మాములుగా ఒక హీరోయిన్ కి డెబ్యూతోనే డిజాస్టర్ పడితే అవకాశాలు అంత సులభంగా రావు. అందులోనూ టాలీవుడ్ లో సెంటిమెంట్లు ఎక్కువ. ఒక హిట్టు పడ్డాక చూద్దాంలే అని ఎదురు చూస్తారు. కానీ సాక్షి వైద్యకు సీన్ రివర్స్ లో ఉంది. అఖిల్ ఏజెంట్ తో తెరకు పరిచయమైన ఈ బ్యూటీకి ఎంట్రీనే చేదు అనుభవం ఇచ్చింది. ఈ ఏడాది అది పెద్ద ఫ్లాప్ గా ఏజెంట్ గురించి ఎన్ని ట్రోల్స్ వచ్చాయో లెక్క చెప్పడం కష్టం. దెబ్బకు ఓటిటి వెర్షన్ కోసం మళ్ళీ ఎడిటింగ్ చేయాల్సి వచ్చిందంటేనే ఆడియన్స్ దాన్ని ఎంతగా తిరస్కరించారో అర్థం చేసుకోవచ్చు.
ట్విస్ట్ ఏంటంటే సాక్షి వైద్యకు ఎలాంటి ఇబ్బంది కలగడం లేదు. మెగా ప్రిన్స్ గాండీవధారి అర్జునలో ఆల్రెడీ చేస్తోంది. త్వరలోనే షూటింగ్ పూర్తి కాబోతోంది. సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందబోయే గాంజా శంకర్(ప్రచారంలో ఉన్న టైటిల్)కి తన పేరే బలంగా పరిశీలిస్తున్నారట. ఓకే కాగానే అఫీషియల్ గా ప్రకటిస్తారు. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీలీల కాకుండా సెకండ్ హీరోయిన్ గా సాక్షినే అడిగినట్టు ఆల్రెడీ ప్రచారం జరుగుతోంది. కానీ రెండో కథానాయిక కాబట్టి ఇంకా ఎస్ చెప్పలేదట. పవర్ స్టార్ కాబట్టి కాదనే ఛాన్స్ కూడా ఉండకపోవచ్చు
ఇవి కాకుండా మరికొన్ని ప్రతిపాదన స్టేజిలో ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం తెలుగు హీరోలు దర్శకులను హీరోయిన్ కొరత విపరీతంగా వేధిస్తోంది . పూజా హెగ్డే ట్రాక్ రికార్డు, మార్కెట్ రెండూ పడిపోయాయి. రష్మిక మందన్న ఎక్కువ బాలీవుడ్ మీద ఫోకస్ పెడుతోంది. శ్రీలీల డేట్లు కావాలంటే ఆరేడు నెలలు వెయిట్ చేయాల్సి వచ్చేలా ఉంది. ఈ నేపథ్యంలో సాక్షి వైద్య లాంటి వాళ్లకు ఇదంతా వరంగా మారుతోంది. మనమే హిట్టిస్తే పోలా అనే ధోరణిలో డైరెక్టర్లు తనను ఎంచుకుంటున్నారు కాబోలు. వీటిలో ఏది సక్సెస్ అయినా పెద్ద బ్రేక్ దక్కినట్టే.
This post was last modified on June 22, 2023 1:42 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…