భయపడినట్టే సోమవారం పరీక్షలో ఆదిపురుష్ ఫెయిలయ్యాడని వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి. కొన్ని చోట్ల మినహా దాదాపు 70 నుంచి 80 శాతం దాకా డ్రాప్ కనిపించడం బయ్యర్లను ఆందోళనకు గురి చేస్తోంది. మొదటి మూడు రోజులకు గాను మూడు వందల నలభై కోట్ల గ్రాస్ వచ్చిందని యూనిట్ అధికారికంగా ప్రకటించినప్పటికీ దానికి సంబంధించిన ఖచ్చితత్వం గురించి బాలీవుడ్ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేసిన దాఖలాలున్నాయి. వీటి సంగతి పక్కనపెడితే వీక్ డేస్ లో కనీసం యాభై శాతం ఆక్యుపెన్సీ కొనసాగిస్తేనే స్టార్ హీరోల సినిమాలు బ్లాక్ బస్టర్లవుతాయి.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే నిన్న ఆదిపురుష్ 5 కోట్ల షేర్ అందుకోవడమే కష్టమైపోయింది. అంతకు ముందు ఆదివారం 17 కోట్లకు పైగా వసూలు కాగా ఒక్కసారిగా ఇంత మొత్తానికి తగ్గిపోవడం చిన్న విషయం కాదు. నార్త్ లోనూ దీనికి భిన్నంగా పరిస్థితి లేదు. కొన్ని నగరాల్లో ప్రదర్శనలు ఆపాలని నిరసనలు, ధర్నాలు చేయడం గాయం మీద కారం చల్లినట్టు అవుతోంది. ఇప్పటిదాకా 163 కోట్ల షేర్ వసూలు చేసిన ఆదిపురుష్ బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే ఇంకో 80 కోట్ల రాబట్టాల్సి ఉంటుంది. పది రోజులు స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తేనే ఇది సాధ్యమవుతుంది.
రాబోయే రోజుల్లో చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోయినా ఆదిపురుష్ ఆ అవకాశాన్ని ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి. వీకెండ్ మీద తప్ప మిగిలిన రోజుల్లో పెద్దగా ఆశలు పెట్టుకోవడానికి లేనట్టుగా ఉంది. ఉన్నంతలో నైజామ్ పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. మల్టీప్లెక్సుల్లో రెస్పాన్స్ బాగుంది. కానీ కీలకమైన బిసి సెంటర్లలో జనం అంతగా ఆసక్తి చూపడం లేదని ఫిగర్లు చెబుతున్నాయి. తమిళనాడు, కేరళలో డిజాస్టర్ ఫలితం రాగా తెలుగు, హిందీ వెర్షన్లకు సంబంధించి యావరేజ్ అవుతుందా లేదా నష్టాలు తెచ్చిన ఫ్లాప్ గా మిగులుతుందా ఇంకో పది రోజుల్లో తేలిపోతుంది
జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ రాజకీయాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే.…
బాలీవుడ్ మీద గట్టి దృష్టి పెట్టిన రష్మిక మందన్న అక్కడి నుంచి వచ్చిన అవకాశాలను అంత తేలికగా వదిలిపెట్టడం లేదు.…
పెద్దికి మూడో వారంలో మళ్ళీ పికప్ ఉంటుందని, కొత్త సీన్లు జోడించారు కాబట్టి మరోసారి మంచి నెంబర్లు చూడొచ్చని ఆశించిన…
దశాబ్ద కాలం పైగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న హీరో వడ్డే నవీన్ తనే నిర్మాతగా మారి ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులుతో…
టాలీవుడ్ యువ కథానాయకుడు నితిన్ చివరగా ఎప్పుడు హిట్టు కొట్టాడో తన అభిమానులకు కూడా సరిగా గుర్తుండకపోవచ్చు. ‘భీష్మ’ తర్వాత…
సినిమా ఇండస్ట్రీలో నార్త్ వర్సెస్ సౌత్ గొడవ ఎప్పటినుంచో నడుస్తున్నదే. ముఖ్యంగా బాలీవుడ్ మీడియా, అక్కడి జనాలు సౌత్ సినిమాలపై…