గత ఏడాది తెలుగు వచ్చిన బిగ్గెస్ట్ హిట్లలో ‘బింబిసార’ ఒకటి. కొన్నేళ్లుగా సరైన విజయాలు లేని నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త దర్శకుడు వశిష్ఠ ఈ చిత్రాన్ని రూపొందించాడు. కళ్యాణ్ రామ్ మార్కెట్ స్థాయికి మించి బాగా ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమా పెట్టుబడి మీద రెట్టింపు కన్నా ఎక్కువ ఆదాయం తెచ్చిపెట్టింది. కళ్యాణ్ రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచిన ‘బింబిసార’కు సీక్వెల్ తీయాలని ఆ సినిమా రిలీజైనపుడే అనుకున్నారు.
ఈ దిశగా పని కూడా మొదలైంది. కానీ అనూహ్య పరిణామాల మధ్య ఈ చిత్రం నుంచి దర్శకుడు వశిష్ఠ తప్పుకున్నాడు. అతడికి క్రేజీ ఆఫర్లు ఉండటంతో ఈ చిత్రం నుంచి తప్పుకున్నందుకు పెద్దగా ఫీలేమీ అవ్వాల్సిన పని లేకపోయింది. ఐతే కాంట్రాక్ట్ బ్రేక్ చేసి ఈ సినిమా నుంచి తప్పుకున్నందుకు కళ్యాణ్ రామ్ సంస్థకు నష్టపరిహారం చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తినట్లు వార్తలు వచ్చాయి.
అదే సమయంలో తన ఇన్పుట్స్, ఐడియాలను సీక్వెల్ కోసం వాడుకుంటే న్యాయ పరమైన చర్యలు తీసుకోవాలని వశిష్ఠ ఫిక్సయినట్లు కూడా గుసగుసలు వినిపించాయి. మొత్తానికి వశిష్ఠ అయితే ఈ ప్రాజెక్టులో లేడని స్పష్టమైపోయింది. కానీ అసలు ఈ సినిమా ఉంటుందా లేదా అన్న సందేహాలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కేవలం ‘బింబిసార’ క్రేజ్ను క్యాష్ చేసుకోవడానికి మాత్రమే సీక్వెల్ తీయాలని కళ్యాణ్ రామ్ అనుకోవట్లేదు. కొందరు రచయితలు.. అలాగే తన ప్రొడక్షన్ టీం కలిసి ఈ సినిమాకు స్క్రిప్టు రెడీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.
అలాగే తన వీఎఫెక్స్ కంపెనీ ఈ సినిమాకు కావాల్సిన సహకారం అంతా అందిస్తుంది. ‘బింబిసార’ సక్సెస్లో ఆ కంపెనీ పాత్ర కూడా కీలకమే. వీళ్లంతా కలిసి ఒక సంతృప్తికరమైన స్క్రిప్టు రెడీ చేసి.. దాన్ని సమర్థంగా తెరకెక్కించగల దర్శకుడు దొరికితేనే ఈ ప్రాజెక్టు ఉంటుందట. ఐతే ఇప్పటిదాకా జరిగిన వర్క్ పట్ల అయితే పూర్తి సంతృప్తి లేదని తెలుస్తోంది. అందుకే ముందు అనుకున్నట్లు బుధవారం కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను అనౌన్స్ చేయలేదు. కాబట్టి ‘బింబిసార’ సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని చెప్పలేని పరిస్థితి.
This post was last modified on July 7, 2023 11:20 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…