సౌత్ ఇండియన్ సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటి ‘చంద్రముఖి’. ఒక టైంలో వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ చిత్రంతోనే బలంగా బౌన్స్ బ్యాక్ అయ్యారు. దక్షిణాదిన హార్రర్ కామెడీ ట్రెండు ఊపందుకుని ఒక పదేళ్లు ఆ జానర్ సినిమాలు పెద్ద ఎత్తున తెరకెక్కడానికి బాటలు పరిచింది ‘చంద్రముఖి’నే.
తమిళంలోనే కాక తెలుగులోనూ ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. 90వ దశకంలో మలయాళంలో వచ్చిన ‘మణిచిత్ర తాలు’కి ఇది రీమేక్. తమిళంలో ఈ చిత్రాన్ని రూపొందించిన పి.వాసునే కన్నడలో కూడా రీమేక్ చేసి అక్కడా ఘనవిజయాన్నందుకున్నాడు. కానీ దీనికి కొనసాగింపుగా తీసి హిట్ కన్నడలో ‘ఆప్తమిత్ర-2’ తీసి హిట్ కొట్టిన వాసు.. తెలుగులో దాన్ని ‘నాగవల్లి’ పేరుతో రీమేక్ చేసి దారుణమైన ఫలితాన్ని అందుకున్నాడు. ‘చంద్రముఖి’నే వెంకీని హీరోగా పెట్టి తీసినట్లు అనిపించిన ఆ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు తిరస్కరించారు.
‘నాగవల్లి’ వచ్చి 14 ఏళ్లు అవుతోంది. ఆ టైంలోనే అది ఔట్ డేటెడ్ సినిమాలా కనిపించింది. అలాంటిది ఇప్పుడు పి.వాసు ‘చంద్రముఖి-2’ అంటూ రాబోతున్నాడు. వాసు ఔట్ డేటెడ్ డైరెక్టర్ల లిస్టులో చేరి చాలా ఏళ్లయింది. అలాంటి దర్శకుడు ఇప్పుడు లారెన్స్ హీరోగా ‘చంద్రముఖి-2’ తీశాడు. అసలు ఆల్రెడీ కన్నడ, తెలుగు భాషల్లో సీక్వెల్ వచ్చాక ఇప్పుడు మళ్లీ తమిళంలో కొత్తగా సీక్వెల్ చేయడం ఏంటో అర్థం కావడం లేదు.
హార్రర్ కామెడీ సినిమాలు జనాలక మొహం మొత్తేసి చాలా ఏళ్ల కిందటే వాటిని లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఆ జానర్లో సినిమాలే ఆగిపోయాయి. లారెన్స్ సైతం ఈ జానర్ సినిమాలతో మొనాటనీ తెప్పించేశాడు. హార్రర్ కామెడీల్లో అతడి ఓవరాక్షన్ను ప్రేక్షకులు తట్టుకునే పరిస్థితి లేదు. తెలుగులో తన మార్కెట్ బాగా దెబ్బ తినేసింది. మరి ఇలాంటి హీరో, దర్శకుడు కలిసి ఔట్ డేటెడ్ జానర్లో ‘చంద్రముఖి’ సీక్వెల్ తీస్తే ప్రేక్షకులు పట్టించుకుంటారా అన్నది డౌట్. తమిళంలో ఏమో కానీ.. తెలుగులో మాత్రం ఈ సినిమా ఆడటం కష్టమే అనిపిస్తోంది.
This post was last modified on June 30, 2023 4:04 pm
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం తాడిపత్రిలో ఎన్నికల అనంతరం తీవ్ర హింస చెలరేగింది. ఇక్కడ పోటీలో ఉన్న జేసీ…