ఇండియన్ సినిమాలో మల్టీవర్స్ అనే మాటను బాగా పాపులర్ చేసింది లోకేష్ కనకరాజే. మానగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్.. ఇప్పటిదాకా ఈ తమిళ దర్శకుడు తీసిన సినిమాల్లో ప్రతిదానికీ ఇంకో సినిమాతో లింక్ కనిపిస్తుంది. ఈ సినిమాలన్నింట్లోనూ డ్రగ్ మాఫియా చుట్టూనే కథలు తిరుగుతాయి. ఒక సినిమాలోని పాత్రలు ఇంకో సినిమాలో పరోక్షంగా తమ ప్రాధాన్యాన్ని చాటుకుంటూ ఉంటాయి.
ముఖ్యంగా ‘విక్రమ్’ సినిమాతో ‘లోకేష్ సినిమాటిక్ యూనివర్శ్’ (ఎల్సీయూ) అనే మాట బాగా పాపులర్ అయింది. ఈ మల్టీవర్స్ ట్రెండ్ను వేరే దర్శకులు కూడా అందిపుచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. బాలీవుడ్ మూవీ ‘పఠాన్’లో సైతం ఈ మల్టీవర్స్ కాన్సెప్ట్ చూడొచ్చు. యశ్ రాజ్ ఫిలిమ్స్ వాళ్లు కూడా ఇలాగే స్పై యూనివర్శ్ అని పెట్టి పాత్రలు.. కథలను మిక్స్ చేస్తున్నారు. లోకేష్ విషయానికి వస్తే ‘లియో’లో సైతం తన ఎల్సీయూను అతను కంటిన్యూ చేస్తున్నట్లే కనిపిస్తోంది.
ఈ సినిమా సైతం డ్రగ్ మాఫియా చుట్టూనే తిరగబోతోందని ‘నా రెడీ’ పేరుతో రిలీజ్ చేసిన పాట చూస్తే అర్థమవుతుంది. ఒక పెద్ద డ్రగ్ మాఫియాకు చెందిన డెన్లో ఈ పాట సాగేట్లు చూపించారు. ‘విక్రమ్’ సినిమాలో ఒక సీన్లో కనిపించే ‘దాస్ అండ్ కో’ లోగోను ఈ పాటలో ఒక చోట చూపించారు. అంతే కాక లోకేష్ ప్రతి సినిమాలోనూ చూపించే బిరియాని సీన్ ఈ పాటలోనూ కనిపించింది.
లోకేష్ మార్కు రౌడీలు.. వాళ్ల గెటప్లు.. అతడి సినిమాల్లో ఎప్పుడూ కనిపించే కలర్ ఫ్రేమ్స్.. ఇవన్నీ ఈ పాటలో ఉన్నాయి. ఈ పాట చూసి లోకేష్ సినిమాటిక్ యూనివర్శ్ పట్ల అమితాసక్తితో ఉన్న ఆడియన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. ఈ సినిమాతో ఎల్సీయూను ఇంకో స్థాయికి తీసుకెళ్తాడని.. ఇండియన్ సినిమాల్లో దీన్నొక బ్రాండుగా మారుస్తాడని అంచనా వేస్తున్నారు. లియో దసరా కానుకగా అక్టోబర్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…