ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో సినిమా ఏ మాత్రం డిస్సపాయింట్ చేసినా వెంటనే ట్రోలింగ్ మొదలెట్టేస్తున్నారు నెటిజన్లు. తాజాగా రిలీజైన ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ పై మాస్ ట్రోలింగ్ జరుగుతుంది. రిలీజ్ రోజు మార్నింగ్ నుండే ట్రోలర్స్ రంగంలోకి దిగారు. వివిధ రకాల ట్రోల్స్ , మీమ్స్ తో సినిమాను టార్గెట్ చేస్తూ నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు. అక్కడితో ఆగకుండా ఇప్పటికీ ఆదిపురుష్ మీద గట్టి ట్రోలింగ్ జరుగుతూనే ఉంది.
నిజానికి టీజర్ నుండే ప్రభాస్ సినిమాకు ట్రోల్ స్టార్ట్ అయింది. టీజర్ లో హనుమాన్ కేరెక్టర్ , రావణసురుడి గెటప్ మీద నెగటివిటీ వచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా పూర్ అంటూ కామెంట్లు పెట్టారు. దీంతో మేకర్స్ మళ్ళీ రీ వర్క్ చేసి వీ ఎఫ్ ఎక్స్ మీద శ్రద్ద పెట్టి ట్రైలర్ తో మెప్పించారు. అయితే ఆదిపురుష్ విషయంలో దర్శకుడు ఓం రౌత్ ను టార్గెట్ చేస్తూ ఇచ్చిన బడ్జెట్ కి ఇదేనా నీ వర్క్ అంటూ నెటిజన్లు వివిధ కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.
దీంతో ఈ సినిమాకి వస్తున్న కలెక్షన్స్ చూసి సంతోషపడాలా ? లేదా ట్రోలింగ్ కి బాధ పడాలా ? అనే డైలమాలో ఉన్నాడు ఓం. నిజానికి భారీ బడ్జెట్ తో తీసే ఫాంటసీ , హిస్టారికల్ మూవీస్ మీద దర్శకులు ప్రత్యేక శ్రద్ద పెట్టాల్సి ఉంది. మొన్నీ మధ్యే గుణ శేఖర్ ను శాకుంతలం విషయంలో నెటిజన్లు గట్టిగా ట్రోల్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో వచ్చిన నెగటివ్ ట్రోల్స్ చూసి రిలీజ్ తర్వాత గుణ శేఖర్ ఎక్కడా కనిపించకుండా సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు ఓంకి కూడా అదే పరిస్థితి. శాకుంతలంతో పోలిస్తే ఆదిపురుష్ మీద భారీ స్థాయిలో ట్రోల్ జరుగుతుంది.
ఓం రౌత్ రామాయణం లాంటి సబ్జెక్ట్ ఎంచుకోవడం , మోడ్రన్ పేరుతో కొన్ని మార్పులు చూసి తెరకెక్కించడం ప్రేక్షకులను నిరాశ పరిచింది. పైగా రావణాసురుడి గెటప్ , హెయిర్ స్టైల్ , పది తలలు తనకి నచ్చినట్టుగా పైన డిజైన్ చేయడం తేడా కొట్టింది. ఏదేమైనా ఈ మధ్య కాలంలో గుణ శేఖర్ తర్వాత ట్రోలర్స్ చేతికి చిక్కి ఇబ్బంది పడుతుంది ఓం రౌతే. మరి ఆదిపురుష్ ఈ రేంజ్ ట్రోలింగ్ ను తట్టుకుంటూ థియేటర్స్ లో భారీ కలెక్షన్స్ తెచ్చుకుంటూ ముందుకు వెళ్తుంది. వచ్చే వీకెండ్ లోపు సినిమా ఐదు వందల కోట్ల మార్క్ దాటేసేలా ఉంది. ఇప్పటికే మూడు వందల కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంత వరకు వసూళ్లు చేస్తుందో చూడాలి.
ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…
ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేపడుతున్న సేవా కార్యక్రమాల వ్యవహారం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన సంగతి…
న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు... అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా…
సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా…
ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…
రాయలసీమను కూటమి ప్రభుత్వం పెట్టుబడుల సీమగా మారుస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తున్నాయి. తాజాగా దాల్మియా సిమెంట్ భారీ…