పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల ఫోకస్ అంతా ఇప్పుడు ఆయన వారాహి యాత్ర మీదే ఉంది. సినిమాలకు మించిన కిక్ ఇస్తూ.. ఈ యాత్రలో అభిమానులతో పాటు జనసైనికుల్లో ఉత్సాహం నింపుతున్నాడు పవన్. ఈ కిక్ ఇలా కొనసాగుతుండగానే.. ఆయన కొత్త సినిమా టీజర్ విందు సిద్ధం అవుతోంది. పవన్ కళ్యాణ్ కొన్ని నెలల కిందటే చడీచప్పుడు లేకుండా ‘బ్రో’ సినిమాను మొదలుపెట్టడం.. కొన్ని వారాల పాటు విరామం లేకుండా షూటింగ్లో పాల్గొని తన పార్ట్ అంతా పూర్తి చేయడం తెలిసిన సంగతే. ఈ సినిమా చిత్రీకరణ కూడా ముగింపు దశలో ఉంది. విడుదలకు అటు ఇటుగా ఇంకో నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇక ప్రమోషన్ల హడావుడి పెంచాల్సిన అవసరం పడింది. అందులో భాగంగా ముందుగా టీజర్ లాంచ్ చేయబోతున్నారు.
పవన్ కళ్యాణ్ సినిమా టీజర్ అంటే వారం ముందు నుంచే హడావుడి ఉంటుంది. కానీ ‘బ్రో’ విషయంలో సైలెంటుగా పని జరిగిపోతోంది. నిమిషం నిడివితో ఉండే టీజర్ ఆల్రెడీ దాదాపుగా రెడీ అయిపోయిందట. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చేశాడని సమాచారం. చిన్న చిన్న కరెక్షన్లు చేసి ఈ రోజుకు టీజర్ కట్ ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. ఇంకో రెండు మూడు రోజుల్లోనే టీజర్ లాంచ్ కూడా ఉంటుందని అంటున్నారు.
టీజర్ పవన్ అభిమానులను అలరించేలా ఉంటుందని.. రీమేక్ కావడంతో పెద్దగా అంచనాలు లేకుండా ఉన్న ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేలా మంచి కిక్ ఇస్తుందని అంటున్నారు. తమిళ హిట్ ‘వినోదియ సిత్తం’కు రీమేక్గా తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఒరిజినల్ తీసిన సముద్రఖనినే తెలుగులోనూ డైరెక్ట్ చేశాడు. త్రివిక్రమ్ మార్పులు చేర్పులతో స్క్రిప్టు రెడీ చేశాడు. పీపుల్స్ మీడియా సంస్థ నిర్మించిన ఈ చిత్రం జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on June 24, 2023 11:30 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…