పేరుకు కన్నడ అమ్మాయే కానీ ప్రియమణి ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే. కన్నడ, తమిళం, హిందీ, మలయాళ చిత్రాల్లోనూ నటించినా.. ఆమె స్టార్ స్టేటస్ అనుభవించింది టాలీవుడ్లోనే. హీరోయిన్గా కెరీర్ ముగిశాక ఇప్పుడు ఆమె క్యారెక్టర్, నెగెటివ్ రోల్స్ వైపు మళ్లింది. ఇటీవలే కస్టడీ సినిమాలో విలన్ పాత్రతో ఆకట్టుకున్న ప్రియమణి.. సోషల్ మీడియాలో తాను ఎదుర్కొన్న ట్రోలింగ్ గురించి తాజాగా మాట్లాడింది.
బాడీ షేమింగ్ ట్రోల్స్ తనకు కొత్త కాదని.. ఐతే తాను ప్రేమించిన ముస్తఫాను పెళ్లాడినపుడు మాత్రం తీవ్రమైన వ్యతిరేకతే ఎదుర్కొన్నానని ఆమె చెప్పింది. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా తాను ముందుకు సాగిపోయినట్లు వెల్లడించింది. ఆన్ లైన్ ట్రోలింగ్ను నేను పెద్దగా పట్టించుకోను. బాడీ షేమింగ్, నా ఒంటి రంగు విషయంలో ఇప్పటికీ విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నా. ఐతే ఇవన్నీ పక్కన పెడితే ముస్తఫాను ప్రేమించి పెళ్లి చేసుకున్నపుడు సోషల్ మీడియా వేదికగా విపరీతమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నాను.
మా ఎంగేజ్మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టినపుడు.. నువ్వు ఓ ముస్లిం వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు అంటూ అభ్యంతరకరంగా దూషించారు. అలాంటి కామెంట్లు చేసేవాళ్లందరికీ నేను చెప్పేది ఒకటే. ఇది నా జీవితం. ఎవరితో జీవితాన్ని పంచుకోవాలన్నది పూర్తిగా నా ఇష్టం. ట్రోల్స్కు అవసరం లేని అటెన్షన్ ఇచ్చి వాటి వల్ల బాధ పడటం నాకిష్టం ఉండదు. అందుకే నేను ఇలాంటివి పట్టించుకోను అని ప్రియమణి చెప్పింది. ప్రస్తుతం ప్రియమణి షారుఖ్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ రూపొందిస్తున్న జవాన్లో కీలక పాత్రను పోషిస్తోంది. దక్షిణాదిన కూడా కొన్ని చిత్రాల్లో నటిస్తోంది.
This post was last modified on June 27, 2023 9:48 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…