ఎప్పడికప్పుడు రీ రిలీజుల ట్రెండ్ అయిపోతుందనుకుంటున్న టైంలో ఏదో ఒక సినిమా మళ్ళీ దానికి ఊపిరి పోస్తోంది. 29న ఈ నగరానికి ఏమైంది అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే ఈ విషయం మరోసారి అర్థమైపోతుంది. హైదరాబాద్ నుంచి జిల్లా కేంద్రాల దాకా అధిక శాతం షోలు ముందస్తుగానే ఫుల్ అయిపోతున్నాయి. నిజానికి ట్రేడ్ సైతం ఇది ఊహించలేదు. అయిదో వార్షికోత్సవం సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్ దీనికి పరిమిత విడుదల ఇవ్వాలనే ఉద్దేశంతో తక్కువ థియేటర్లను మాట్లాడుకుంది. తీరా చూస్తే డిమాండ్ కు తగ్గట్టు ఇప్పుడా కౌంట్ పెంచక తప్పేలా లేదు.
దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ ట్రెండ్ చూసి షాక్ అవుతున్నాడు. చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు సీట్లు బ్లాక్ చేశారని అనుకుంటున్నారని, కానీ ఆడియన్స్ స్వయంగా ఆ పని చేయడంతో తనకు నోట మాట రావడం లేదని ట్విట్టర్ లో చెప్పుకొచ్చాడు. ఈ రేంజ్ లో అప్పుడే చూసి ఉంటే ఈపాటికి గోవాలో ఇల్లు కట్టుకునే వాడినని సెటైర్ వేసుకున్నారు. ఎందుకంటే ఒరిజినల్ రిలీజ్ టైంలో ఈ నగరానికి ఏమైందికి యూత్ మద్దతు ఎంత దక్కినా కమర్షియల్ లెక్కల్లో మరీ బ్లాక్ బస్టర్ కాలేకపోయింది. తక్కువ బడ్జెట్ కావడం వల్ల గట్టెక్కింది కానీ అదిరిపోయే హిట్ అయితే కాదు
ఏళ్ళు గడిచే కొద్దీ దీనికి ఫ్యాన్స్ పెరిగిపోయారు. కల్ట్ స్టేటస్ వచ్చేసింది. కుర్రాళ్ళ జీవితాల్లో అచ్చం ఎలా ప్రవర్తిస్తారో దాన్నే తరుణ్ భాస్కర్ ఆవిష్కరించడంతో ఫాలోయింగ్ వచ్చేసింది. విశ్వక్ సేన్, అభినవ్ గోమటంలకు మొదటి బ్రేక్ ఇదే. మరుసటి రోజు వస్తున్న పవన్ కళ్యాణ్ తొలిప్రేమకు ధీటుగా బుకింగ్స్ జరుగుతున్న ఈ నగరానికి ఏమైంది చూస్తుంటే సైలెంట్ కిల్లర్ లాగా రికార్డులు కొట్టేలా ఉంది. తరుణ్ కొత్త మూవీ కీడా కోలా టీజర్ కూడా ఇందులోనే ప్లే చేయబోతున్నారు. ఆన్ లైన్ వెర్షన్ లేట్ గా ఉంటుందని అందుకే ఇదో స్పెషల్ బోనస్ కింద ఇస్తున్నారు
This post was last modified on June 27, 2023 11:21 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…