్తయ్యాక, మహేష్ కొంత విశ్రాంతి తీసుకున్నాక డేట్ డిసైడ్ అవుతుంది. అది కూడా ఫైనల్ వెర్షన్ రాజమౌళికి పూర్తిగా సంతృప్తినిచ్చాకే. మరి ఆర్ఆర్ఆర్ 2 బాధ్యతను వేరొకరికి ఇచ్చినప్పుడు ఫస్ట్ పార్ట్ లో పండిన ఎమోషన్, ఎలివేషన్ అంతే స్థాయిలో అతను పండించగలరా అనేది పెద్ద ప్రశ్న. ప్రస్తుతం ఇదంతా చర్చల దశలో ఉన్నట్టు కనిపిస్తోంది. విజయేంద్ర ప్రసాద్ స్టోరీ అయితే ఇచ్చేసినట్టు ఉన్నారు.
ఇకపై చేయబోయే సినిమాలు వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని తీయబోతున్న రాజమౌళి తన బ్రాండ్ ని మరింత విస్తరించే పనిలో ఉన్నారు. ప్రాజెక్ట్ కె ఎలాగూ ఇంటర్నేషనల్ మార్కెట్ ని టార్గెట్ చేసుకుని దానికి తగ్గ స్ట్రాటజీతో ముందుకెళ్తోంది. దాన్ని మించేలా ఎస్ఎస్ఎంబి 29ని రెడీ చేయాల్సి ఉంటుంది. ఇదంతా బాగానే ఉంది కానీ ఆర్ఆర్ఆర్ 2కి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మళ్ళీ అన్నేసి డేట్లు ఇవ్వడం పెద్ద సవాలే. ఒకవేళ ఇది కార్యరూపం దాల్చితే మళ్ళీ తమ హీరోల దర్శనం రెండు మూడేళ్లు దూరమవుతుందనే టెన్షన్ అభిమానులకు ఖచ్చితంగా ఉంటుంది
This post was last modified on July 10, 2023 3:06 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…