దాదాపు 20 ఏళ్ల కెరీర్ తమన్నాది. టీనేజీలోనే హీరోయిన్ అయిపోయిన ఆమెకు.. తెలుగులో ‘శ్రీ’ సినిమా చేసే సమయానికి కేవలం పదహారేళ్లు మాత్రమే. మొదట్లో చిన్న సినిమాలే చేసిన ఆమె.. తర్వాత పెద్ద రేంజికి వెళ్లిపోయింది. దక్షిణాదిన బిగ్గెస్ట్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగింది. ఇక్కడ టాప్ స్టార్లు చాలామందితో సినిమాలు చేసింది.
కెరీర్లో చాలా వరకు గ్లామర్ రోల్సే చేసినప్పటికీ.. ఆమె హద్దులు దాటి అందాల ఆరబోత చేసింది లేదు. ఇంటిమేట్ సీన్ల జోలికి వెళ్లలేదు. చివరికి లిప్ లాక్ సీన్ కూడా చేయలేదు మిల్కీ బ్యూటీ. ఈ విషయంలో తనకంటూ కొన్ని రూల్స్ పెట్టుకుని సాగిపోయిందామె. అలాంటిది కెరీర్ చరమాంకంలో తమన్నా ఈ రూల్స్ అన్నీ బ్రేక్ చేసేసింది. కొన్ని వారాల వ్యవధిలో రిలీజైన రెండు వెబ్ సిరీస్ల్లో కోసం తమన్నా మామూలుగా రెచ్చిపోలేదు. అందులో ఒకటి ‘జీ కర్దా’ కాగా.. ఇంకోటి ‘లస్ట్ స్టోరీస్-2’.
అమేజాన్ ప్రైమ్ కోసం చేసిన ‘జీ కర్దా’లో ఇద్దరు జూనియర్ కుర్రాళ్లతో ఆమె రెచ్చిపోయి రొమాన్స్ చేసింది. తమన్నాను అసలు ఊహించుకోలేని సన్నివేశాల్లో ఆమె కనిపించింది. అందులోని బోల్డ్ డైలాగ్స్ సైతం పెద్ద చర్చకే దారి తీశాయి. ఐతే ‘జీ కర్దా’ను కుర్రకారు కేవలం తమన్నా హాట్ సీన్ల కోసమే చూశారు తప్ప.. ఇందులో మరేదీ ఆకర్షించలేదు. కథాకథనాలు పేలవంగా ఉండటంతో మొత్తం సిరీస్ చూడటం శిరోభారంగా మారింది.
దీంతో తమన్నా హాట్ సీన్లు ఉన్న టైమింగ్ నోట్ చేసి.. ఆ సమాచారాన్ని సోషల్ మీడియాలో కుర్రాళ్లు షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ‘లస్ట్ స్టోరీస్’ విషయంలో కూడా అదే జరుగుతోంది. ఇందులోనూ తమన్నా హాట్ సీన్లే హైలైట్ అయ్యాయి. ఇందులో తమ్మూ మరింత బోల్డ్గా నటించింది. తన నిజ జీవిత బాయ్ఫ్రెండ్గా భావిస్తున్న విజయ్ వర్మతో తమ్మూ రెచ్చిపోయి హాట్ సీన్లు చేసింది. క్లీవేజ్ షోలతో రెచ్చిపోయింది. కానీ ‘లస్ట్ స్టోరీస్’ మాత్రం చాలా బ్యాడ్ రివ్యూలు తెచ్చుకుంది. దీన్నొక చెత్త సిరీస్గా పేర్కొంటున్నారు. ‘లస్ట్ స్టోరీస్-1’లో ఉన్న క్లాస్ ఇందులో కనిపించలేదు. చివరగా చూస్తే తమన్నా ఇలాంటి సిరీస్ల కోసమా ఇన్నాళ్లు కాపాడుకుంటూ వచ్చిన ఇమేజ్ను దెబ్బ తీసుకుని ఇంత రెచ్చిపోయి నటించింది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
This post was last modified on July 1, 2023 5:14 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…