ఎప్పడికప్పుడు రీ రిలీజుల ట్రెండ్ అయిపోతుందనుకుంటున్న టైంలో ఏదో ఒక సినిమా మళ్ళీ దానికి ఊపిరి పోస్తోంది. 29న ఈ నగరానికి ఏమైంది అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే ఈ విషయం మరోసారి అర్థమైపోతుంది. హైదరాబాద్ నుంచి జిల్లా కేంద్రాల దాకా అధిక శాతం షోలు ముందస్తుగానే ఫుల్ అయిపోతున్నాయి. నిజానికి ట్రేడ్ సైతం ఇది ఊహించలేదు. అయిదో వార్షికోత్సవం సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్ దీనికి పరిమిత విడుదల ఇవ్వాలనే ఉద్దేశంతో తక్కువ థియేటర్లను మాట్లాడుకుంది. తీరా చూస్తే డిమాండ్ కు తగ్గట్టు ఇప్పుడా కౌంట్ పెంచక తప్పేలా లేదు.
దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ ట్రెండ్ చూసి షాక్ అవుతున్నాడు. చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు సీట్లు బ్లాక్ చేశారని అనుకుంటున్నారని, కానీ ఆడియన్స్ స్వయంగా ఆ పని చేయడంతో తనకు నోట మాట రావడం లేదని ట్విట్టర్ లో చెప్పుకొచ్చాడు. ఈ రేంజ్ లో అప్పుడే చూసి ఉంటే ఈపాటికి గోవాలో ఇల్లు కట్టుకునే వాడినని సెటైర్ వేసుకున్నారు. ఎందుకంటే ఒరిజినల్ రిలీజ్ టైంలో ఈ నగరానికి ఏమైందికి యూత్ మద్దతు ఎంత దక్కినా కమర్షియల్ లెక్కల్లో మరీ బ్లాక్ బస్టర్ కాలేకపోయింది. తక్కువ బడ్జెట్ కావడం వల్ల గట్టెక్కింది కానీ అదిరిపోయే హిట్ అయితే కాదు
ఏళ్ళు గడిచే కొద్దీ దీనికి ఫ్యాన్స్ పెరిగిపోయారు. కల్ట్ స్టేటస్ వచ్చేసింది. కుర్రాళ్ళ జీవితాల్లో అచ్చం ఎలా ప్రవర్తిస్తారో దాన్నే తరుణ్ భాస్కర్ ఆవిష్కరించడంతో ఫాలోయింగ్ వచ్చేసింది. విశ్వక్ సేన్, అభినవ్ గోమటంలకు మొదటి బ్రేక్ ఇదే. మరుసటి రోజు వస్తున్న పవన్ కళ్యాణ్ తొలిప్రేమకు ధీటుగా బుకింగ్స్ జరుగుతున్న ఈ నగరానికి ఏమైంది చూస్తుంటే సైలెంట్ కిల్లర్ లాగా రికార్డులు కొట్టేలా ఉంది. తరుణ్ కొత్త మూవీ కీడా కోలా టీజర్ కూడా ఇందులోనే ప్లే చేయబోతున్నారు. ఆన్ లైన్ వెర్షన్ లేట్ గా ఉంటుందని అందుకే ఇదో స్పెషల్ బోనస్ కింద ఇస్తున్నారు
This post was last modified on June 27, 2023 11:21 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…