పుష్ప తర్వాత మళ్ళీ ఆ స్థాయి సక్సెస్ చూడలేకపోయిన రష్మీక మందన్నకు అవకాశాలు మాత్రం బానే వస్తున్నాయి. సీతారామం ఎంత పెద్ద హిట్ అయినా క్రెడిట్ మొత్తం మృణాల్ ఠాకూర్ తీసేసుకుంది. ఆడాళ్ళు మీకు జోహార్లు ఆడలేదు. వారసుడు విజయ్ ఇమేజ్ మీద ఆడేసింది. అందుకే బాలీవుడ్ ని టార్గెట్ గా పెట్టుకున్న కన్నడ భామ దానికి తగ్గట్టే వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకునేందుకు సిద్ధపడటం లేదు. అమితాబ్ బచ్చన్ తో చేసిన డెబ్యూ మూవీ గుడ్ బై ఫ్లాప్ అయినా, సిద్దార్థ్ మల్హోత్ర సరసన మిషన్ మజ్నులో నటించినా ఆశించిన ఫలితాలు దక్కలేదు.
రన్బీర్ కపూర్-సందీప్ రెడ్డి వంగా కాంబోలో రూపొందిన యానిమల్ మీద రష్మిక బోలెడు ఆశలు పెట్టుకుంది. ఇది తనకు పెద్ద బ్రేక్ అవుతుందని, మెయిన్ లీగ్ లో ప్రవేశించేందుకు దారి చూపుతుందని నమ్ముతోంది. ఈలోగా మరో ప్యాన్ ఇండియా మూవీ ఖాతాలో పడేలా ఉంది. విక్కీ కౌశల్ సరసన పీరియాడిక్ డ్రామా చావాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ముంబై అప్డేట్. ఇటీవలే వచ్చిన జర హట్కె జర బచ్కె దర్శకుడు లక్ష్మణ్ ఉతేకర్ దీనికి కెప్టెన్. బడ్జెట్ కూడా భారీగా పెట్టబోతున్నారు. మరాఠి చారిత్రాత్మక నవల ఆధారంగా చావా రూపొందనుంది
ఇక్కడంటే స్టార్ హీరోల సరసన చేసేందుకే సౌత్ హీరోయిన్లు మొగ్గు చూపుతున్నారు కానీ హిందీకి మాత్రం అలాంటి కండీషన్లు ఏమీ పెట్టడం లేదు. విక్కీ కౌశల్ కు ఎంత ఇమేజ్ ఉన్నా మరీ రణ్వీర్ సింగ్ అంత రేంజ్ అయితే కాదు. చావాలో పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే పాత్ర కాబట్టి సరిగ్గా క్లిక్ అయితే షారుఖ్, సల్మాన్ లాంటి వాళ్ళ సరసన ఆఫర్లు ఆశించవచ్చు. ఇటు తెలుగులో పుష్ప 2 కాకుండా రష్మిక ఒప్పుకున్న సినిమా ఏదీ లేదు. రైన్ బో పూర్తి కావొస్తోంది. శ్రీలీల దెబ్బకు అందరూ ఆమెనే అడుగుతుండటంతో రష్మికతో పాటు పూజా హెగ్డే డిమాండ్ తగ్గిన మాటైతే వాస్తవం
This post was last modified on June 20, 2023 6:49 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…