పేరుకు కన్నడ అమ్మాయే కానీ ప్రియమణి ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే. కన్నడ, తమిళం, హిందీ, మలయాళ చిత్రాల్లోనూ నటించినా.. ఆమె స్టార్ స్టేటస్ అనుభవించింది టాలీవుడ్లోనే. హీరోయిన్గా కెరీర్ ముగిశాక ఇప్పుడు ఆమె క్యారెక్టర్, నెగెటివ్ రోల్స్ వైపు మళ్లింది. ఇటీవలే కస్టడీ సినిమాలో విలన్ పాత్రతో ఆకట్టుకున్న ప్రియమణి.. సోషల్ మీడియాలో తాను ఎదుర్కొన్న ట్రోలింగ్ గురించి తాజాగా మాట్లాడింది.
బాడీ షేమింగ్ ట్రోల్స్ తనకు కొత్త కాదని.. ఐతే తాను ప్రేమించిన ముస్తఫాను పెళ్లాడినపుడు మాత్రం తీవ్రమైన వ్యతిరేకతే ఎదుర్కొన్నానని ఆమె చెప్పింది. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా తాను ముందుకు సాగిపోయినట్లు వెల్లడించింది. ఆన్ లైన్ ట్రోలింగ్ను నేను పెద్దగా పట్టించుకోను. బాడీ షేమింగ్, నా ఒంటి రంగు విషయంలో ఇప్పటికీ విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నా. ఐతే ఇవన్నీ పక్కన పెడితే ముస్తఫాను ప్రేమించి పెళ్లి చేసుకున్నపుడు సోషల్ మీడియా వేదికగా విపరీతమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నాను.
మా ఎంగేజ్మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టినపుడు.. నువ్వు ఓ ముస్లిం వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు అంటూ అభ్యంతరకరంగా దూషించారు. అలాంటి కామెంట్లు చేసేవాళ్లందరికీ నేను చెప్పేది ఒకటే. ఇది నా జీవితం. ఎవరితో జీవితాన్ని పంచుకోవాలన్నది పూర్తిగా నా ఇష్టం. ట్రోల్స్కు అవసరం లేని అటెన్షన్ ఇచ్చి వాటి వల్ల బాధ పడటం నాకిష్టం ఉండదు. అందుకే నేను ఇలాంటివి పట్టించుకోను అని ప్రియమణి చెప్పింది. ప్రస్తుతం ప్రియమణి షారుఖ్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ రూపొందిస్తున్న జవాన్లో కీలక పాత్రను పోషిస్తోంది. దక్షిణాదిన కూడా కొన్ని చిత్రాల్లో నటిస్తోంది.
This post was last modified on June 27, 2023 9:48 am
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…
ఏప్రిల్ 30 'పెద్ది' తప్పుకున్నాక అందరి దృష్టి ఆ స్లాట్ మీద పడింది. ఇది ముందే ఊహించిన 'గాయపడ్డ సింహం'…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే చాలా బిల్లులు పెండింగులో ఉండగా..…
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…