Movie News

OG వేగంతో వీరమల్లుకు గాయం

చూస్తుండగానే ఓజి షూటింగ్ యాభై శాతం పూర్తయిపోయింది. ఇవాళ టీమ్ అధికారికరంగా యూనిట్ సభ్యులతో కూడిన ఒక ఫోటోని పోస్ట్ చేసి మరీ ప్రకటించింది. నిన్నా మొన్నా స్టార్ట్ అయినట్టుగా ఉన్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా ఇంత వేగంగా పూర్తి చేయడంలో స్క్రిప్ట్ పట్ల దర్శకుడు సుజిత్ కున్న క్లారిటీతో పాటు హీరో పవన్ కళ్యాణ్ సహకారం కూడా కీలక పాత్ర పోషించింది. ఈ ఏడాది డిసెంబర్ లోనే విడుదల చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఒకవేళ మిస్ అయినా జనవరిలో ఖచ్చితంగా వచ్చేస్తుంది. ప్రాజెక్ట్ కె రాక కన్ఫర్మ్ అయ్యాక నిర్ణయం తీసుకోబోతున్నారు.

ఇదంతా బాగానే ఉంది ఈ ఓజి వేగం వీరమల్లుకి గాయంగా మారింది. చాలా నెలల నుంచి కనీస అప్డేట్స్ రావడం లేదు. దర్శకుడు క్రిష్ బయట కనిపించడం మానేశారు. ఎక్కడైనా వేరే సినిమా వేడుకల్లో కనిపిస్తే అడుగుదామంటే ఆ అవకాశమే దొరికితేగా. నిర్మాత ఏఎం రత్నం అడపాదడపా దర్శనమిస్తున్నా మీడియాతో మాత్రం నో ఛాట్. హైదరాబాద్ లో వేసిన సెట్లు తీసేసి గుంటూరు లేదా విజయవాడ పరిసరాల్లో వాటినే తిరిగి వేయించి పూర్తి చేసేలా క్రిష్  ని పురమాయించారని ఇన్ సైడ్ టాక్. జనసేన వారాహి యాత్ర కోసం ఈ సర్దుబాటు తప్పలేదని వినికిడి.

సరే ఎప్పుడు పూర్తి చేసినా విడుదల విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. ఓజి పూర్తయ్యాక పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ కు డేట్లు ఇస్తారు. మధ్యలో వీరమల్లుకు కొన్ని కాల్ షీట్స్ ఇవ్వొచ్చు. షూట్ పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్ ఎక్కువ డిమాండ్ చేసే ప్రాజెక్టు కావడంతో క్రిష్ మీద విపరీతమైన ఒత్తిడి ఉంది. 2024 దసరా లేదా దీపావళి కన్నా ముందు రిలీజ్ చేసే సూచనలు తగ్గిపోతున్నాయి. ఫిబ్రవరి నుంచి ఎలక్షన్ల హడావిడిలో పవన్ దొరకడం కష్టం కాబట్టి ఏదున్నా ఆ లోగానే గుమ్మడికాయ కొట్టేయాలి. బ్రో విడుదలయ్యాక ఏదైనా గుడ్ న్యూస్ చెబుతారేమో చూడాలి 

This post was last modified on June 26, 2023 2:42 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

పూజా హెగ్డే కోరుకున్న బ్రేక్ దొరికింది

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…

23 mins ago

ఆమంచి .. ఎవరి ‘కొంప’ ముంచేనో ?!

ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…

52 mins ago

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

1 hour ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

1 hour ago

ప్రభాస్ ఊరిస్తోంది దేని గురించంటే

ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…

2 hours ago

దిల్ రాజు చేతిలో 18 కమిట్మెంట్లు

ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…

3 hours ago