ఈ గురువారం విడుదల కాబోతున్న స్పై ప్రమోషన్ల కోసం నిఖిల్ మాములు పరుగులు పెట్టడం లేదు. చాలా తక్కువ టైం ఉండటంతో వీలైనంత మీడియా ఎక్స్ పోజర్ ఉండేలా చూసుకుంటున్నాడు. మొన్న ముంబైలో ట్రైలర్ లాంచ్ పూర్తి చేసి ఇవాళ బెంగళూరు కార్యక్రమంలో పాలు పంచుకోబోతున్నాడు. రేపు చిరంజీవి ముఖ్యఅతిథిగా జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో దాదాపు అన్నీ కవర్ చేసినట్టు అవుతుంది. మరో రోజు చెన్నై వెళ్లే ఆలోచన జరుగుతోంది. కేరళ కవర్ చేసేది లేనిది ఇంకా తెలియాల్సి ఉంది. ఈలోగా టికెట్ రేట్లకు సంబంధించిన నిర్ణయాలు జరిగిపోయాయి.
తెలంగాణ వరకు ప్రభుత్వం అనుమతించిన గరిష్ట ధర మల్టీప్లెక్స్ 295 రూపాయలు, సింగల్ స్క్రీన్ 175 రూపాయలకు లాక్ చేసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం రెగ్యులర్ రేట్లతో వెళ్తున్నారు. ఒకవేళ పెంపు కావాలన్నా ప్రత్యేక అనుమతులు, నిబంధనలు ఉన్నాయి కనక వాటిని మీట్ కావడం జరిగే పని కాదు. అందుకే ఏపీ మల్టీప్లెక్స్ 177, సింగల్ థియేటర్ 145 లేదా 112తో అమ్మకాలు చేస్తారు. నైజామ్ వరకు చూసుకుంటే స్పై చేసింది మాత్రం రిస్కే. కంటెంట్ బాగుండొచ్చు కానీ సగటు మధ్యతరగతి జనాలకు అందుబాటులో ఉంటే ఎక్కువ ఆక్యుపెన్సీలు చూడవచ్చు
గతంలో మేజర్, విక్రమ్ లకు పెంపుకు వెళ్లకుండా నిర్మాతలు రెగ్యులర్ రేట్లతో వెళ్లడం అద్భుత ఫలితాలను ఇచ్చింది. ప్రత్యేకంగా దీని గురించి పబ్లిసిటీలో హైలైట్ చేసుకోవడం జనాన్ని ఆకట్టుకుంది. అదే స్ట్రాటజీని స్పైకి ఫాలో అయ్యుంటే బాగుండేదని సగటు మూవీ లవర్స్ అభిప్రాయం. గ్యారీ దర్శకత్వం వహించిన స్పైకి తెలుగు ఓపెనింగ్స్ కీలకం కానున్నాయి. హిందీలో సత్యప్రేమ్ కి కహాని పోటీ చాలా బలంగా ఉంది. హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ సైతం సవాల్ విసురుతోంది. ఇక్కడ శ్రీవిష్ణు సామజవరగమన తప్ప కాంపిటీషన్ లేదు కనక పాజిటివ్ టాక్ రావడం కీలకం
This post was last modified on June 26, 2023 3:41 pm
జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన విరమించినప్పటికీ అది సృష్టించిన తుఫాన్ కొనసాగుతుంది. సద్దుమణిగిందనుకున్న విషయాన్ని శుక్రవారం…
చెన్నై లవ్ స్టోరీ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో యూనిట్ సభ్యులు కొందరు వాడిన మాట ఒకటుంది. అదే కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్…
ఆ మధ్య జరిగిన లెనిన్ సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున ఒక మాట అన్నారు. ది ఒడిస్సి లాంటి…
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ఈ నెల 14న థియేటర్లలోకి రానుంది.…