పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల ఫోకస్ అంతా ఇప్పుడు ఆయన వారాహి యాత్ర మీదే ఉంది. సినిమాలకు మించిన కిక్ ఇస్తూ.. ఈ యాత్రలో అభిమానులతో పాటు జనసైనికుల్లో ఉత్సాహం నింపుతున్నాడు పవన్. ఈ కిక్ ఇలా కొనసాగుతుండగానే.. ఆయన కొత్త సినిమా టీజర్ విందు సిద్ధం అవుతోంది. పవన్ కళ్యాణ్ కొన్ని నెలల కిందటే చడీచప్పుడు లేకుండా ‘బ్రో’ సినిమాను మొదలుపెట్టడం.. కొన్ని వారాల పాటు విరామం లేకుండా షూటింగ్లో పాల్గొని తన పార్ట్ అంతా పూర్తి చేయడం తెలిసిన సంగతే. ఈ సినిమా చిత్రీకరణ కూడా ముగింపు దశలో ఉంది. విడుదలకు అటు ఇటుగా ఇంకో నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇక ప్రమోషన్ల హడావుడి పెంచాల్సిన అవసరం పడింది. అందులో భాగంగా ముందుగా టీజర్ లాంచ్ చేయబోతున్నారు.
పవన్ కళ్యాణ్ సినిమా టీజర్ అంటే వారం ముందు నుంచే హడావుడి ఉంటుంది. కానీ ‘బ్రో’ విషయంలో సైలెంటుగా పని జరిగిపోతోంది. నిమిషం నిడివితో ఉండే టీజర్ ఆల్రెడీ దాదాపుగా రెడీ అయిపోయిందట. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చేశాడని సమాచారం. చిన్న చిన్న కరెక్షన్లు చేసి ఈ రోజుకు టీజర్ కట్ ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. ఇంకో రెండు మూడు రోజుల్లోనే టీజర్ లాంచ్ కూడా ఉంటుందని అంటున్నారు.
టీజర్ పవన్ అభిమానులను అలరించేలా ఉంటుందని.. రీమేక్ కావడంతో పెద్దగా అంచనాలు లేకుండా ఉన్న ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేలా మంచి కిక్ ఇస్తుందని అంటున్నారు. తమిళ హిట్ ‘వినోదియ సిత్తం’కు రీమేక్గా తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఒరిజినల్ తీసిన సముద్రఖనినే తెలుగులోనూ డైరెక్ట్ చేశాడు. త్రివిక్రమ్ మార్పులు చేర్పులతో స్క్రిప్టు రెడీ చేశాడు. పీపుల్స్ మీడియా సంస్థ నిర్మించిన ఈ చిత్రం జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on June 24, 2023 11:30 pm
మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ 'మట్కా'ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది.…
నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…
సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…