లోకనాయకుడు కమల్ హాసన్.. ప్రభాస్ మెగా మూవీ ‘ప్రాజెక్ట్-కే’లో నటించబోతున్నట్లు కొన్ని రోజులుగా పెద్ద ఎత్తునే ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆల్రెడీ అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండ్ ఉండగా.. మళ్లీ కమల్ ఏంటి అన్న సందేహాలు కలిగాయి చాలామందికి. ఇది కేవలం రూమర్ అనే అనుకున్నారు. కానీ ఈ రోజు ఆ వార్తే నిజమని తేలడంతో ప్రభాస్ అభిమానులు సహా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులందరూ ఎగ్జైట్ అవుతున్నారు.
కమల్ రాకతో ఈ సినిమా రేంజే మారబోతోందనడంలో సందేహం లేదు. ఇది ప్రేక్షకులకు పెద్ద సర్ప్రైజ్, అలాగే షాక్ కూడా. మరి ఆయన ఈ ప్రాజెక్టులోకి.. అది కూడా సినిమా షూట్ ముగింపు దశలో ఉండగా ఎలా వచ్చాడన్నది ఆసక్తికరం. కమల్ చేయాల్సిన పాత్ర విషయంలో ఇంతకుముందు ఎవరినీ అనుకోకుండానే షూట్ మొదలుపెట్టారా.. లేక ఆయన కోసం కొత్తగా పాత్ర క్రియేట్ చేశారా అనే చర్చ నడుస్తోంది.
ఐతే ఆ సంగతులు తెలియదు కానీ.. కమల్ ‘ప్రాజెక్ట్-కే’లో భాగం కావడంలో లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ముఖ్య పాత్ర పోషించినట్లు సమాచారం. సింగీతం తీసిన ‘ఆదిత్య 369’ తరహాలోనే ఫాంటసీ, సైంటిఫిక్ టచ్ ఉన్న చిత్రం ‘ప్రాజెక్ట్-కే’. అందుకే ఆయన్ని ఈ సినిమా కోసం మెంటార్గా పెట్టుకున్నారు. స్క్రిప్టు, షూటింగ్ వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తున్నారు. తన సలహాలు ఇస్తున్నారు.
సినిమాలో ఓ ముఖ్య అతిథి పాత్రకు ఎవరిని ఎంచుకుందాం అనే చర్చ వచ్చినపుడు కమల్ పేరును ఆయన సూచించారని.. ఆయనే కమల్ను ఒప్పించారని చిత్ర వర్గాలు అంటున్నాయి. కమల్తో సింగీతం అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరి కలయికలో ‘పుష్పక విమానం’, ‘విచిత్ర సోదరులు’ లాంటి క్లాసిక్స్ వచ్చాయి. కమల్ ఎంతో గౌరవించే, అభిమానించే దర్శకుల్లో సింగీతం ఒకరు. 90 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా ఒక సినిమాకు సేవలు అందిస్తూ.. అందులో భాగం కావాలని అడిగితే కమల్ కాదని ఎలా అనగలరు మరి?
This post was last modified on June 25, 2023 5:06 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…