ఆదిపురుష్ సినిమాను ముందు 2023 సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఆ మేరకు ఐదారు నెలల ముందే రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. అందుకు తగ్గట్లే ప్రమోషన్లు కూడా చేశారు. కానీ టీజర్ రిలీజయ్యాక కథ మారిపోయింది. అందులో విజువల్స్, ఎఫెక్ట్స్, ముఖ్య పాత్రల మేకప్ అదీ చూసి జనాలకు చిర్రెత్తుకొచ్చింది. ఇప్పటిదాకా మరే సినిమాకూ లేని స్థాయిలో దాని మీద ట్రోలింగ్ జరిగింది.
దెబ్బకు సినిమాను వాయిదా వేసేశారు. ఐదు నెలలు ఆలస్యంగా జూన్ 16కు విడుదల తేదీని మార్చారు. ఇలా ట్రోలింగ్కు భయపడి రిలీజ్ డేట్ మార్చడం ఇప్పటిదాకా ఎన్నడూ జరిగి ఉండదేమో. ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ మేరకు మార్పులు చేర్పులు చేయడానికే ఐదు నెలలు సమయం తీసుకున్నారని అంతా భావించారు. రిలీజ్ ముంగిట ప్రి రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ మాట్లాడినపుడు కూడా సినిమా వాయిదా పడ్డాక దర్శకుడు ఓం రౌత్, ఇతర టీం సభ్యులు రేయింబవళ్లు నిద్రాహారాలు మాని కష్టపడ్డట్లుగా చెప్పాడు.
ఆ మాటల్ని బట్టి చూస్తే విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మాత్రం కరెక్షన్లు జరిగినట్లు.. రావణుడిలా కాకుండా అల్లా ఉద్దీన్ ఖిల్జీ లాగా కనిపించిన సైఫ్ అలీ ఖాన్ మేకప్ విషయంలో జాగ్రత్త పడ్డట్లు భావించారు అందరూ. అలాగే కొన్ని ముఖ్య సన్నివేశాలను రీషూట్ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ట్రైలర్ చూస్తే టీజర్తో పోలిస్తే బెటర్గా కనిపించడంతో ‘ఆదిపురుష్’ ఔట్ పుట్ మారిపోయి ఉంటుందని అంచనా వేశారు. కానీ తీరా సినిమా చూస్తే.. ఐదు నెలలు సినిమాను వాయిదా వేసి వీళ్లేం చేశారసలు అని ఆశ్చర్యపోతున్నారు జనాలు.
చిన్న చిన్న కరెక్షన్లు మినహాయిస్తే.. ప్రేక్షకుల అభ్యంతరాలను పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. సైఫ్ అలీ ఖాన్ గెటప్, మేకప్ ఏమాత్రం మెరుగుపడలేదు. విజువల్ ఎఫెక్ట్స్ సంగతి సరేసరి. మరి సినిమాను ఎందుకు వాయిదా వేసినట్లు.. వీళ్లు ఏం మార్పులు చేర్పులు చేసినట్లు అన్నది అంతుబట్టడం లేదు. టీజర్లో ఒక వరుసలో ఉన్న రావణుడి పది తలలు.. రెండు వరసల్లోకి మార్చడం తప్పితే.. ఓం రౌత్ అండ్ టీం చేసిందేమీ లేదంటూ నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.
This post was last modified on June 18, 2023 7:02 pm
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…
ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ టాపిక్గా మారుతుందో.. దేని మీద నెటిజన్లు చర్చలు పెడతారో చెప్పలేం. కొన్నిసార్లు ఎప్పటివో…