‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో యువ దర్శకుడు అజయ్ భూపతి సెన్సేషన్ క్రియేట్ చేసి రెండేళ్లు దాటిపోయింది. ఆ చిత్ర కథానాయకుడు కార్తికేయ ఐదారు సినిమాలు చేసేశాడు. హీరోయిన్ పాయల్ రాజ్పుత్ కూడా వరుసబెట్టి సినిమాలు చేసేసింది. దీని టెక్నీషియన్లకు కూడా మంచి అవకాశాలే వచ్చాయి.
కానీ దర్శకుడు అజయ్ భూపతి మాత్రం ఇప్పటిదాకా తన రెండో సినిమాను పట్టాలెక్కించలేకపోయాడు. ముందు పెళ్లితో అతను బిజీ అయ్యాడు. తర్వాత కథ రెడీ చేసుకోవడానికి సమయం పట్టింది. ఆపై ఈ మల్టీప్టారర్ మూవీకి హీరోలను ఎంచుకోవడానికి చాలా కాలం పట్టేసింది. చివరికి శర్వానంద్, సిద్దార్థ్లతో ఈ సినిమా తీయడానికి అంగీకారం కుదిరింది.
అంతా ఓకే అనుకునేసరికి కరోనా వచ్చి అన్ని కార్యకలాపాలనూ ఆపేసింది. ‘మహాసముద్రం’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి తాజాగా ఓ కథానాయికనూ ఖరారు చేసినట్లు సమాచారం. ఇందులో శర్వానంద్ సరసన ‘సమ్మోహనం’ బ్యూటీ అదితి రావు హైదరి నటించనున్నట్లు సమాచారం. తెలుగులో చేసిన తొలి సినిమాతో సమ్మోహనపరిచిన అదితికి ఆ తర్వాత ఆ స్థాయి అవకాశాలు రాలేదు.
ఈ నేపథ్యంలో ‘మహాసముద్రం’ ఆమెకు మంచి ఛాన్సే అనుకోవాలి. సిద్ధు సరసన కూడా ఓ కథానాయిక ఉంటుందని.. ఆమెను త్వరలోనే ఖరారు చేసి కరోనా జోరు తగ్గాక ఈ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్తారని సమాచారం. కాగా అజయ్ భూపతి నిన్ననే కరోనా బారిన పడినట్లు వెల్లడించాడు.
This post was last modified on August 14, 2020 4:46 pm
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…
ఏపీలో వచ్చే మూడు మాసాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు అలెర్టుగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.…