పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. ఈ మధ్య టాలీవుడ్లో బాగా వినిపిస్తున్న నిర్మాణ సంస్థ పేరిది. ఒకప్పుడు చిన్న, మీడియం రేంజ్ సినిమాలే ప్రొడ్యూస్ చేస్తూ వచ్చిన ఈ సంస్థ.. ఈ మధ్య దూకుడు పెంచింది. ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి టాప్ స్టార్లతో ఆ సంస్థ సినిమాలు నిర్మిస్తోంది. ఇవి కాక బోలెడన్ని సినిమాలు ఆ సంస్థలో ప్లానింగ్లో ఉన్నాయి. ఈ సంస్థ గత ఏడాది బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలనే అందుకుంది.
పాన్ ఇండియా స్థాయిలో సూపర్ సక్సెస్ అయి, వంద కోట్ల క్లబ్బులో కూడా అడుగు పెట్టిన ‘కార్తికేయ-2’లో పీపుల్స్ మీడియా వాళ్లు భాగస్వాములు. ఆ సినిమా స్థాయికి అది సాధించిన వసూళ్లు అనూహ్యం. ఇక ఏడాది చివర్లో ‘ధమాకా’తో మరో బ్లాక్ బస్టర్ కొట్టింది పీపుల్స్ మీడియా. ఇది పూర్తిగా వారి సినిమానే. ఇది కూడా వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇలా వరుసగా రెండు భారీ విజయాలతో పెద్ద ఎత్తున లాభాలు మూటగట్టుకుందా సంస్థ. ఈ విజయాల ఊపులోనే భారీ చిత్రాలను ప్లాన్ చేసింది.
కానీ 2023లో పీపుల్స్ మీడియా వాళ్లకు అస్సలు కలిసి రావడం లేదు. ఆ సంస్థ మంచి బడ్జెట్లో నిర్మించిన ‘రామబాణం’ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. ఈ సినిమా మీద పెట్టిన పెట్టుబడి మొత్తం వృథా అయింది. కొంచెం గ్యాప్లో ఇప్పుడు పీపుల్స్ మీడియా పెద్ద రిస్క్ చేసింది. ‘ఆదిపురుష్’కు రిలీజ్ ముంగిట వచ్చిన హైప్ చూసి.. యువి క్రియేషన్స్ వాళ్ల దగ్గర మారు బేరానికి సినిమాను కొనుగోలు చేసింది. ఏకంగా రూ.170 కోట్లకు పైగా ఇందుకోసం పెట్టుబడి పెట్టినట్లు వార్తలు వచ్చాయి.
తొలి రోజు ఓపెనింగ్స్ చూస్తే ఆశాజనకంగానే కనిపించింది కానీ.. ఆ తర్వాత ‘ఆదిపురుష్’ నిలబడలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆదివారం తర్వాత సినిమా వసూళ్లు బాగా డ్రాప్ అయిపోయాయి. వీకెండ్ తర్వాత షేర్ నామమాత్రంగా వస్తోంది. ఓవరాల్ షేర్ వంద కోట్లను దాటే అవకాశాలే కనిపించడం లేదు. దీన్ని బట్టి పీపుల్స్ మీడియా వాళ్లు ఎంత పెద్ద నష్టం చూడబోతున్నారో అంచనా వేయొచ్చు. కొన్ని ఏరియాల వరకు వేరే బయ్యర్లకు అమ్ముకుని కొంత నష్టాలు భర్తీ చేసుకుని ఉండొచ్చు కానీ.. ఓవరాల్గా మాత్రం పెద్ద నష్టమే తప్పేలా లేదు.
This post was last modified on June 22, 2023 7:53 am
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…
ఏప్రిల్ 30 'పెద్ది' తప్పుకున్నాక అందరి దృష్టి ఆ స్లాట్ మీద పడింది. ఇది ముందే ఊహించిన 'గాయపడ్డ సింహం'…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే చాలా బిల్లులు పెండింగులో ఉండగా..…
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…