భాష, ప్రాంతీయ భాష భేదాలు ఏమీ లేకుండా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుల్లో దుల్కర్ సల్మాన్ ఒకడు. మమ్ముట్టి వారసుడు కాబట్టి అతను మలయాళంలో స్టార్ కావడంలో ఆశ్చర్యం లేదు. కానీ ‘మహానటి’, ‘సీతారామం’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను.. ‘ఓకే బంగారం’, ‘కన్నుం కన్నుం కొల్లయడిత్తాల్’ సినిమాలతో తమిళ ఆడియన్స్ను.. ‘కార్వాన్’; ‘చుప్’ మూవీస్తో బాలీవుడ్ వాళ్లను కట్టి పడేశాడు ఈ టాలెంటెడ్ యాక్టర్.
త్వరలోనే ‘కింగ్ ఆఫ్ కొత్తా’ అనే భారీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న దుల్కర్.. తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టి డెలీట్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అభిమానులను కంగారు పెట్టింది. దుల్కర్ ఆ పోస్టులో కాస్త కన్నీళ్లు పెట్టుకున్న ఫొటోను షేర్ చేయడం ఈ ఆశ్చర్యానికి, ఆందోళనకు ప్రధాన కారణం.
‘‘నేను నిద్రపోయి చాలా సమయం అవుతోంది. ఇలాంటిది నా అనుభవంలోకి రావడం ఇదే తొలిసారి. ఇంతకుముందెన్నడూ ఇది జరగలేదు. నా మనసు నుంచి ఇది పోని స్థితికి నేను చేరుకున్నాను. నేను ఇంకా ఎంతో చెప్పాలనుకుంటున్నా. కానీ చెప్పలేను’’ అని దుల్కర్ ఆ పోస్టులో పెట్టాడు. అభిమానులు ఆ ఫొటో, ఈ మెసేజ్ చూసి కంగారు పడి ఏమైంది దుల్కర్ అని అడుగుతుంటే.. కొన్ని నిమిషాలకే అతను ఈ పోస్టు డెలీట్ చేశాడట.
దీంతో ‘What happened to dulquer’ అనే ప్రశ్నతో సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు. కానీ దుల్కర్ తర్వాత సైలెంటుగానే ఉన్నాడు తప్ప సమాధానం ఇవ్వలేదు. మరి దుల్కర్ను ఇంతగా డిస్టర్బ్ చేసిన విషయం ఏంటనే ప్రశ్న అందరినీ తొలిచేస్తోంది. భారీ అంచనాలు నెలకొన్న దుల్కర్ కొత్త సినిమా ‘కింగ్ ఆఫ్ కొత్తా’ ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on July 3, 2023 8:00 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…