ఎప్పడికప్పుడు రీ రిలీజుల ట్రెండ్ అయిపోతుందనుకుంటున్న టైంలో ఏదో ఒక సినిమా మళ్ళీ దానికి ఊపిరి పోస్తోంది. 29న ఈ నగరానికి ఏమైంది అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే ఈ విషయం మరోసారి అర్థమైపోతుంది. హైదరాబాద్ నుంచి జిల్లా కేంద్రాల దాకా అధిక శాతం షోలు ముందస్తుగానే ఫుల్ అయిపోతున్నాయి. నిజానికి ట్రేడ్ సైతం ఇది ఊహించలేదు. అయిదో వార్షికోత్సవం సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్ దీనికి పరిమిత విడుదల ఇవ్వాలనే ఉద్దేశంతో తక్కువ థియేటర్లను మాట్లాడుకుంది. తీరా చూస్తే డిమాండ్ కు తగ్గట్టు ఇప్పుడా కౌంట్ పెంచక తప్పేలా లేదు.
దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ ట్రెండ్ చూసి షాక్ అవుతున్నాడు. చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు సీట్లు బ్లాక్ చేశారని అనుకుంటున్నారని, కానీ ఆడియన్స్ స్వయంగా ఆ పని చేయడంతో తనకు నోట మాట రావడం లేదని ట్విట్టర్ లో చెప్పుకొచ్చాడు. ఈ రేంజ్ లో అప్పుడే చూసి ఉంటే ఈపాటికి గోవాలో ఇల్లు కట్టుకునే వాడినని సెటైర్ వేసుకున్నారు. ఎందుకంటే ఒరిజినల్ రిలీజ్ టైంలో ఈ నగరానికి ఏమైందికి యూత్ మద్దతు ఎంత దక్కినా కమర్షియల్ లెక్కల్లో మరీ బ్లాక్ బస్టర్ కాలేకపోయింది. తక్కువ బడ్జెట్ కావడం వల్ల గట్టెక్కింది కానీ అదిరిపోయే హిట్ అయితే కాదు
ఏళ్ళు గడిచే కొద్దీ దీనికి ఫ్యాన్స్ పెరిగిపోయారు. కల్ట్ స్టేటస్ వచ్చేసింది. కుర్రాళ్ళ జీవితాల్లో అచ్చం ఎలా ప్రవర్తిస్తారో దాన్నే తరుణ్ భాస్కర్ ఆవిష్కరించడంతో ఫాలోయింగ్ వచ్చేసింది. విశ్వక్ సేన్, అభినవ్ గోమటంలకు మొదటి బ్రేక్ ఇదే. మరుసటి రోజు వస్తున్న పవన్ కళ్యాణ్ తొలిప్రేమకు ధీటుగా బుకింగ్స్ జరుగుతున్న ఈ నగరానికి ఏమైంది చూస్తుంటే సైలెంట్ కిల్లర్ లాగా రికార్డులు కొట్టేలా ఉంది. తరుణ్ కొత్త మూవీ కీడా కోలా టీజర్ కూడా ఇందులోనే ప్లే చేయబోతున్నారు. ఆన్ లైన్ వెర్షన్ లేట్ గా ఉంటుందని అందుకే ఇదో స్పెషల్ బోనస్ కింద ఇస్తున్నారు
This post was last modified on June 27, 2023 11:21 pm
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు..…
వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…
రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…
టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున వరుసగా తమిళ నటులు, టెక్నీషియన్లతో పని చేస్తున్నాడు. గత ఏడాది ధనుష్తో కలిసి…
అక్కడెక్కడో ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికాలు యుద్దం చేసుకుంటే.. వారికి వేలాది కిలోమీటర్ల ఇవతల ఉన్న బెంగళూరులోని టిఫిన్ సెంటర్లు..…
నిర్మాత కోన వెంకట్ బ్యాండ్ మేళంని చాలా సీరియస్ గా తీసుకున్న వైనం ప్రమోషన్లలో కనిపిస్తోంది. కోర్ట్ జంట హర్ష్…