పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ క్రేజీ కాంబోలో రూపొందుతున్న బ్రో బిజినెస్ ఊపందుకుంది. ట్రేడ్ న్యూస్ ప్రకారం వంద కోట్లకు పైగానే థియేట్రికల్ బిజినెస్ జరిగిందని ఇన్ సైడ్ టాక్. ఏరియాల వారిగా నిర్మాతలు అడిగిన మొత్తం ఎంత భారీగా ఉన్నా డిస్ట్రిబ్యూటర్లు వెనుకడుగు వేయలేదని తెలిసింది. వేసవి మొత్తం కేవలం రెండు మూడు హిట్లతోనే గడిచిపోవడం, ఏడాది పైగా గ్యాప్ తో వస్తున్న పవర్ స్టార్ మూవీ కావడం లాంటి కారణాల వల్ల బయ్యర్లు ఎగబడి కొంటున్నారని సమాచారం. పైగా జనసేన కార్యకలాపాలు మంచి వేగమందుకుంటున్న టైంలో బ్రో వస్తోంది.
మరి ఇంతేసి పెట్టి హక్కులు కొన్నప్పుడు సహజంగానే రెగ్యులర్ టికెట్ రేట్లతో వెళ్ళలేరు. తెలంగాణలో ఎలాగూ మల్టీప్లెక్సులకు 295 రూపాయలు ప్లస్ ఎక్స్ ట్రా షోకు అనుమతి ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎటొచ్చి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితే అంత అనుకూలంగా ఉండదు. పవన్ వదులుతున్న విమర్శల బాణాలకు అధికారిక వైసిపి పార్టీ కిందా మీద అవుతోంది. ఏకంగా ముఖ్యమంత్రే పవన్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసే దాకా వచ్చింది. ఇంత వేడిలో బ్రో రిలీజవుతోంది కాబట్టి సహజంగానే దాని మీద కన్ను పడుతుంది. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ పరిణామాలు గుర్తున్నాయిగా.
గత ఏడాది కాలంలో ఏపిలో టికెట్ హైకులు, బెనిఫిట్ షోలకు సంబంధించి అన్ని పెద్ద సినిమాలకు పర్మిషన్లు ఇచ్చారు. అయితే బ్రో భారీ బడ్జెట్ కాదు. పైగా రీమేక్. సేఫ్ బడ్జెట్ లోనే అయిపోయింది. అలాంటప్పుడు నిర్మాతలు అనుమతులు కోరతారా అంటే అనుమానమే. ఒకవేళ అడిగినా ఇస్తారా లేదానేది ఆసక్తికరంగా మారింది. ఇస్తే సమస్య ఇవ్వకపోతే తలనొప్పి అన్నట్టు ఉంది వైసిపి పరిస్థితి. ఒకవేళ ఈ గొడవంతా ఎందుకనుకుంటే పాత రేట్లతోనే ఏపీలో టికెట్ల అమ్మకాలు చేసుకోవచ్చు. జూలై 28 విడుదలకు రెండు మూడు రోజుల వరకు ఈ సీన్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. ఏమైనా అనూహ్య నిర్ణయాలు ఉంటే తప్ప.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…