రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్నది కాంగ్రెస్ పట్టుదల. ఒకవేళ మళ్ళీ ఓడిపోతే పార్టీ పరిస్ధితి ఏమిటో అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే ఇఫ్పటికే రెండు వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. అందుకనే బలమైన నేతలు, ప్రజాధరణ ఉన్న నేతలు అనుకున్న వాళ్ళని ఏదో పద్దతిలో పార్టీలో చేర్చుకుంటోంది. ఇదే సమయంలో కర్నాటక ఎన్నికల్లో ఘనవిజయం సాధించటంతో తెలంగాణాలో కాంగ్రెస్ ఊపు ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో కొందరు బలమైన నేతలు కాంగ్రెస్ లో చేరటానికి మొగ్గుచూపుతున్నారు.
ఇందులో భాగంగానే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఈనెల 30వ తేదీన ఖమ్మంలోనే బహిరంగసభ ఏర్పాటుచేసి తన మద్దతుదారులతో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీ అయిపోయారు. రెండు, మూడురోజులుగా వరుసగా కాంగ్రెస్ సీనియర్లతో భేటీ అవుతున్నారు. సో, పొంగులేటి కాంగ్రెస్ లో చేరటం ఖాయమైపోయింది. అయితే ఎక్కడినుండి పోటీచేస్తారు ? ఇపుడిదే సస్పెన్సుగా మారింది.
జిల్లాలో పొంగులేటి పోటీచేయబోయే నియోజకవర్గాలపై హాట్ టాపిక్ నడుస్తోంది. పార్టీవర్గాల సమాచారం ఏమిటంటే ఖమ్మం లేదా కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడో ఒకచోట నుండి పోటీచేస్తారట. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలు వేరన్న విషయం తెలిసిందే. ఖమ్మం పొంగులేటి సొంతూరు. పైగా మంత్రి పువ్వాడ అజయ్ కూడా ఖమ్మం వాసే. వచ్చే ఎన్నికల్లో అజయ్ ఖమ్మం లోనే పోటీ చేస్తారు. కాబట్టి మంత్రిని ఓడించాలంటే తాను ఖమ్మంలోనే పోటీచేయాలని అనుకుంటున్నారట.
ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం నియోజకవర్గంలో కూడా పొంగులేటికి బలమైన మద్దతుదారులున్నారు. ఇక్కడి నుండి బీఆర్ఎస్ పోటీ చేయాలా లేకపోతే పొత్తుకుదిరితే సీపీఐ పోటీచేయాలా అనేది తేలలేదు. బహుశా రెండుపార్టీలు పోటీలో ఉండేట్లే ఉంది. అందుకనే కాంగ్రెస్ తరపున పొంగులేటి పోటీచేస్తే గెలుపు చాలా సులభమవుతుందని మద్దతుదారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో పినపాక, అశ్వారావుపేట, ఇల్లెందు నియోజకవర్గాల్లో పొంగులేటి మద్దతుదారులకు టికెట్లు ఇవ్వటానికి అధిష్టానం అంగీకరించినట్లు ప్రచారంలో ఉంది. ప్రచారమే నిజమైతే పొంగులేటికి అధిష్టానం బాగా ప్రాధాన్యత ఇచ్చినట్లే అనుకోవాలి.
This post was last modified on June 18, 2023 4:48 pm
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నో పొగిడితేనో..…