గత ఏడాది ది కాశ్మీర్ ఫైల్స్ తో ఊహించని బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి దానికెంత ప్రాపగాండ సినిమా అని పేరొచ్చినా ఫలితం మాత్రం గొప్పగా తెచ్చుకున్నారు. కాశ్మీర్ పండిట్ల ఊచకోత గురించి ఒకవైపే చెప్పారన్న కామెంట్లు ఎన్ని వచ్చినా ఆడియన్స్ మాత్రం బ్రహ్మాండంగా ఆదరించారు. ప్రస్తుతం ది వ్యాక్సిన్ వార్ తీస్తున్న వివేక్ దీని షూటింగ్ ని చివరి దశకు తీసుకొచ్చారు. వాస్తవానికి విడుదల వచ్చే ఏడాది చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు దాన్ని ప్రీ పోన్ చేసి సెప్టెంబర్ 28 రిలీజ్ చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్టు లేటెస్ట్ అప్డేట్.
సలార్ కి ఎదురెళ్లడానికి పెద్ద హీరోలే భయపడుతుంటే ఈయన మాత్రం తగుదునమ్మా అంటూ రెడీ అయ్యారట. దీని వెనుక కారణం లేకపోలేదు. 2022లో సరిగ్గా రాధే శ్యామ్ వచ్చిన రోజే ది కాశ్మీర్ ఫైల్స్ రిలీజై పెద్ద హిట్టు కొట్టింది. ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ నే ఢీ కొడితే రిజల్ట్ రిపీట్ అవుతుందనే నమ్మకం కాబోలు. ది వ్యాక్సిన్ వార్ కథ కరోనా వచ్చిన టైంలో ఇండియా తీసుకున్న చర్యలు, దేశంలో ఏర్పడ్డ విపత్కర పరిస్థితులను ధీటుగా ఎదురుకున్న తీరుని ఆధారంగా చేసుకుని రాసుకున్నారు. ఒకరకంగా చెప్పాలంటే బిజెపి ప్రభుతాన్ని పొగిడేలాగే సినిమా ఉంటుందని బాలీవుడ్ టాక్.
ఏది ఏమైనా వివేక్ అగ్నిహోత్రిది ముమ్మాటికీ ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నది ముంబై విశ్లేషకుల మాట. ప్రతిసారి ఆడియన్స్ అమాయకంగా మోసపోరని, పైగా కరోనా గాయాలు మర్చిపోయి ఇప్పుడిప్పుడే సాధారణ జీవనానికి అలవాటు పడిన వాళ్లకు మరోసారి ఆ భూతం గురించి చూపిస్తామంటే ఎగబడి టికెట్లు కొనరని హెచ్చరిస్తున్నారు. ఇవి చాలవన్నట్టు వివేక్ అగ్నిహోత్రి కావాలనే సలార్ టీజర్ గురివి నెగటివ్ క్రిటిసిజం చేస్తూ ఏకంగా హీరోయిజం సినిమాలను జనం ఆదరించడం పట్ల ఘాటుగా కామెంట్లు చేయడం సోషల్ మీడియాలో బూమరాంగ్ అయ్యింది. మరి నిజంగానే క్లాష్ అవుతాడా లేదానేది చూడాలి
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…