పేరుకు కన్నడ అమ్మాయే కానీ ప్రియమణి ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే. కన్నడ, తమిళం, హిందీ, మలయాళ చిత్రాల్లోనూ నటించినా.. ఆమె స్టార్ స్టేటస్ అనుభవించింది టాలీవుడ్లోనే. హీరోయిన్గా కెరీర్ ముగిశాక ఇప్పుడు ఆమె క్యారెక్టర్, నెగెటివ్ రోల్స్ వైపు మళ్లింది. ఇటీవలే కస్టడీ సినిమాలో విలన్ పాత్రతో ఆకట్టుకున్న ప్రియమణి.. సోషల్ మీడియాలో తాను ఎదుర్కొన్న ట్రోలింగ్ గురించి తాజాగా మాట్లాడింది.
బాడీ షేమింగ్ ట్రోల్స్ తనకు కొత్త కాదని.. ఐతే తాను ప్రేమించిన ముస్తఫాను పెళ్లాడినపుడు మాత్రం తీవ్రమైన వ్యతిరేకతే ఎదుర్కొన్నానని ఆమె చెప్పింది. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా తాను ముందుకు సాగిపోయినట్లు వెల్లడించింది. ఆన్ లైన్ ట్రోలింగ్ను నేను పెద్దగా పట్టించుకోను. బాడీ షేమింగ్, నా ఒంటి రంగు విషయంలో ఇప్పటికీ విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నా. ఐతే ఇవన్నీ పక్కన పెడితే ముస్తఫాను ప్రేమించి పెళ్లి చేసుకున్నపుడు సోషల్ మీడియా వేదికగా విపరీతమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నాను.
మా ఎంగేజ్మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టినపుడు.. నువ్వు ఓ ముస్లిం వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు అంటూ అభ్యంతరకరంగా దూషించారు. అలాంటి కామెంట్లు చేసేవాళ్లందరికీ నేను చెప్పేది ఒకటే. ఇది నా జీవితం. ఎవరితో జీవితాన్ని పంచుకోవాలన్నది పూర్తిగా నా ఇష్టం. ట్రోల్స్కు అవసరం లేని అటెన్షన్ ఇచ్చి వాటి వల్ల బాధ పడటం నాకిష్టం ఉండదు. అందుకే నేను ఇలాంటివి పట్టించుకోను అని ప్రియమణి చెప్పింది. ప్రస్తుతం ప్రియమణి షారుఖ్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ రూపొందిస్తున్న జవాన్లో కీలక పాత్రను పోషిస్తోంది. దక్షిణాదిన కూడా కొన్ని చిత్రాల్లో నటిస్తోంది.
This post was last modified on June 27, 2023 9:48 am
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…