‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో యువ దర్శకుడు అజయ్ భూపతి సెన్సేషన్ క్రియేట్ చేసి రెండేళ్లు దాటిపోయింది. ఆ చిత్ర కథానాయకుడు కార్తికేయ ఐదారు సినిమాలు చేసేశాడు. హీరోయిన్ పాయల్ రాజ్పుత్ కూడా వరుసబెట్టి సినిమాలు చేసేసింది. దీని టెక్నీషియన్లకు కూడా మంచి అవకాశాలే వచ్చాయి.
కానీ దర్శకుడు అజయ్ భూపతి మాత్రం ఇప్పటిదాకా తన రెండో సినిమాను పట్టాలెక్కించలేకపోయాడు. ముందు పెళ్లితో అతను బిజీ అయ్యాడు. తర్వాత కథ రెడీ చేసుకోవడానికి సమయం పట్టింది. ఆపై ఈ మల్టీప్టారర్ మూవీకి హీరోలను ఎంచుకోవడానికి చాలా కాలం పట్టేసింది. చివరికి శర్వానంద్, సిద్దార్థ్లతో ఈ సినిమా తీయడానికి అంగీకారం కుదిరింది.
అంతా ఓకే అనుకునేసరికి కరోనా వచ్చి అన్ని కార్యకలాపాలనూ ఆపేసింది. ‘మహాసముద్రం’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి తాజాగా ఓ కథానాయికనూ ఖరారు చేసినట్లు సమాచారం. ఇందులో శర్వానంద్ సరసన ‘సమ్మోహనం’ బ్యూటీ అదితి రావు హైదరి నటించనున్నట్లు సమాచారం. తెలుగులో చేసిన తొలి సినిమాతో సమ్మోహనపరిచిన అదితికి ఆ తర్వాత ఆ స్థాయి అవకాశాలు రాలేదు.
ఈ నేపథ్యంలో ‘మహాసముద్రం’ ఆమెకు మంచి ఛాన్సే అనుకోవాలి. సిద్ధు సరసన కూడా ఓ కథానాయిక ఉంటుందని.. ఆమెను త్వరలోనే ఖరారు చేసి కరోనా జోరు తగ్గాక ఈ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్తారని సమాచారం. కాగా అజయ్ భూపతి నిన్ననే కరోనా బారిన పడినట్లు వెల్లడించాడు.
This post was last modified on August 14, 2020 4:46 pm
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(శ్రీశైలం కుడి కాల్వ) టన్నెల్లో గత నెల 22న జరిగిన ప్రమాదంలో చిక్కుకు పోయిన.. ఆరుగురు…
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ మహిళలకు మరింత భద్రత లభించింది. ఈ మేరకు ఏపీలోని కూటమి సర్కారు నేతృత్వంలోని…
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో మొత్తం 5 స్థానాలు…
రాష్ట్రంలో మహిళా ఓటు బ్యాంకు ఎక్కువగా ఉందన్న విషయం తెలిసిందే. నగరాలు, పట్టణాలే కాదు.. గ్రామీణ స్థాయిలోనూ మహిళల ఓటు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ డిబేట్ కొనసాగుతోంది. ఒక్కఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్.. 30…
టాలీవుడ్లో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూనే క్వాలిటీ, వెరైటీ చూపించే హీరో నాని. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం..…