Movie News

కుర్ర హీరోలకి డిజాస్టర్స్ ఇచ్చిన ఎడిటర్లు

టెక్నీషియన్స్ దర్శకులుగా మారి హిట్లు కొట్టడం చాలానే చూశాం. కెమెరా మెన్ , కొరియోగ్రాఫర్ ఆఖరికి మ్యూజిక్ డైరెక్టర్ ఇలా చాలా డిపార్ట్ మెంట్స్ నుండి దర్శకులు వచ్చారు. తాజాగా ఓ ఇద్దరు కుర్ర ఎడిటర్లు కూడా ఈ ప్రయత్నం చేశారు. పూరీ సినిమాలకు ఎడిటర్ గా వర్క్ చేసిన ఎడిటర్ రాజశేఖర్ రెడ్డి నితిన్ తో ‘మాచర్ల నియోజిక వర్గం’ అనే సినిమా చేశాడు. ఆ సినిమా మీద నితిన్ చాలా నమ్మకం పెట్టుకున్నాడు. మాస్ కంటెంట్, వైరల్ సాంగ్ తో కాసుల వర్షం కూరుస్తుందని అనుకున్నాడు కానీ తీరా చూస్తే సినిమా డిజాస్టర్ అనిపించుకొని రెండో రోజే డ్రాప్ అయింది. దీంతో దర్శకుడిగా రాజశేఖర్ విఫలం అయ్యాడు. 

ఇక నిఖిల్ కూడా ఎడిటర్ గ్యారీ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘స్పై’ అనే సినిమా చేశాడు. రిజల్ట్ ఏమైందో తెలిసిందే. గ్యారీ బీ హెచ్ అడివి శేష్ సినిమాలకు ఎడిటర్ గా పనిచేశాడు. ఆ అనుభవంతో స్పై అనే పాన్ ఇండియా సినిమా ఆఫర్ అందుకున్నాడు. కానీ డైరెక్షన్ లో తన టాలెంట్ నిరూపించుకోలేకపోయాడు. నిర్మాత అందించిన కథ -కథనం వీక్ ఉండటంతో దర్శకుడిగా మంచి మార్కులు స్కోర్ చేయలేకపోయాడు.

రాజశేఖర్ , గ్యారీ ఇద్దరూ ఎడిటింగ్ లో మంచి మార్క్స్ తెచ్చుకున్నారు కానీ దర్శకులుగా మంచి స్కోర్ చేయలేకపోయారు. వీరిద్దరి వల్ల కుర్ర హీరోలు ఇకపై టెక్నీషియన్స్ ను నమ్మాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఏదేమైనా ఈ ఎడిటర్లు దర్శకులుగా సక్సెస్ అయితే మరి కొందరు టెక్నీషియన్స్ కి ఉత్సాహం వచ్చేది. ఇంకొంత మంది దర్శకులుగా మారి ఉండే వారు.

Share
Show comments
Published by
Satya

Recent Posts

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

8 minutes ago

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు…

10 minutes ago

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

39 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

3 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago