నిన్న విడుదలైన సినిమాల్లో దేనికీ ప్రీ రిలీజ్ బజ్ లేకపోవడంతో థియేటర్ బుకింగ్స్ అంతంత మాత్రంగానే కనిపించాయి. మొదటిరోజే చూడాలన్నఉత్సాహం ఆడియన్స్ వీటి మీద చూపించలేదు. ఉన్నంతలో ట్రైలర్ కట్ వల్ల మను చరిత్ర మీద యూత్ కొంత ఆసక్తి కనబరిచారు. కొన్నేళ్ల క్రితం కాజల్ అగర్వాల్ సమర్పణలో మొదలైన ఈ చిత్రం తర్వాత చేతులు మారింది. షూటింగ్ ఎప్పుడో పూర్తయినా మోక్షం మాత్రం ఇప్పటికి దక్కింది. పుష్ప విలన్ ధనుంజయ్, సుహాస్, మేఘ ఆకాష్ లాంటి ఆకట్టుకునే క్యాస్టింగ్ ఉన్నప్పటికీ బజ్ కోసం పోరాడింది. ఇంతకీ చరిత్రలో ఏముంది.
మను(శివ కందుకూరి)అనే కుర్రాడు ఓ రౌడీ(ధనుంజయ్)దగ్గర పని చేస్తుంటాడు. ఇతనికో భగ్నమైన ప్రేమకథ ఉంటుంది. దాంతో అమ్మాయిలను ప్రేమించడం తర్వాత బ్రేకప్ చెప్పడం అలవాటుగా చేసుకుంటాడు. మరోవైపు సిటీ మేయర్ కనిపించకుండా పోవడం కలకలం రేపుతుంది. సంబంధమే లేని ఈ రెండు కథలకు ఉన్న కనెక్షన్ ఏంటి, చివరికి మను జీవితంలో ఏ లక్ష్యానికి చేరుకున్నాడనేదే కథ. శివ కందుకూరి తన వరకు పెర్ఫార్మన్స్ పరంగా బాగానే చేసినప్పటికీ రఫ్ షేడ్స్ ని పూర్తిగా మోయలేకపోయాడు. అంత బరువైన ఎమోషన్స్ లో చూడటం కష్టమైపోయింది.
దర్శకుడు భరత్ పెదగాని అర్జున్ రెడ్డి నుంచి ఎక్కువ స్ఫూర్తి చెందాడు. కేవలం లవ్ స్టోరీ చెబితే దానికి జిరాక్స్ అనుకుంటారని భావించి పొలిటికల్ కలర్ అద్దే ప్రయత్నం చేశాడు. అయితే బలహీనమైన స్క్రీన్ ప్లే, రిపీట్ గా అనిపించే ఉపకథలు, విపరీతమైన సెకండ్ హాఫ్ ల్యాగ్ మనుచరిత్రని భరించలేని ప్రహసనంగా మారాయి. విజయ్ దేవరకొండ రేంజ్ లో ఇంత బిల్డప్ ఇచ్చే క్యారెక్టర్ ని డిజైన్ చేసుకోవడం సింక్ అవ్వలేదు. తారాగణం పరంగా ఎలాంటి కంప్లయింట్ లేనప్పటికీ ఆసక్తికరంగా చదవాల్సిన చరిత్ర పుస్తకాన్ని చివరి పేజీకి వచ్చేటప్పటికి విసిగించే స్థాయిలో నరేషన్ ఉండటంతో మను ఫైనల్ గా గెలవలేకపోయాడు
This post was last modified on June 24, 2023 2:21 pm
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…