బాలీవుడ్లో కథలకు బాగా కరువొచ్చేసినట్లుంది. అక్కడ తయారయ్యే సినిమాల్లో సగం దక్షిణాది చిత్రాల రీమేక్లే ఉంటున్నాయి. ఇక్కడి కథల్ని తీసుకుని.. వాటికి బాలీవుడ్ టచ్ ఇచ్చి కొత్తగా తీర్చిదిద్ది అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాలు మంచి ఫలితాలు కూడా అందుకుంటుండటంతో దక్షిణాది సినిమాల రీమేక్లు మరింత పెరుగుతున్నాయి.
ప్రస్తుతం తెలుగు నుంచి ‘జెర్సీ’ రీమేక్ అవుతుండగా.. ‘ఎఫ్-2’, ‘హిట్’ లాంటి సినిమాలు కూడా హిందీలోకి వెళ్తున్నాయి. ఐతే ఈ మధ్య వచ్చినవే కాక.. కొంచెం వెనక్కి వెళ్లి పాత సినిమాల్ని కూడా రీమేక్ చేయడానికి బాలీవుడ్ నిర్మాతలు వెనుకాడట్లేదు. ఈ కోవలోనే 12 ఏళ్ల కిందట వచ్చిన ‘వినాయకుడు’ సినిమాను హిందీలోకి తీసుకెళ్తున్నట్లు సమాచారం.
కమెడియన్ కృష్ణుడు ప్రధాన పాత్రలో అడివి శేష్ అన్నయ్య సాయికిరణ్ అడివి రూపొందించిన ‘వినాయకుడు’ అప్పట్లో మంచి విజయం సాధించింది. ‘బిగ్ ఫ్యాట్ లవ్ స్టోరీ’ క్యాప్షన్తో వచ్చిన ఈ చిత్రంలో భారీకాయుడైన ఓ అబ్బాయి, అందమైన అమ్మాయి మధ్య ప్రేమను చాలా సరదాగా, హృద్యంగా చూపించారు. ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందడంతో పాటు అవార్డులు కూడా గెలిచింది. ఈ చిత్రాన్ని ఇప్పుడు హిందీలో రీమేక్ చేయబోతున్నారట.
ఒరిజినల్ తీసిన సాయికిరణే హిందీ వెర్షన్కు కూడా దర్శకుడు. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ దీన్ని నిర్మించనుంది. రీమేక్ గురించి సాయికిరణే మీడియాకు సమాచారం ఇచ్చాడు. ఇంకా నటీనటుల వివరాలు వెల్లడి కాలేదు. కృష్ణుడు కోసమే పుట్టినట్లు అనిపించే ఈ కథను బాలీవుడ్లో ఏ నటుడు చేస్తాడన్నది ఆసక్తికరం. కథకు తగ్గట్లు అతను భారీకాయుడై ఉండాలి. కాబట్టి ఓ కొత్త నటుడినే ఎంచుకునే అవకాశముంది.
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…