Movie News

OG అన్నయ్య వదిన వీళ్ళే

టాలీవుడ్ లో ఇప్పుడు నిర్మాణంలో ఉన్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో పవన్ కళ్యాణ్  ఓజి ముందు వరసలో ఉంది. విడుదలకు అతి దగ్గరగా ఉన్న బ్రో కంటే అభిమానులు దీని మీదే విపరీతమైన ఆసక్తితో ఉన్నారు. సుజిత్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మాణంలో రూపొందుతున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాకు పవన్ బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వారాహి యాత్ర కోసం ఏపీలో పర్యటిస్తున్న పవర్ స్టార్ తిరిగి రాగానే మళ్ళీ ఓజి సెట్స్ లో జాయినవ్వబోతున్నాడు. సాహో తర్వాత బాగా గ్యాప్ వచ్చేసిన సుజిత్ దీని మీద రెట్టింపు కసితో పని చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్.

దీనికి సంబంధించిన కీలక లీక్స్ మంచి ఎగ్జైట్ మెంట్ ఇచ్చేలా ఉన్నాయి. అందులో మొదటిది పవన్ కళ్యాణ్ అన్నా వదినలుగా కిక్ శ్యామ్, శ్రేయా రెడ్డిలు నటించడం. గతంలో రేసు గుర్రం అల్లు అర్జున్ సోదరుడిగా శ్యామ్ పాత్ర దాని సక్సెస్ లో చాలా ఉపయోగపడింది. తర్వాత అవకాశాలు ఎన్నో వచ్చాయి కానీ ఏదీ పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఎక్కువ తమిళంకే అంకితమైపోయాడు. ఇప్పుడు ఏకంగా ఓజికి అన్నయ్య అంటే అంతకంటే స్పెషల్ ప్రమోషన్ ఏముంటుంది. శ్రేయా రెడ్డి పేరుకి అన్న భార్యే అయినా క్యారెక్టర్ పరంగా చాలా పవర్ ఫుల్ షేడ్స్ ఉంటాయని వినికిడి.

ఇదొక్కటే కాదు ఇందులో హీరో పాత్ర పేరు గాంధీ అని మరో అప్డేట్. అఫీషియల్ గా ఇవేవి చెప్పకపోయినా సోర్స్ మాత్రం బలంగా ఉంది. రెగ్యులర్ మాఫియా బ్యాక్ డ్రాప్స్ కి భిన్నంగా సుజిత్ ఇందులో చాలా సర్ప్రైజులు ఇవ్వబోతున్నాడట. డిసెంబర్ విడుదలకు నిర్మాత ప్లాన్ చేస్తున్నారు కానీ అదెంత వరకు సాధ్యమవుతుందనేది పవన్ రాజకీయ ప్రణాళిక మీద ఆధారపడి ఉంటుంది. మహా అయితే ఇంకో రెండు నెలలు తప్ప అంతకు మించి కాల్ షీట్స్ ఇచ్చే అవకాశం పవన్ కు ఉండకపోవచ్చు. ఆలోగానే ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహరవీరమల్లు పూర్తి చేసుకోవాలి 

This post was last modified on June 20, 2023 6:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

16 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

18 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

1 hour ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago