గత ఏడాది తెలుగు వచ్చిన బిగ్గెస్ట్ హిట్లలో ‘బింబిసార’ ఒకటి. కొన్నేళ్లుగా సరైన విజయాలు లేని నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త దర్శకుడు వశిష్ఠ ఈ చిత్రాన్ని రూపొందించాడు. కళ్యాణ్ రామ్ మార్కెట్ స్థాయికి మించి బాగా ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమా పెట్టుబడి మీద రెట్టింపు కన్నా ఎక్కువ ఆదాయం తెచ్చిపెట్టింది. కళ్యాణ్ రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచిన ‘బింబిసార’కు సీక్వెల్ తీయాలని ఆ సినిమా రిలీజైనపుడే అనుకున్నారు.
ఈ దిశగా పని కూడా మొదలైంది. కానీ అనూహ్య పరిణామాల మధ్య ఈ చిత్రం నుంచి దర్శకుడు వశిష్ఠ తప్పుకున్నాడు. అతడికి క్రేజీ ఆఫర్లు ఉండటంతో ఈ చిత్రం నుంచి తప్పుకున్నందుకు పెద్దగా ఫీలేమీ అవ్వాల్సిన పని లేకపోయింది. ఐతే కాంట్రాక్ట్ బ్రేక్ చేసి ఈ సినిమా నుంచి తప్పుకున్నందుకు కళ్యాణ్ రామ్ సంస్థకు నష్టపరిహారం చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తినట్లు వార్తలు వచ్చాయి.
అదే సమయంలో తన ఇన్పుట్స్, ఐడియాలను సీక్వెల్ కోసం వాడుకుంటే న్యాయ పరమైన చర్యలు తీసుకోవాలని వశిష్ఠ ఫిక్సయినట్లు కూడా గుసగుసలు వినిపించాయి. మొత్తానికి వశిష్ఠ అయితే ఈ ప్రాజెక్టులో లేడని స్పష్టమైపోయింది. కానీ అసలు ఈ సినిమా ఉంటుందా లేదా అన్న సందేహాలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కేవలం ‘బింబిసార’ క్రేజ్ను క్యాష్ చేసుకోవడానికి మాత్రమే సీక్వెల్ తీయాలని కళ్యాణ్ రామ్ అనుకోవట్లేదు. కొందరు రచయితలు.. అలాగే తన ప్రొడక్షన్ టీం కలిసి ఈ సినిమాకు స్క్రిప్టు రెడీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.
అలాగే తన వీఎఫెక్స్ కంపెనీ ఈ సినిమాకు కావాల్సిన సహకారం అంతా అందిస్తుంది. ‘బింబిసార’ సక్సెస్లో ఆ కంపెనీ పాత్ర కూడా కీలకమే. వీళ్లంతా కలిసి ఒక సంతృప్తికరమైన స్క్రిప్టు రెడీ చేసి.. దాన్ని సమర్థంగా తెరకెక్కించగల దర్శకుడు దొరికితేనే ఈ ప్రాజెక్టు ఉంటుందట. ఐతే ఇప్పటిదాకా జరిగిన వర్క్ పట్ల అయితే పూర్తి సంతృప్తి లేదని తెలుస్తోంది. అందుకే ముందు అనుకున్నట్లు బుధవారం కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను అనౌన్స్ చేయలేదు. కాబట్టి ‘బింబిసార’ సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని చెప్పలేని పరిస్థితి.
This post was last modified on July 7, 2023 11:20 am
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…