మంచు ఫ్యామిలీ నుంచి కొంచెం లేటుగా నటనలోకి అడుగు పెట్టింది లక్ష్మీ ప్రసన్న. ఆమె రచ్చ గెలిచి ఇంటికి రావడం విశేషం. టాలీవుడ్లో సినిమాలు చేయడానికి ముందే.. ఆమె అమెరికాలో నట శిక్షణ తీసుకుని హాలీవుడ్లో నటించింది. ఒక సినిమా, ఒక టీవీ సిరీస్, ఒక షార్ట్ ఫిలింలోనూ నటించింది. లక్ష్మి టాలీవుడ్ అరంగేట్రానికి ముందే సంబంధిత సన్నివేశాలు కొన్ని యూట్యూబ్లో వైరల్ అయ్యాయి.
ఐతే తెలుగులో చేసిన తొలి సినిమా ‘అనగనగా ఒక ధీరుడు’తోనే నంది అవార్డు అందుకున్న మంచు లక్ష్మి.. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ‘గుండెల్లో గోదారి’ సహా ఆమె చేసిన సినిమాలన్నీ నిరాశ పరిచాయి. ఇప్పుడు ఆమె కెరీర్ బాగా స్లో అయిపోయింది. తండ్రితో కలిసి ఏదో ఒక సినిమా చేస్తున్నప్పటికీ దానికి అంతగా క్రేజ్ లేదు. ఐతే తాను హాలీవుడ్లో ఉంటే కథ వేరుగా ఉండేది అంటోంది లక్ష్మి.
తన హాలీవుడ్ కెరీర్ మధ్యలో ఆగిపోవడంపై ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసింది. హాలీవుడ్లో ఉంటే మీ కెరీర్ మరోలా ఉండేదేమో కదా అని ఒక ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు మంచు లక్ష్మి బదులిస్తూ.. ‘‘నేను హాలీవుడ్లో ఒక సిరీస్, సినిమా చేసి వదిలేయలేదు. నేను హాలీవుడ్ యాక్టర్ని. నా దురదృష్టం కొద్దీ అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చా.
ఈ పదేళ్లు అక్కడ ఉండుంటే నేను ఎక్కడో ఉండేదాన్ని. పాప కావాలి అనుకున్నపుడు ఇండియాకు వచ్చేయాలని డిసైడయ్యా. పిల్లల విషయంలో ఇక్కడున్న కంఫర్ట్, కేరింగ్ ఇంకెక్కడా ఉండదు. ఇప్పుడు పాపకు రెక్కలొచ్చాయి. మాక్కూడా రెక్కలొచ్చాయి. అందుకే వేరే అవకాశాల కోసం చూస్తున్నాం. మళ్లీ విదేశాలకు వెళ్లే అవకాశం వస్తే ఒక్క క్షణం ఆలోచించకుండా ఫ్లైట్ ఎక్కేశా’’ అని తెలిపింది.
This post was last modified on July 7, 2023 9:44 am
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…
ఏప్రిల్ 30 'పెద్ది' తప్పుకున్నాక అందరి దృష్టి ఆ స్లాట్ మీద పడింది. ఇది ముందే ఊహించిన 'గాయపడ్డ సింహం'…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే చాలా బిల్లులు పెండింగులో ఉండగా..…
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…