Movie News

ఓటిటి హక్కులు జస్ట్ 155 కోట్లు

2019లో జీరో డిజాస్టర్ అయ్యాక ఏకంగా మూడేళ్లు ఖాళీగా ఉన్న షారుఖ్ ఖాన్ కు పఠాన్ ఇచ్చిన కిక్ అంతా ఇంతా కాదు. హిట్ అయితే చాలనుకుంటే ఏకంగా వెయ్యి కోట్ల వసూళ్లు సాధించి మతిపోయేలా చేసింది. తన ఇమేజ్ ని సరిగ్గా వాడుకోవాలే కానీ యావరేజ్ యాక్షన్ డ్రామాని సైతం బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు కురిపించే కామధేనువులా మార్చడం తనకే చెల్లింది. సెప్టెంబర్ 7న రాబోయే జవాన్ మీద ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో చెప్పనక్కర్లేదు. తమిళ దర్శకుడు ఆట్లీ రూపొందిస్తున్న ఈ రివెంజ్ గ్రాండియర్ పై బాలీవుడ్ ట్రేడ్ పెట్టుకున్న నమ్మకం అంతా ఇంతా కాదు.

అసలు మ్యాటర్ కు వస్తే జవాన్ కన్నా ఎక్కువ హైప్ తో డిసెంబర్ 22న రాబోతున్న చిత్రం డుంకీ. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రాబోతున్న ఈ సోషల్ ఎంటర్ టైనర్ లో షారుఖ్ ని ఎన్నడూ చూడని పాత్రల్లో దర్శనం ఇవ్వబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. దీని ఓటిటి హక్కుల కోసం జియో సినిమా అక్షరాలా 155 కోట్లు చెల్లించిందని మీడియా టాక్. ఇతర భాషల్లో డబ్బింగ్ చేయకుండా కేవలం ఒక సింగల్ లాంగ్వేజ్ డిజిటల్ రైట్స్ కి ఇంత రేట్ పలకడం ఇదే మొదటిసారి. హిందీ వెర్షన్ మాత్రమే ఈ రేట్ కి డీల్ చేశారు. 2024 ప్రారంభంలోనే స్ట్రీమింగ్ జరిగే ఛాన్స్ ఉంది.

ఇంత పెద్ద రికార్డు సాధించడం మాములు విషయం కాదు. ఇప్పటిదాకా డుంకీ గురించి ఎలాంటి లీక్స్ లేవు. అయినా సరే హీరో దర్శకుడి కాంబినేషన్ వల్ల ముఖేష్ అంబానీ బృందం అంత మొత్తం చెల్లించేందుకు సిద్ధ పడింది. ఓటిటి రంగంలో దూసుకుపోవాలనే లక్ష్యంతో గత మూడు నెలలుగా కొత్త సినిమాలను వరసబెట్టి రిలీజ్ చేస్తున్న జియో సినిమాకు డుంకీ అతి పెద్ద బూస్ట్ కానుంది. 2018 సంజు తర్వాత ఆరేళ్ళ గ్యాప్ తీసుకుని రాజ్ కుమార్ హిరానీ తీసిన మూవీ కావడంతో ఆడియన్స్ ఎగ్జైట్ మెంట్ ఓ రేంజ్ లో ఉంది. డుంకీలో తాప్సి పన్ను హీరోయిన్ గా నటిస్తోంది. 

This post was last modified on July 10, 2023 9:26 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

2 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

3 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

4 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

4 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

6 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

7 hours ago