మాములుగా ఒక హీరోయిన్ కి డెబ్యూతోనే డిజాస్టర్ పడితే అవకాశాలు అంత సులభంగా రావు. అందులోనూ టాలీవుడ్ లో సెంటిమెంట్లు ఎక్కువ. ఒక హిట్టు పడ్డాక చూద్దాంలే అని ఎదురు చూస్తారు. కానీ సాక్షి వైద్యకు సీన్ రివర్స్ లో ఉంది. అఖిల్ ఏజెంట్ తో తెరకు పరిచయమైన ఈ బ్యూటీకి ఎంట్రీనే చేదు అనుభవం ఇచ్చింది. ఈ ఏడాది అది పెద్ద ఫ్లాప్ గా ఏజెంట్ గురించి ఎన్ని ట్రోల్స్ వచ్చాయో లెక్క చెప్పడం కష్టం. దెబ్బకు ఓటిటి వెర్షన్ కోసం మళ్ళీ ఎడిటింగ్ చేయాల్సి వచ్చిందంటేనే ఆడియన్స్ దాన్ని ఎంతగా తిరస్కరించారో అర్థం చేసుకోవచ్చు.
ట్విస్ట్ ఏంటంటే సాక్షి వైద్యకు ఎలాంటి ఇబ్బంది కలగడం లేదు. మెగా ప్రిన్స్ గాండీవధారి అర్జునలో ఆల్రెడీ చేస్తోంది. త్వరలోనే షూటింగ్ పూర్తి కాబోతోంది. సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందబోయే గాంజా శంకర్(ప్రచారంలో ఉన్న టైటిల్)కి తన పేరే బలంగా పరిశీలిస్తున్నారట. ఓకే కాగానే అఫీషియల్ గా ప్రకటిస్తారు. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీలీల కాకుండా సెకండ్ హీరోయిన్ గా సాక్షినే అడిగినట్టు ఆల్రెడీ ప్రచారం జరుగుతోంది. కానీ రెండో కథానాయిక కాబట్టి ఇంకా ఎస్ చెప్పలేదట. పవర్ స్టార్ కాబట్టి కాదనే ఛాన్స్ కూడా ఉండకపోవచ్చు
ఇవి కాకుండా మరికొన్ని ప్రతిపాదన స్టేజిలో ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం తెలుగు హీరోలు దర్శకులను హీరోయిన్ కొరత విపరీతంగా వేధిస్తోంది . పూజా హెగ్డే ట్రాక్ రికార్డు, మార్కెట్ రెండూ పడిపోయాయి. రష్మిక మందన్న ఎక్కువ బాలీవుడ్ మీద ఫోకస్ పెడుతోంది. శ్రీలీల డేట్లు కావాలంటే ఆరేడు నెలలు వెయిట్ చేయాల్సి వచ్చేలా ఉంది. ఈ నేపథ్యంలో సాక్షి వైద్య లాంటి వాళ్లకు ఇదంతా వరంగా మారుతోంది. మనమే హిట్టిస్తే పోలా అనే ధోరణిలో డైరెక్టర్లు తనను ఎంచుకుంటున్నారు కాబోలు. వీటిలో ఏది సక్సెస్ అయినా పెద్ద బ్రేక్ దక్కినట్టే.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…