టాలీవుడ్ లో ఇప్పుడు నిర్మాణంలో ఉన్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో పవన్ కళ్యాణ్ ఓజి ముందు వరసలో ఉంది. విడుదలకు అతి దగ్గరగా ఉన్న బ్రో కంటే అభిమానులు దీని మీదే విపరీతమైన ఆసక్తితో ఉన్నారు. సుజిత్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మాణంలో రూపొందుతున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాకు పవన్ బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వారాహి యాత్ర కోసం ఏపీలో పర్యటిస్తున్న పవర్ స్టార్ తిరిగి రాగానే మళ్ళీ ఓజి సెట్స్ లో జాయినవ్వబోతున్నాడు. సాహో తర్వాత బాగా గ్యాప్ వచ్చేసిన సుజిత్ దీని మీద రెట్టింపు కసితో పని చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్.
దీనికి సంబంధించిన కీలక లీక్స్ మంచి ఎగ్జైట్ మెంట్ ఇచ్చేలా ఉన్నాయి. అందులో మొదటిది పవన్ కళ్యాణ్ అన్నా వదినలుగా కిక్ శ్యామ్, శ్రేయా రెడ్డిలు నటించడం. గతంలో రేసు గుర్రం అల్లు అర్జున్ సోదరుడిగా శ్యామ్ పాత్ర దాని సక్సెస్ లో చాలా ఉపయోగపడింది. తర్వాత అవకాశాలు ఎన్నో వచ్చాయి కానీ ఏదీ పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఎక్కువ తమిళంకే అంకితమైపోయాడు. ఇప్పుడు ఏకంగా ఓజికి అన్నయ్య అంటే అంతకంటే స్పెషల్ ప్రమోషన్ ఏముంటుంది. శ్రేయా రెడ్డి పేరుకి అన్న భార్యే అయినా క్యారెక్టర్ పరంగా చాలా పవర్ ఫుల్ షేడ్స్ ఉంటాయని వినికిడి.
ఇదొక్కటే కాదు ఇందులో హీరో పాత్ర పేరు గాంధీ అని మరో అప్డేట్. అఫీషియల్ గా ఇవేవి చెప్పకపోయినా సోర్స్ మాత్రం బలంగా ఉంది. రెగ్యులర్ మాఫియా బ్యాక్ డ్రాప్స్ కి భిన్నంగా సుజిత్ ఇందులో చాలా సర్ప్రైజులు ఇవ్వబోతున్నాడట. డిసెంబర్ విడుదలకు నిర్మాత ప్లాన్ చేస్తున్నారు కానీ అదెంత వరకు సాధ్యమవుతుందనేది పవన్ రాజకీయ ప్రణాళిక మీద ఆధారపడి ఉంటుంది. మహా అయితే ఇంకో రెండు నెలలు తప్ప అంతకు మించి కాల్ షీట్స్ ఇచ్చే అవకాశం పవన్ కు ఉండకపోవచ్చు. ఆలోగానే ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహరవీరమల్లు పూర్తి చేసుకోవాలి
This post was last modified on June 20, 2023 6:58 am
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…
ఏప్రిల్ 30 'పెద్ది' తప్పుకున్నాక అందరి దృష్టి ఆ స్లాట్ మీద పడింది. ఇది ముందే ఊహించిన 'గాయపడ్డ సింహం'…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే చాలా బిల్లులు పెండింగులో ఉండగా..…
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…