శ్రీవిష్ణు సామజవరగమన స్లోగా మొదలైనా క్రమంగా స్పీడ్ పెంచేసింది. మొదటి రోజు స్పై మీద ఉన్న బజ్ వల్ల ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ తెచ్చుకోలేకపోయిన ఈ ఎంటర్ టైనర్ అనూహ్యంగా రెండో మూడో రోజు నుంచి ఊపందుకుంది. ముఖ్యంగా ఆదివారం బుకింగ్స్ రచ్చ అనిపించేలా ఉన్నాయి. ఈ హీట్ తగ్గకుండా ఉండటం కోసం హీరో హీరోయిన్ తో సహా టీమ్ మొత్తం విజయ యాత్రలు మొదలుపెట్టి తెలంగాణ నుంచి కర్నూలు దాకా ఒక రౌండ్ వేసేసింది. ఇంకో వారం రోజుల పాటు ఇవి కొనసాగించేలా ప్లాన్ చేసుకున్నారు. వీక్ డేస్ డ్రాప్ రాకుండా ఉండాలంటే ఇవి అవసరమే.
ముఖ్యంగా మీడియా రివ్యూలతో పాటు ట్విట్టర్, ఇన్స్ టా, ఫేస్ బుక్ లో యాక్టివ్ గా ఉండే యుజర్లు సినిమా చూసి చాలా పాజిటివ్ గా రెస్పాండ్ కావడం ఫ్యామిలీ ఆడియన్స్ ని కదిలిస్తోంది. నిజానికి ఫస్ట్ డే ఈవెనింగ్ షో దాకా ఏమంత కదలిక కనిపించలేదు. స్పైకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ వల్ల ఒకేరోజు రెండు చూడలేని పరిస్థితిలో ఉన్న ఆడియన్స్ ని సామజవరగమన మిస్ చేసుకుంది. వాళ్లంతా వీకెండ్ కు వచ్చేశారు. బ్రేక్ ఈవెన్ గా పెట్టుకున్న మూడున్నర కోట్లను శనివారానికే అందుకోవడంతో సండే నుంచి వచ్చేవన్నీ బయ్యర్లకు లాభాలుగా మారబోతున్నాయి.
వచ్చే శుక్రవారం కొత్త రిలీజులు ఎక్కువగా ఉన్నప్పటికీ సామజవరగమనకు ఇంకో వారం పాటు ఢోకా లేనట్టే కనిపిస్తోంది. హిందీ చిత్రం సత్యప్రేమ్ కి కహానికి మంచి టాకే ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల పరంగా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ డయల్ అఫ్ ది డెస్టినీకి సోసో రెస్పాన్స్ రావడం ప్లస్ అయ్యింది. రేసులో ఉన్న నారాయణ అండ్ కో, మాయా పేటిక, గండలు మినిమమ్ బజ్ తో పాటు ఓ మోస్తరుగా ఉన్నట్టు కూడా టాక్ రాకపోవడంతో సామజవరగమనకు మరింత అనుకూలంగా మారింది. శ్రీవిష్ణు హ్యాట్రిక్ ఫ్లాపులకు చెక్ పడిపోయింది
తెలుగు తమిళ భాషల్లో ఫాలోయింగ్ ఉన్న హీరో ప్రదీప్ రంగనాధన్ వరస విజయాలకు బ్రేక్ వేస్తూ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ…
ఐపీఎల్ అంటేనే చివరి బంతి వరకు ఉండే ఉత్కంఠ. కానీ ఈసారి ఆ మజా పూర్తిగా తగ్గిపోయింది. పరుగుల వరద…
నిజామాబాద్లో నటరాజ్ అనే ఒక సింగిల్ స్క్రీన్. దాని లీజ్ మార్పు గొడవ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ ఎస్వీసీ…
ఏపీ అధికార పార్టీ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సంచలన ప్రకటన చేశారు. పార్టీలో యువతరాన్ని ఆకర్షించేందుకు..…
పాలన విషయంలో మంత్రి లోకేష్ పక్కా ప్లానింగ్తో వ్యవహరిస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాలను విధానపరమైన అంశాలను కలగాపులగం…
పద్దెనిమిదేళ్ల అవమానాలు, ఎగతాళి మాటలకు బెంగళూరు జట్టు శాశ్వతంగా ముగింపు పలికింది. ఐపీఎల్ చరిత్రలో ట్రోల్స్ కు కేరాఫ్ అడ్రస్…