టాలీవుడ్ లో ఇప్పుడు నిర్మాణంలో ఉన్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో పవన్ కళ్యాణ్ ఓజి ముందు వరసలో ఉంది. విడుదలకు అతి దగ్గరగా ఉన్న బ్రో కంటే అభిమానులు దీని మీదే విపరీతమైన ఆసక్తితో ఉన్నారు. సుజిత్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మాణంలో రూపొందుతున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాకు పవన్ బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వారాహి యాత్ర కోసం ఏపీలో పర్యటిస్తున్న పవర్ స్టార్ తిరిగి రాగానే మళ్ళీ ఓజి సెట్స్ లో జాయినవ్వబోతున్నాడు. సాహో తర్వాత బాగా గ్యాప్ వచ్చేసిన సుజిత్ దీని మీద రెట్టింపు కసితో పని చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్.
దీనికి సంబంధించిన కీలక లీక్స్ మంచి ఎగ్జైట్ మెంట్ ఇచ్చేలా ఉన్నాయి. అందులో మొదటిది పవన్ కళ్యాణ్ అన్నా వదినలుగా కిక్ శ్యామ్, శ్రేయా రెడ్డిలు నటించడం. గతంలో రేసు గుర్రం అల్లు అర్జున్ సోదరుడిగా శ్యామ్ పాత్ర దాని సక్సెస్ లో చాలా ఉపయోగపడింది. తర్వాత అవకాశాలు ఎన్నో వచ్చాయి కానీ ఏదీ పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఎక్కువ తమిళంకే అంకితమైపోయాడు. ఇప్పుడు ఏకంగా ఓజికి అన్నయ్య అంటే అంతకంటే స్పెషల్ ప్రమోషన్ ఏముంటుంది. శ్రేయా రెడ్డి పేరుకి అన్న భార్యే అయినా క్యారెక్టర్ పరంగా చాలా పవర్ ఫుల్ షేడ్స్ ఉంటాయని వినికిడి.
ఇదొక్కటే కాదు ఇందులో హీరో పాత్ర పేరు గాంధీ అని మరో అప్డేట్. అఫీషియల్ గా ఇవేవి చెప్పకపోయినా సోర్స్ మాత్రం బలంగా ఉంది. రెగ్యులర్ మాఫియా బ్యాక్ డ్రాప్స్ కి భిన్నంగా సుజిత్ ఇందులో చాలా సర్ప్రైజులు ఇవ్వబోతున్నాడట. డిసెంబర్ విడుదలకు నిర్మాత ప్లాన్ చేస్తున్నారు కానీ అదెంత వరకు సాధ్యమవుతుందనేది పవన్ రాజకీయ ప్రణాళిక మీద ఆధారపడి ఉంటుంది. మహా అయితే ఇంకో రెండు నెలలు తప్ప అంతకు మించి కాల్ షీట్స్ ఇచ్చే అవకాశం పవన్ కు ఉండకపోవచ్చు. ఆలోగానే ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహరవీరమల్లు పూర్తి చేసుకోవాలి
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…