ఆన్ లైన్ లో సెన్సేషన్ సృష్టిస్తున్న సలార్ లో హీరో ప్రభాస్, విలన్ పృథ్విరాజ్ సుకుమారన్ కంటే ఎక్కువ హైలైట్ అయ్యింది సగం వీడియోకు పైగా కనిపించే నటుడు టిను ఆనంద్. కెజిఎఫ్ రెండు భాగాల్లో రాఖీ భాయ్ క్యారెక్టర్ కు ఎలివేషన్ ఇచ్చేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ సీనియర్లు అనంత్ నాగ్, ప్రకాష్ రాజ్ లను ఎలాగైతే వాడుకున్నాడో ఇప్పుడీ లెజెండరీ యాక్టర్ ని కూడా సరిగ్గా ఆ ఉద్దేశంతోనే తెచ్చుకున్నాడు. ఈయన వయసు 77 సంవత్సరాలు. ఆషామాషీ వ్యక్తి కాదండోయ్. ఇప్పటి తరానికి అంతగా అవగాహన లేకపోవచ్చు కానీ ఆయన బ్యాక్ గ్రౌండ్ తెలుసుకుంటే ఎందుకు ఎంచుకున్నారో అర్థమవుతుంది.
టిను ఆనంద్ చాలా తక్కువగా తెలుగు, తమిళ సినిమాల్లో కనిపించినా గుర్తుండిపోయే పాత్రలు చేశారు. బాలకృష్ణ ఆదిత్య 369లో ప్రొఫెసర్ గా, చిరంజీవి అంజిలో వజ్రం కోసం పరితపించే కోటీశ్వరుడిగా ఆయన పెర్ఫార్మన్స్ ని మర్చిపోలేం. ప్రభాస్ సాహో, దుల్కర్ సల్మాన్ సీతా రామంలోనూ తళుక్కున మెరిశారు. అయితే ఇవన్నీ టిను ఆనంద్ గొప్పదనం కాదు. ఆయన మంచి రచయిత కం దర్శకులు కూడా. అమితాబ్ బచ్చన్ కు కాలియా లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. తర్వాత బిగ్ బితోనే షెహేంషా, మై ఆజాద్ హూ, మేజర్ సాబ్ రూపొందించారు. అన్నీ కమర్షియల్ హిట్లే.
చివరిగా డైరెక్ట్ చేసింది 2003లో ఏక్ హిందూస్థానీ. సునీల్ శెట్టి, రవీనాటాండన్ జంటగా రూపొందిన ఈ దేశభక్తి చిత్రం విడుదల కాలేదు. నటుడిగా, రైటర్ గా ఎన్నో సూపర్ హిట్స్ లో భాగం పంచుకున్నారు. ఫిల్మోగ్రఫీలో మరపురాని పాత్రలు దక్కించుకున్నారు. ఇంత లేట్ వయసులోనూ ఏదైనా అవకాశం వస్తే కాదనకుండా చేస్తారు. ఇప్పుడీ సలార్ టీజర్ లో అంత పవర్ ఫుల్ డైలాగుని గొంతు వణక్కుండా ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వచ్చేలా చెప్పడం టిను ఆనంద్ కే చెల్లింది. ఒకటి రెండు తప్ప సౌత్ లో అన్నీ సక్సెస్ ఫుల్ మూవీస్ లోనే నటించిన పెద్దాయనకు సలార్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో.
This post was last modified on July 7, 2023 7:46 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…