పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. ఈ మధ్య టాలీవుడ్లో బాగా వినిపిస్తున్న నిర్మాణ సంస్థ పేరిది. ఒకప్పుడు చిన్న, మీడియం రేంజ్ సినిమాలే ప్రొడ్యూస్ చేస్తూ వచ్చిన ఈ సంస్థ.. ఈ మధ్య దూకుడు పెంచింది. ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి టాప్ స్టార్లతో ఆ సంస్థ సినిమాలు నిర్మిస్తోంది. ఇవి కాక బోలెడన్ని సినిమాలు ఆ సంస్థలో ప్లానింగ్లో ఉన్నాయి. ఈ సంస్థ గత ఏడాది బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలనే అందుకుంది.
పాన్ ఇండియా స్థాయిలో సూపర్ సక్సెస్ అయి, వంద కోట్ల క్లబ్బులో కూడా అడుగు పెట్టిన ‘కార్తికేయ-2’లో పీపుల్స్ మీడియా వాళ్లు భాగస్వాములు. ఆ సినిమా స్థాయికి అది సాధించిన వసూళ్లు అనూహ్యం. ఇక ఏడాది చివర్లో ‘ధమాకా’తో మరో బ్లాక్ బస్టర్ కొట్టింది పీపుల్స్ మీడియా. ఇది పూర్తిగా వారి సినిమానే. ఇది కూడా వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇలా వరుసగా రెండు భారీ విజయాలతో పెద్ద ఎత్తున లాభాలు మూటగట్టుకుందా సంస్థ. ఈ విజయాల ఊపులోనే భారీ చిత్రాలను ప్లాన్ చేసింది.
కానీ 2023లో పీపుల్స్ మీడియా వాళ్లకు అస్సలు కలిసి రావడం లేదు. ఆ సంస్థ మంచి బడ్జెట్లో నిర్మించిన ‘రామబాణం’ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. ఈ సినిమా మీద పెట్టిన పెట్టుబడి మొత్తం వృథా అయింది. కొంచెం గ్యాప్లో ఇప్పుడు పీపుల్స్ మీడియా పెద్ద రిస్క్ చేసింది. ‘ఆదిపురుష్’కు రిలీజ్ ముంగిట వచ్చిన హైప్ చూసి.. యువి క్రియేషన్స్ వాళ్ల దగ్గర మారు బేరానికి సినిమాను కొనుగోలు చేసింది. ఏకంగా రూ.170 కోట్లకు పైగా ఇందుకోసం పెట్టుబడి పెట్టినట్లు వార్తలు వచ్చాయి.
తొలి రోజు ఓపెనింగ్స్ చూస్తే ఆశాజనకంగానే కనిపించింది కానీ.. ఆ తర్వాత ‘ఆదిపురుష్’ నిలబడలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆదివారం తర్వాత సినిమా వసూళ్లు బాగా డ్రాప్ అయిపోయాయి. వీకెండ్ తర్వాత షేర్ నామమాత్రంగా వస్తోంది. ఓవరాల్ షేర్ వంద కోట్లను దాటే అవకాశాలే కనిపించడం లేదు. దీన్ని బట్టి పీపుల్స్ మీడియా వాళ్లు ఎంత పెద్ద నష్టం చూడబోతున్నారో అంచనా వేయొచ్చు. కొన్ని ఏరియాల వరకు వేరే బయ్యర్లకు అమ్ముకుని కొంత నష్టాలు భర్తీ చేసుకుని ఉండొచ్చు కానీ.. ఓవరాల్గా మాత్రం పెద్ద నష్టమే తప్పేలా లేదు.
This post was last modified on June 22, 2023 7:53 am
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం తాడిపత్రిలో ఎన్నికల అనంతరం తీవ్ర హింస చెలరేగింది. ఇక్కడ పోటీలో ఉన్న జేసీ…