‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో యువ దర్శకుడు అజయ్ భూపతి సెన్సేషన్ క్రియేట్ చేసి రెండేళ్లు దాటిపోయింది. ఆ చిత్ర కథానాయకుడు కార్తికేయ ఐదారు సినిమాలు చేసేశాడు. హీరోయిన్ పాయల్ రాజ్పుత్ కూడా వరుసబెట్టి సినిమాలు చేసేసింది. దీని టెక్నీషియన్లకు కూడా మంచి అవకాశాలే వచ్చాయి.
కానీ దర్శకుడు అజయ్ భూపతి మాత్రం ఇప్పటిదాకా తన రెండో సినిమాను పట్టాలెక్కించలేకపోయాడు. ముందు పెళ్లితో అతను బిజీ అయ్యాడు. తర్వాత కథ రెడీ చేసుకోవడానికి సమయం పట్టింది. ఆపై ఈ మల్టీప్టారర్ మూవీకి హీరోలను ఎంచుకోవడానికి చాలా కాలం పట్టేసింది. చివరికి శర్వానంద్, సిద్దార్థ్లతో ఈ సినిమా తీయడానికి అంగీకారం కుదిరింది.
అంతా ఓకే అనుకునేసరికి కరోనా వచ్చి అన్ని కార్యకలాపాలనూ ఆపేసింది. ‘మహాసముద్రం’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి తాజాగా ఓ కథానాయికనూ ఖరారు చేసినట్లు సమాచారం. ఇందులో శర్వానంద్ సరసన ‘సమ్మోహనం’ బ్యూటీ అదితి రావు హైదరి నటించనున్నట్లు సమాచారం. తెలుగులో చేసిన తొలి సినిమాతో సమ్మోహనపరిచిన అదితికి ఆ తర్వాత ఆ స్థాయి అవకాశాలు రాలేదు.
ఈ నేపథ్యంలో ‘మహాసముద్రం’ ఆమెకు మంచి ఛాన్సే అనుకోవాలి. సిద్ధు సరసన కూడా ఓ కథానాయిక ఉంటుందని.. ఆమెను త్వరలోనే ఖరారు చేసి కరోనా జోరు తగ్గాక ఈ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్తారని సమాచారం. కాగా అజయ్ భూపతి నిన్ననే కరోనా బారిన పడినట్లు వెల్లడించాడు.
This post was last modified on August 14, 2020 4:46 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…