Movie News

ఆదిపురుష్ మీద సెహ్వాగ్ పంచు

మన దేశంలో సినిమాలకు క్రికెట్ కున్నంత క్రేజ్ దేనికీ లేదు. వేర్వేరు రంగాలే అయినప్పటికీ రెండింటి మీద విపరీతమైన అభిమానం కలిగిన జనం కోట్లలో ఉన్నారు. అందుకే వీటికి ముడిపడిన ఏ అంశమైనా ఆసక్తికరంగా ఉంటుంది. ఇటీవలే విడుదలైన ఆదిపురుష్ మీద ఎంత నెగటివ్ క్యాంపైన్ నడిచిందో కళ్లారా చూశాం. దెబ్బకు హీరోతో సహా ఎవరైనా బయటికి వచ్చి మీడియాతో మాట్లాడితే ఒట్టు. దర్శకుడు రచయిత తప్ప రిలీజ్ తర్వాత కెమెరా ముందు కనిపించిన మొహాలే లేవు. వసూళ్ల పరంగా బాగా నెమ్మదించిన ఆదిపురుష్ కి  ఇవాళ వీకెండ్ కీలకం కానుంది.

ఇదిలా ఉండగా ఈ విజువల్ గ్రాండియర్ ని ప్రముఖ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చూశాడు. మాములుగా ట్విట్టర్ లో పంచులతో అదరగొడుతూ నవ్వించే ఈ ఎటాకింగ్ బ్యాట్స్ మ్యాన్ ఆదిపురుష్ ని కూడా వదల్లేదు. షో అయ్యాక ట్వీట్ చేస్తూ బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో ఇప్పుడు తెలిసిందని కౌంటర్ వేశాడు. ఇది అర్థమైనవాళ్లకు నవ్వాగడం లేదు. అంటే భవిష్యత్తులో ప్రభాస్ ఇలాంటి పొరపాట్లు చేస్తాడని ముందే గుర్తించిన సత్యరాజ్ అతన్ని కాపాడటం కోసమే కత్తితో పొడిచాడని సెహ్వాగ్ నిర్వచనం. పెట్టడం ఆలస్యం ఇతని పంచు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది

విచిత్రంగా ట్రోలింగ్ బ్యాచులతో  సెహ్వాగ్ గొంతు కలపడం ఆశ్చర్యం కలిగించే విషయమే. మొదటి మూడు రోజులు మూడు వందల కోట్లు గ్రాస్ సాధించినా బ్రేక్ ఈవెన్ కి ఇంకా చాలా దూరంలో ఆగిపోయిన ఆదిపురుష్ ఫైనల్ గా ఫ్లాప్ నుంచి తప్పుకోవడం అసాధ్యమే. మొన్న చెప్పుకోదగ్గ రిలీజులేవి లేకపోవడంతో ఓ మాదిరిగా నెట్టుకొస్తున్నప్పటికీ అది భారీ నష్టాలను పూడ్చేందుకు చాలడం లేదు. పైగా కేరళ, తమిళనాడులో డిజాస్టర్ కావడం మరింత దెబ్బ కొట్టింది. నార్త్ ఆడియన్స్ కన్నా మన ప్రేక్షకులే నయం. పది రోజులకు తర్వాత కూడా ఓ పర్వాలేదనిపంచే బుకింగ్స్ ఇక్కడే ఉన్నాయి 

This post was last modified on June 25, 2023 1:14 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

10 mins ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

1 hour ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

1 hour ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

2 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

2 hours ago

కోరుకోని చిక్కులో రష్మిక మందన్న

యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…

3 hours ago