Movie News

బ్లాక్ బస్టర్ సినిమాని కొనేవాళ్ళు లేరు

ఎంత ప్రాపగాండా సినిమాగా విమర్శలు వచ్చినా భారీ వసూళ్లతో సంచలన విజయం సాధించిన ది కేరళ స్టోరీ ఇప్పటిదాకా ఓటిటి రిలీజ్ జరుపుకోలేదు. మొన్న 23న జీ ఫైవ్ స్ట్రీమింగని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది కానీ అదంతా ఉత్తుత్తి న్యూసే. తాజా అప్ డేట్ ప్రకారం అసలు డిజిటల్ రైట్స్ ఇంకా అమ్మనేలేదట. నిర్మాతలు 75 కోట్ల దాకా ఆశిస్తుండటంతో ఓటిటిలు భయపడి వెనుకడుగు వేశాయని ముంబై టాక్. నిజానికి అంత మొత్తాన్ని స్టార్ హీరోలకే డిమాండ్ చేయరు. కేరళ స్టోరీ ఎంత సక్సెస్ అయినా బుల్లితెరపై ఆడటం గురించి అనుమానాలున్నాయి .

ఇలా జరగడానికి కారణం ఉంది. గతంలో ది కాశ్మీర్ ఫైల్స్ బ్లాక్ బస్టర్ అయ్యాక ఓటిటిలోనూ జనం ఎగబడి చూస్తారని నిర్మాతలు భావించారు. కానీ అలా జరగలేదు. వ్యూస్ అయితే కోట్లలో వచ్చాయి కానీ సదరు కంపెనీ చాలా ఆశించింది. పైగా స్మార్ట్ ఫోన్, టీవీల్లో చూశాక అసలైన నెగటివిటీ బయటికి వచ్చింది. రికార్డుల సంగతేమో కానీ ఆశించిన ఆదాయం రాలేదని వాపోయింది. ఇప్పుడు ది కేరళ స్టోరీకి అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశాన్ని కొట్టిపారేయలేం. పైగా రిలీజైన టైంలో వారం పది రోజుల హడావిడి తప్ప తరువాత అది కూడా పూర్తిగా సైలెంట్ అయ్యింది.

ఈ టాపిక్ దెబ్బకు ది కేరళ స్టోరీ ట్విట్టర్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. థియేటర్లలో మిస్ అయిన ఆడియన్స్ దీన్ని బుల్లితెరపై చూసేందుకు ఎదురు చూస్తున్నారు. కానీ బాగా ఆలస్యం తప్పేలా లేదు. ఓటిటికే ఇలా ఉంటే ఇక శాటిలైట్ గురించి చెప్పనక్కర్లేదు. అన్నట్టు ఈ టీమ్ మరోసారి చేతులు కలిపి బస్తర్ అనే కొత్త మూవీ అనౌన్స్ చేసింది.  దేశాన్ని సునామిలా ముంచుకొచ్చే ఓ నగ్న సత్యాన్ని తీసుకొస్తున్నామని ప్రకటించారు. సుదిప్తో సేన్ దర్శకత్వంలో విపుల్ అమృత్ లాల్ షా నిర్మించబోతున్నారు. కమ్యూనిస్ట్ ప్లస్ నక్సలైట్ బ్యాక్ డ్రాప్ ఏదో ఎంచుకున్నారు 

This post was last modified on June 26, 2023 5:42 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

ప‌ల్నాడులో ఆ 4 నియోజ‌క‌వ‌ర్గాలు హాట్ హాట్‌!

కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారుల వ‌ర‌కు కూడా.. అనేక జాగ్ర‌త్త‌లు తీసుకున్నా రు. అధికారుల‌ను మార్చేశారు.…

7 mins ago

కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓట‌ర్ల బారులు…. సంకేతం ఏంటి?

రాష్ట్రంలో కీల‌క నాయ‌కులు పోటీ చేస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో అనూహ్య‌మైన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఉద‌యం 6 గంట‌ల నుంచే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని…

14 mins ago

చంద్ర‌బాబు మాస్ వార్నింగ్‌… ఎవ‌రిని ఉద్దేశించి?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఉండ‌వ‌ల్లిలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన త‌ర్వాత‌.. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..…

18 mins ago

సినీ తారల సందడితో పోలింగ్ కళకళ

స్టార్లు సెలబ్రిటీలు తెరమీద, బయట కనిపించినప్పుడు వేరే సంగతి కానీ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కుని వినియోగించుకోవడం కోసం పోలింగ్…

39 mins ago

క‌డ‌ప‌లో రికార్డు స్థాయి పోలింగ్‌.. అక్క చెల్లెళ్ల ఎఫెక్టేనా?

ఏపీలో జ‌రుగుతున్న పార్ల‌మెంటు, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒక‌టి రెండు జిల్లాలు మిన‌హా.. మిగిలిన జిల్లాల్లో పోలింగ్ ప్ర‌క్రియ ఆశాజ‌న‌కంగానే సాగుతోంది.…

42 mins ago

ప‌వ‌న్ ఫ‌స్ట్ టైమ్‌.. స‌తీస‌మేతంగా ఓటేశారు..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. అయితే.. గ‌తానికి భిన్నంగా ఆయ‌న ఈ సారి భార్య‌తో…

1 hour ago