పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల ఫోకస్ అంతా ఇప్పుడు ఆయన వారాహి యాత్ర మీదే ఉంది. సినిమాలకు మించిన కిక్ ఇస్తూ.. ఈ యాత్రలో అభిమానులతో పాటు జనసైనికుల్లో ఉత్సాహం నింపుతున్నాడు పవన్. ఈ కిక్ ఇలా కొనసాగుతుండగానే.. ఆయన కొత్త సినిమా టీజర్ విందు సిద్ధం అవుతోంది. పవన్ కళ్యాణ్ కొన్ని నెలల కిందటే చడీచప్పుడు లేకుండా ‘బ్రో’ సినిమాను మొదలుపెట్టడం.. కొన్ని వారాల పాటు విరామం లేకుండా షూటింగ్లో పాల్గొని తన పార్ట్ అంతా పూర్తి చేయడం తెలిసిన సంగతే. ఈ సినిమా చిత్రీకరణ కూడా ముగింపు దశలో ఉంది. విడుదలకు అటు ఇటుగా ఇంకో నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇక ప్రమోషన్ల హడావుడి పెంచాల్సిన అవసరం పడింది. అందులో భాగంగా ముందుగా టీజర్ లాంచ్ చేయబోతున్నారు.
పవన్ కళ్యాణ్ సినిమా టీజర్ అంటే వారం ముందు నుంచే హడావుడి ఉంటుంది. కానీ ‘బ్రో’ విషయంలో సైలెంటుగా పని జరిగిపోతోంది. నిమిషం నిడివితో ఉండే టీజర్ ఆల్రెడీ దాదాపుగా రెడీ అయిపోయిందట. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చేశాడని సమాచారం. చిన్న చిన్న కరెక్షన్లు చేసి ఈ రోజుకు టీజర్ కట్ ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. ఇంకో రెండు మూడు రోజుల్లోనే టీజర్ లాంచ్ కూడా ఉంటుందని అంటున్నారు.
టీజర్ పవన్ అభిమానులను అలరించేలా ఉంటుందని.. రీమేక్ కావడంతో పెద్దగా అంచనాలు లేకుండా ఉన్న ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేలా మంచి కిక్ ఇస్తుందని అంటున్నారు. తమిళ హిట్ ‘వినోదియ సిత్తం’కు రీమేక్గా తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఒరిజినల్ తీసిన సముద్రఖనినే తెలుగులోనూ డైరెక్ట్ చేశాడు. త్రివిక్రమ్ మార్పులు చేర్పులతో స్క్రిప్టు రెడీ చేశాడు. పీపుల్స్ మీడియా సంస్థ నిర్మించిన ఈ చిత్రం జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on June 24, 2023 11:30 pm
విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో పీజీ వైద్య విద్యార్థిని బత్తుల దీపిక ఆత్మహత్య కేసులో కీలక మలుపు తిరిగింది.…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న జనసేన పార్టీ.. ఈ ఏడాది పార్టీ సభ్యత్వాన్ని గత నెలలోనే ప్రారంభించిన…
సోషల్ మీడియాలో ఎప్పుడేం జరుగుతుందో.. దేనికి మురిసిపోతారో? ఏ విషయానికి ఆగ్రహానికి గురవుతారో అంచనా వేయటం అంత తేలికైన విషయం…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ప్రకటించే నంది అవార్డులకు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డులతో సమానంగా చూసేవారు.…
స్టార్ హీరో సినిమాల్లో ఐటెం సాంగ్స్ అన్నవి చాలా ఏళ్ల నుంచి కామన్గా ఉంటున్నాయి. సుకుమార్ సహా చాలామంది దర్శకులు…
గత దశాబ్ద కాలంలో తెలుగువారు ఎంతో మెచ్చిన పరభాషా కథానాయికల్లో సాయిపల్లవి ముందు వరుసలో ఉంటుంది. ఆమెను నాన్ లోకల్…