Movie News

సవాళ్ల మధ్య డబుల్ ఇస్మార్ట్ పరుగులు

గుట్టుచప్పుడు కాకుండా సైలెంట్ గా డబుల్ ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ మొదలైపోయింది. ప్రత్యేక అతిథులు ఎవరూ లేకుండా పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్ ఇద్దరే పూజా లాంఛనాన్ని, క్లాప్ ని, ఫస్ట్ షాట్ ని పూర్తి చేశారు. హీరో రామ్ తప్ప క్యాస్టింగ్ నుంచి ఎవరూ హాజరు కాలేదు. విడుదల తేదీని 2024 మార్చి 8 అని ముందే ప్రకటించేయడంతో ఎనిమిది నెలల కాలంలో వేగంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ గానే ప్లాన్ చేశారు. తనకు అతి పెద్ద మాస్ ఇమేజ్ ఇచ్చిన దర్శకుడిగా పూరి మీద రామ్ కు చాలా నమ్మకం ఉంది. అందుకే ఆలోచించకుండా సీక్వెల్ కి ఎస్ చెప్పేశాడు.

రాబోయే రోజుల్లో సవాళ్ళ మధ్యే డబుల్ ఇస్మార్ట్ పరుగులు పెట్టాలి. లైగర్ డిజాస్టర్ పూరి బ్రాండ్ ని బాగా దెబ్బ తీసింది. ఎంతగా అంటే విజయ్ దేవరకొండ జనగణమన ప్రకటించి నిర్మాత ప్రీ ప్రొడక్షన్ కి కోట్లు ఖర్చు పెట్టాక ఆపేసేంత. పైగా లైగర్ పెట్టుబడుల విషయంలో ఈడి దృష్టిలో పడటం చాలా ఇబ్బంది పెట్టింది. తనలో క్రియేటివ్ టాలెంట్ అయిపోయిందనే కామెంట్లకు పూరి స్వయంగా ఊతమిచ్చాడు. ఇప్పుడు వాటికి సమాధానం చెప్పాలంటే డబుల్ ఇస్మార్ట్ ని పేరుకు తగ్గట్టే మాస్ కి పిచ్చెక్కించే కంటెంట్ తో తెరకెక్కించాలి. ఒకప్పటి పోకిరి టేకింగ్ ని చూపించాలి.

హీరోయిన్లుగా నిధి అగర్వాల్, నభా నటేష్ లు ఉంటారా లేక కొత్త జోడిలను తీసుకొస్తారా చెప్పలేదు. సంగీత దర్శకుడెవరో ఫైనల్ చేయలేదు. లైగర్ కు చివరి నిమిషం దాకా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో చెప్పకుండా నానబెట్టి చివరికి బాలీవుడ్ బ్యాచ్ తో పని కానిచ్చారు. తీరా చూస్తే బ్యాడ్ ఆల్బమ్ పడింది. ఈసారి అలాంటి పొరపాట్లకు తావివ్వకుండా మణిశర్మనే కొనగిస్తారో లేక ఎవరైనా కొత్తవాళ్లను తీసుకుంటారో చూడాలి. ఇక రామ్ కు వారియర్ ఇచ్చిన షాక్ తర్వాత స్కంద బ్లాక్ బస్టర్ ఖాయమనే నమ్మకం బలంగా ఉంది. ఇక్కడ చెప్పిన సవాళ్లు ఒత్తిళ్లు డబుల్ ఇస్మార్ట్ టీమ్ తట్టుకోగలిగితే హిట్టు పడ్డట్టే. 

Share
Show comments
Published by
Satya

Recent Posts

తిరస్కరించిన సినిమాకు హడావిడి ఎందుకయ్యా

ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…

2 hours ago

అప్పులు కట్టుకుంటున్న మంచు లక్ష్మీ

టాలీవుడ్లో ఘ‌న చ‌రిత్ర ఉన్న బేన‌ర్లో ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ ఒక‌టి. ఈ బేన‌ర్ మీద ప‌దుల సంఖ్య‌లో సినిమాలు తీశారు…

3 hours ago

రెండో పెళ్లి మీద హీరోయిన్ ఆసక్తి

‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…

6 hours ago

మరోసారి కన్నీరు పెట్టిన ఎర్రబెల్లి

ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…

7 hours ago

మెరుగైన ఛాయిస్ కోసం రావిపూడి వేట

మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…

7 hours ago

సుప్రీం కోర్టు తీర్పుపై నటి తల్లి ఏమన్నారు?

24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు…

8 hours ago