ఆదిపురుష్ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కిందని అందరికీ తెలుసు. మొదట్నుంచి దీన్ని రామాయణం మీద సినిమాగానే ప్రమోట్ చేస్తున్నారు. ఇందులో తాను రాముడి పాత్ర చేశానని ప్రభాస్ స్వయంగా వేదిక మీద చెప్పాడు. సినిమాలో జై శ్రీరామ్ జైశ్రీరామ్ అనే పాట ఉంది. కాకపోతే ప్రధాన పాత్రలకు రాముడు, సీత, హనుమంతుడు, రావణుడు అని కాకుండా.. రాఘవుడు, జానకి, భజరంగ్, లంకేశ్వరుడు అనే ఆయా పాత్రలకున్న వేరే పేర్లను పెట్టారు.
రిలీజ్ రోజు వరకు ఈ సినిమాను రామాయణ గాథగానే ప్రచారం చేసి.. ఇప్పుడేమో ఉన్నట్లుండి ఇది రామాయణం కాదు అంటూ ప్టేట్ మార్చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఆదిపురుష్ రచయితల్లో ఒకరైన మనోజ్ ముంతాషిర్ శుక్లా ఒక టీవీ ఛానెల్ చర్చా కార్యక్రమంలో పేర్కొనడం గమనార్హం. ఆదిపురుష్ రిలీజ్ అయిన దగ్గర్నుంచి ఇదేం రామాయణం.. రామాయణ గాథను ఇలాగేనా తీసేది.. రావణుడేంటి అలా ఉన్నాడు.. హనుమంతుడి డైలాగ్స్ ఇంత దారుణమా అంటూ ప్రేక్షకులు చిత్ర బృందం మీద విరుచుకుపడుతున్నారు.
అనేక సన్నివేశాలు.. పాత్రలు.. ఇతర అంశాల మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఒక టీవీ చానెల్ చర్చలో యాంకర్ ప్రస్తావిస్తే.. రచయిత మనోజ్ ముంతాషిర్ చిత్రమైన వాదన చేశాడు. తాము రామాయణం నుంచి చాలా వరకు స్ఫూర్తి పొందిన మాట వాస్తవమే అయినా.. తాము తీసింది మాత్రం రామాయణ కథను కాదని.. ఇది కల్పిత కథ అన్నట్లుగా మాట్లాడాడు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. రామాయణం పేరుతో జనాలను ఉద్వేగానికి గురి చేసి.. సినిమాను ఆ కోణంలోనే ప్రచారం చేసుకుని.. హనుమంతుడి సీట్ అంటూ ప్రచారాన్ని పీక్స్కు తీసుకెళ్లి ఇప్పుడు ఇది రామాయణం కాదు అనడం ఏంటంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు చిత్ర బృందం మీద.
This post was last modified on June 18, 2023 10:06 am
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…